ఇప్పుడు హార్రర్, హార్రర్ కామెడీ సినిమాలు తీసే దర్శకులు చాలామంది ఉన్నారు. ఐతే ఒకప్పుడు హార్రర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ. ఆయన తీసిన ‘రాత్రి’ సినిమా మామూలు సంచలనం రేపలేదు. ప్రేక్షకులను థియేటర్లలో వణికించేసి.. భయంతో పారిపోయేలా చేసిన సినిమా ఇది. అదే కాక దెయ్యం, భూత్, కౌన్, ఫూంక్, ఫూంక్-2.. ఇలా హార్రర్ జానర్లో చాలా సినిమాలే చేశాడు వర్మ. అందుకేనేమో తమిళ అనువాద చిత్రం ‘డిమాంటి కాలనీ-2’కు సంబంధించిన తెలుగు ప్రమోషనల్ ఈవెంట్కు వర్మను ముఖ్య అతిథిగా పిలిచింది చిత్ర బృందం.
ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ.. ‘డిమాంటి కాలనీ’ సినిమా తీసినపుడు ఆ పేరుతో చెన్నైలో ఓ కాలనీ ఉండడంతో టైటిల్ విషయంలో ఇబ్బంది పడినట్లు తనకు చెప్పాడని తెలిపాడు. మరి ‘డిమాంటి కాలనీ’ రిలీజయ్యాక ఆ కాలనీ వాళ్లంతా చెన్నై నుంచి వెళ్లిపోయారో లేదో తెలియదన్నాడు. కానీ తాను ‘భూత్’ సినిమాలో ముంబయిలోని ఓ అపార్ట్మెంట్లో తీశానని.. ఆ తర్వాత ఆ అపార్ట్మెంట్ అంటే అందరికీ భయం పట్టుకుందని.. దీంతో తర్వాత ఎవ్వరూ దాన్ని కొనడానికి ముందుకు రాలేదని వర్మ తెలిపాడు. ఇప్పటికీ ముంబయిలో ఆ అపార్ట్మెంట్ అమ్ముడవకుండా అలాగే ఉండిపోయిందని వర్మ ఆశ్చర్యకర విషయం వెల్లడించాడు.
‘డిమాంటి కాలనీ-2’ తమిళ వెర్షన్ గురించి తాను చాలా మంచి విషయాలు విన్నానని.. తమిళంలో మాదిరే తెలుగులోనూ ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నానని.. ఈ మధ్య చిన్న సినిమాలు చాలా బాగా ఆడుతున్నాయని వర్మ పేర్కొన్నాడు. అరుళ్ నిధి, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన ‘డిమాంటి కాలనీ-2’ తమిళంలో ఆల్రెడీ హిట్ అయింది. శుక్రవారం తెలుగులో విడుదల కానుంది.
This post was last modified on August 22, 2024 10:01 am
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…