హీరోల కొడుకులు హీరోలవుతారు. స్టార్లుగా ఎదుగుతారు. కానీ క్యారెక్టర్ ఆర్టిస్టుల కొడుకులు తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ.. అలాంటి పాత్రలే చేయడం, తండ్రి స్థాయిని అందుకోవడం అరుదుగా జరుగుతుంటుంది. లెజెండరీ నటుడు రావు గోపాల్రావు తనయుడు రావు రమేష్ ఈ అరుదైన జాబితాలోకే వస్తారు.
విశేషం ఏంటంటే.. రావు గోపాల్రావు జీవించి ఉండగా రావు రమేష్ నటనలోకి అడుగుపెట్టలేదు. ఆయన మరణానంతరం కూడా తండ్రి పేరు చెప్పుకుని సినిమాల్లోకి రాలేదు. ఒక కొత్త నటుడిలాగే వచ్చాడు. చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి నటుడిగా గొప్ప స్థాయిని అందుకుని బిజీ ఆర్టిస్టుల్లో ఒకడయ్యాడు. ఐతే ఎంత ఎదిగినా ఒదిగే ఉండే రావు రమేష్ మీడియాలో పెద్దగా కనిపించరు. సోషల్ మీడియాలో అయితే అసలే ఉండరు. రావు రమేష్ ఇంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడం చాలామందికి ఆశ్చర్యం కలిగించే విషయం.
కాగా తాను తొలిసారి లీడ్ రోల్ చేసిన ‘మారుతినగర్ సుబ్రహ్మణ్యం’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్కు వచ్చిన రావు రమేష్కు యాంకర్ సుమ నుంచి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఇంత పాపులర్ నటుడైన మీరు సోషల్ మీడియాలో ఎందుకు లేరు అని ప్రశ్నించిందామె. దానికాయన బదులిస్తూ.. “మన పరిశ్రమలో టాప్ డైరెక్టర్లలో ఒకరైన వ్యక్తి తమ దగ్గర లేని విలువైంది ఒకటి మీ దగ్గర ఉంది అని చెప్పాడు. అదే.. ప్రైవసీ. సోషల్ మీడియాలో ఉండడం ద్వారా తాము ప్రైవసీ కోల్పోయామని.. మీకు ఆ సమస్య లేదని ఆయనన్నాడు. సోషల్ మీడియాలోకి వస్తే ప్రైవసీ, ప్రశాంతత రెండూ కోల్పోతామనే నేను అందులోకి రాలేదు” అని రావు రమేష్ చెప్పాడు.
ఐతే మీరు మాత్రం అలా ప్రశాంతంగా ఎలా ఉంటారు.. సోషల్ మీడియాలోకి రావాల్సిందే అంటూ సుమ సరదాగా పట్టుబట్టగా.. ఐతే త్వరలోనే వచ్చేస్తా అని రావు రమేష్ చెప్పడం విశేషం. ‘మారుతినగర్ సుబ్రహ్మణ్యం’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…
విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…
తెలంగాణ నాయకురాలు, తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున…
పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…