Movie News

రావు రమేష్ సోషల్ మీడియాలో ఎందుకు లేడు?

హీరోల కొడుకులు హీరోలవుతారు. స్టార్లుగా ఎదుగుతారు. కానీ క్యారెక్టర్ ఆర్టిస్టుల కొడుకులు తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ.. అలాంటి పాత్రలే చేయడం, తండ్రి స్థాయిని అందుకోవడం అరుదుగా జరుగుతుంటుంది. లెజెండరీ నటుడు రావు గోపాల్రావు తనయుడు రావు రమేష్ ఈ అరుదైన జాబితాలోకే వస్తారు.

విశేషం ఏంటంటే.. రావు గోపాల్రావు జీవించి ఉండగా రావు రమేష్ నటనలోకి అడుగుపెట్టలేదు. ఆయన మరణానంతరం కూడా తండ్రి పేరు చెప్పుకుని సినిమాల్లోకి రాలేదు. ఒక కొత్త నటుడిలాగే వచ్చాడు. చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి నటుడిగా గొప్ప స్థాయిని అందుకుని బిజీ ఆర్టిస్టుల్లో ఒకడయ్యాడు. ఐతే ఎంత ఎదిగినా ఒదిగే ఉండే రావు రమేష్ మీడియాలో పెద్దగా కనిపించరు. సోషల్ మీడియాలో అయితే అసలే ఉండరు. రావు రమేష్ ఇంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడం చాలామందికి ఆశ్చర్యం కలిగించే విషయం.

కాగా తాను తొలిసారి లీడ్ రోల్ చేసిన ‘మారుతినగర్ సుబ్రహ్మణ్యం’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన రావు రమేష్‌కు యాంకర్ సుమ నుంచి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఇంత పాపులర్ నటుడైన మీరు సోషల్ మీడియాలో ఎందుకు లేరు అని ప్రశ్నించిందామె. దానికాయన బదులిస్తూ.. “మన పరిశ్రమలో టాప్ డైరెక్టర్లలో ఒకరైన వ్యక్తి తమ దగ్గర లేని విలువైంది ఒకటి మీ దగ్గర ఉంది అని చెప్పాడు. అదే.. ప్రైవసీ. సోషల్ మీడియాలో ఉండడం ద్వారా తాము ప్రైవసీ కోల్పోయామని.. మీకు ఆ సమస్య లేదని ఆయనన్నాడు. సోషల్ మీడియాలోకి వస్తే ప్రైవసీ, ప్రశాంతత రెండూ కోల్పోతామనే నేను అందులోకి రాలేదు” అని రావు రమేష్ చెప్పాడు.

ఐతే మీరు మాత్రం అలా ప్రశాంతంగా ఎలా ఉంటారు.. సోషల్ మీడియాలోకి రావాల్సిందే అంటూ సుమ సరదాగా పట్టుబట్టగా.. ఐతే త్వరలోనే వచ్చేస్తా అని రావు రమేష్ చెప్పడం విశేషం. ‘మారుతినగర్ సుబ్రహ్మణ్యం’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

This post was last modified on August 22, 2024 9:53 am

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

2 hours ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

2 hours ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

3 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

4 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

4 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

4 hours ago