హీరోల కొడుకులు హీరోలవుతారు. స్టార్లుగా ఎదుగుతారు. కానీ క్యారెక్టర్ ఆర్టిస్టుల కొడుకులు తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ.. అలాంటి పాత్రలే చేయడం, తండ్రి స్థాయిని అందుకోవడం అరుదుగా జరుగుతుంటుంది. లెజెండరీ నటుడు రావు గోపాల్రావు తనయుడు రావు రమేష్ ఈ అరుదైన జాబితాలోకే వస్తారు.
విశేషం ఏంటంటే.. రావు గోపాల్రావు జీవించి ఉండగా రావు రమేష్ నటనలోకి అడుగుపెట్టలేదు. ఆయన మరణానంతరం కూడా తండ్రి పేరు చెప్పుకుని సినిమాల్లోకి రాలేదు. ఒక కొత్త నటుడిలాగే వచ్చాడు. చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి నటుడిగా గొప్ప స్థాయిని అందుకుని బిజీ ఆర్టిస్టుల్లో ఒకడయ్యాడు. ఐతే ఎంత ఎదిగినా ఒదిగే ఉండే రావు రమేష్ మీడియాలో పెద్దగా కనిపించరు. సోషల్ మీడియాలో అయితే అసలే ఉండరు. రావు రమేష్ ఇంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడం చాలామందికి ఆశ్చర్యం కలిగించే విషయం.
కాగా తాను తొలిసారి లీడ్ రోల్ చేసిన ‘మారుతినగర్ సుబ్రహ్మణ్యం’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్కు వచ్చిన రావు రమేష్కు యాంకర్ సుమ నుంచి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఇంత పాపులర్ నటుడైన మీరు సోషల్ మీడియాలో ఎందుకు లేరు అని ప్రశ్నించిందామె. దానికాయన బదులిస్తూ.. “మన పరిశ్రమలో టాప్ డైరెక్టర్లలో ఒకరైన వ్యక్తి తమ దగ్గర లేని విలువైంది ఒకటి మీ దగ్గర ఉంది అని చెప్పాడు. అదే.. ప్రైవసీ. సోషల్ మీడియాలో ఉండడం ద్వారా తాము ప్రైవసీ కోల్పోయామని.. మీకు ఆ సమస్య లేదని ఆయనన్నాడు. సోషల్ మీడియాలోకి వస్తే ప్రైవసీ, ప్రశాంతత రెండూ కోల్పోతామనే నేను అందులోకి రాలేదు” అని రావు రమేష్ చెప్పాడు.
ఐతే మీరు మాత్రం అలా ప్రశాంతంగా ఎలా ఉంటారు.. సోషల్ మీడియాలోకి రావాల్సిందే అంటూ సుమ సరదాగా పట్టుబట్టగా.. ఐతే త్వరలోనే వచ్చేస్తా అని రావు రమేష్ చెప్పడం విశేషం. ‘మారుతినగర్ సుబ్రహ్మణ్యం’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on August 22, 2024 9:53 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…