ఇప్పుడు హార్రర్, హార్రర్ కామెడీ సినిమాలు తీసే దర్శకులు చాలామంది ఉన్నారు. ఐతే ఒకప్పుడు హార్రర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ. ఆయన తీసిన ‘రాత్రి’ సినిమా మామూలు సంచలనం రేపలేదు. ప్రేక్షకులను థియేటర్లలో వణికించేసి.. భయంతో పారిపోయేలా చేసిన సినిమా ఇది. అదే కాక దెయ్యం, భూత్, కౌన్, ఫూంక్, ఫూంక్-2.. ఇలా హార్రర్ జానర్లో చాలా సినిమాలే చేశాడు వర్మ. అందుకేనేమో తమిళ అనువాద చిత్రం ‘డిమాంటి కాలనీ-2’కు సంబంధించిన తెలుగు ప్రమోషనల్ ఈవెంట్కు వర్మను ముఖ్య అతిథిగా పిలిచింది చిత్ర బృందం.
ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ.. ‘డిమాంటి కాలనీ’ సినిమా తీసినపుడు ఆ పేరుతో చెన్నైలో ఓ కాలనీ ఉండడంతో టైటిల్ విషయంలో ఇబ్బంది పడినట్లు తనకు చెప్పాడని తెలిపాడు. మరి ‘డిమాంటి కాలనీ’ రిలీజయ్యాక ఆ కాలనీ వాళ్లంతా చెన్నై నుంచి వెళ్లిపోయారో లేదో తెలియదన్నాడు. కానీ తాను ‘భూత్’ సినిమాలో ముంబయిలోని ఓ అపార్ట్మెంట్లో తీశానని.. ఆ తర్వాత ఆ అపార్ట్మెంట్ అంటే అందరికీ భయం పట్టుకుందని.. దీంతో తర్వాత ఎవ్వరూ దాన్ని కొనడానికి ముందుకు రాలేదని వర్మ తెలిపాడు. ఇప్పటికీ ముంబయిలో ఆ అపార్ట్మెంట్ అమ్ముడవకుండా అలాగే ఉండిపోయిందని వర్మ ఆశ్చర్యకర విషయం వెల్లడించాడు.
‘డిమాంటి కాలనీ-2’ తమిళ వెర్షన్ గురించి తాను చాలా మంచి విషయాలు విన్నానని.. తమిళంలో మాదిరే తెలుగులోనూ ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నానని.. ఈ మధ్య చిన్న సినిమాలు చాలా బాగా ఆడుతున్నాయని వర్మ పేర్కొన్నాడు. అరుళ్ నిధి, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన ‘డిమాంటి కాలనీ-2’ తమిళంలో ఆల్రెడీ హిట్ అయింది. శుక్రవారం తెలుగులో విడుదల కానుంది.
This post was last modified on August 22, 2024 10:01 am
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…