ఇప్పుడు హార్రర్, హార్రర్ కామెడీ సినిమాలు తీసే దర్శకులు చాలామంది ఉన్నారు. ఐతే ఒకప్పుడు హార్రర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ. ఆయన తీసిన ‘రాత్రి’ సినిమా మామూలు సంచలనం రేపలేదు. ప్రేక్షకులను థియేటర్లలో వణికించేసి.. భయంతో పారిపోయేలా చేసిన సినిమా ఇది. అదే కాక దెయ్యం, భూత్, కౌన్, ఫూంక్, ఫూంక్-2.. ఇలా హార్రర్ జానర్లో చాలా సినిమాలే చేశాడు వర్మ. అందుకేనేమో తమిళ అనువాద చిత్రం ‘డిమాంటి కాలనీ-2’కు సంబంధించిన తెలుగు ప్రమోషనల్ ఈవెంట్కు వర్మను ముఖ్య అతిథిగా పిలిచింది చిత్ర బృందం.
ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ.. ‘డిమాంటి కాలనీ’ సినిమా తీసినపుడు ఆ పేరుతో చెన్నైలో ఓ కాలనీ ఉండడంతో టైటిల్ విషయంలో ఇబ్బంది పడినట్లు తనకు చెప్పాడని తెలిపాడు. మరి ‘డిమాంటి కాలనీ’ రిలీజయ్యాక ఆ కాలనీ వాళ్లంతా చెన్నై నుంచి వెళ్లిపోయారో లేదో తెలియదన్నాడు. కానీ తాను ‘భూత్’ సినిమాలో ముంబయిలోని ఓ అపార్ట్మెంట్లో తీశానని.. ఆ తర్వాత ఆ అపార్ట్మెంట్ అంటే అందరికీ భయం పట్టుకుందని.. దీంతో తర్వాత ఎవ్వరూ దాన్ని కొనడానికి ముందుకు రాలేదని వర్మ తెలిపాడు. ఇప్పటికీ ముంబయిలో ఆ అపార్ట్మెంట్ అమ్ముడవకుండా అలాగే ఉండిపోయిందని వర్మ ఆశ్చర్యకర విషయం వెల్లడించాడు.
‘డిమాంటి కాలనీ-2’ తమిళ వెర్షన్ గురించి తాను చాలా మంచి విషయాలు విన్నానని.. తమిళంలో మాదిరే తెలుగులోనూ ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నానని.. ఈ మధ్య చిన్న సినిమాలు చాలా బాగా ఆడుతున్నాయని వర్మ పేర్కొన్నాడు. అరుళ్ నిధి, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన ‘డిమాంటి కాలనీ-2’ తమిళంలో ఆల్రెడీ హిట్ అయింది. శుక్రవారం తెలుగులో విడుదల కానుంది.
This post was last modified on August 22, 2024 10:01 am
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…