Movie News

బన్నీ సుకుమార్ చెప్పిన పుష్ప కబుర్లు

పుష్ప 2 ది రూల్ పూర్తి చేయడం మీద ఎంత ఒత్తిడి ఉందో దర్శకుడు సుకుమార్ మాటల్లో అర్థమవుతోంది. నిన్న జరిగిన మారుతినగర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ ప్రసంగం మొదలుపెట్టే సమయంలో అల్లు అర్జున్ అభిమానులు బాగా అరిచేశారు.

పుష్ప 2 క్లైమాక్స్ తీస్తున్నామని, ఇప్పుడు డిస్టర్బ్ చేస్తే ఇబ్బంది పడాలని చెప్పడం చూస్తే ఎంత ప్రెజర్ ఉందో తేటతెల్లమవుతోంది. ఆ మధ్య హీరో దర్శకుడి మధ్య ఏదో విభేదం వచ్చిందని, దాని వల్లే బన్నీ గెడ్డం తీశాడని పలురకాల ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. నిన్న ఆ మబ్బులన్నీ వీడిపోయాయి. వీళ్ళ బాండింగ్ మరోసారి బయటపడింది.

ఇంకొన్ని కబుర్లు కూడా సుకుమార్ పంచుకున్నారు. పుష్ప 2తో ఆగదని ఇంకో అయిదారు భాగాలు తీస్తామని సరదాగా అన్నారు. పక్కనే షాక్ తిన్నట్టుగా ఉన్న బన్నీ ఎక్స్ ప్రెషన్ చూడాలి.

అల్లు అర్జున్ సైతం తన స్పీచ్ లో డిసెంబర్ 6 తగ్గేదేలే అంటూ ప్రత్యేకంగా ఎలివేషన్లు ఇవ్వడం ఒక్కసారిగా అభిమానుల్లో ఉత్సాహాన్ని తెచ్చింది. మాములుగా తన సినిమాల గురించి మాట్లాడేందుకు భయపడతానని కానీ ఈసారి అలా కాదని చెబుతూ ఇకపై ఇప్పట్లా కాకుండా వేగంగా ఎక్కువ సినిమాలు చేసేందుకు ప్లాన్ చేస్తానని చెప్పడంలో పుష్ప ఆలస్యానికి చింతిస్తున్న పరమార్ధం వినిపించింది.

పేరుకి రావు రమేష్ మూవీ ఈవెంట్ అయినా సోషల్ మీడియాలో పుష్ప ముచ్చట్లు, అల్లు అర్జున్ స్పీచ్ తోనే హాట్ డిస్కషన్లు జరిగిపోయాయి. దీని వల్ల మారుతినగర్ సుబ్రహ్మణ్యంకు ఎలాంటి మైలేజ్ వస్తుందో చూడాలి.

పెద్దగా చెప్పుకునే కొత్త చిత్రాలు లేకపోవడంతో టాక్ కనక బాగా వస్తే మంచి వసూళ్లను ఆశించవచ్చు. లక్కీగా ఇంద్ర రీ రిలీజ్ గురువారమే జరగడం మరో కలిసి వచ్చే అంశం. ఆ హడావిడి రేపటికి దాదాపుగా తగ్గిపోతుంది. పోటీ లేని అవకాశాన్ని ఎలా వాడుకుంటారో చూడాలి. డబ్బింగ్ మూవీ డిమాంటి కాలనీ 2 తప్ప ప్రత్యేకంగా ఆడియన్స్ దృష్టిలో ఇంకేం లేవు.

This post was last modified on August 22, 2024 7:46 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

22 minutes ago

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

2 hours ago

కూట‌మికి `బ్ర‌హ్మాస్త్రం` ఇచ్చేసిన‌ ప‌య్యావుల ..!

కూట‌మి నాయ‌కుల‌కు ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ కీల‌క రాజ‌కీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానిక‌రం`` అంటూ..…

2 hours ago

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కౌంట్ డౌన్?

వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…

4 hours ago

ధనుష్‌ను ఆకాశానికెత్తేసిన మృణాల్

తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…

4 hours ago

తారక్, ప్రభాస్ ఇద్దరూ పునుగుల పిచ్చోళ్లే

టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్‌ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…

4 hours ago