తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కుటుంబం, టీఆర్ఎస్ నేతలు, వారికి అనుకూలంగా ఉన్నవాళ్లుె గత పదేళ్ల వ్యవధిలో చేసిన అక్రమాల మీద ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. కాళేశ్వరం సహా పలు అంశాల్లో కేసీఆర్ అండ్ కోను ఇరుకున పెట్టేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది.
అంతే కాక హైదరాబాద్లో గత ప్రభుత్వ మద్దతుగా సాగిన అక్రమ కట్టడాల మీద కూడా స్పెషల్ ఫోకస్ పెట్టింది. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించేందుకు ఏర్పాటు చేసిన హైడ్రా వింగ్ దూకుడుగా వ్యవహరిస్తోంది. అక్రమ కట్టడాలను గుర్తించి వెంటనే కూల్చివేస్తోంది. తాజాగా కేటీఆర్కు చెందినదిగా భావిస్తున్న జవ్వాడ ఫామ్ హౌస్ అక్రమం అంటూ కూల్చివేయడానికి రంగం సిద్ధమైంది. ఐతే దీనికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లడం కూడా తెలిసిన సంగతే.
ఇదిలా ఉంటే కొందరు సెలబ్రెటీలు అక్రమంగా నిర్మించిన కట్టడాల మీద కూడా హైడ్రా దృష్టిసారించినట్లు తెలుస్తోంది. అందులో అక్కినేని నాగార్జుకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ కన్వెన్షన్ సెంటర్ మీద ఎప్పట్నుంచో వివాదాలున్నాయి. తమ్మిడి చెరువులో 3 ఎకరాల 30 గుంటలను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ను నిర్మించారని హైడ్రాకు ఎప్పట్నుంచో ఫిర్యాదులు వస్తున్నాయి. ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూల్చివేయాలని హైడ్రా కమిషనర్కు జనం కోసం అనే సంస్థ ఫిర్యాదు చేసింది. గతంలోనే దీనిపై చర్యలకు ఉపక్రమించారని.. కానీ మధ్యలో ఆపేశారని.. ఇప్పుడు దీని మీద దృష్టిసారించాలంటూ ఇది అక్రమ కట్టడం అనడానికి రుజువులు కూడా చూపిస్తోంది జనం కోసం సంస్థ.
నాగార్జున గతంలో ప్రభుత్వ అధినేతలకు సన్నిహితంగా మెలగడం ద్వారా కన్వెన్షన్ సెంటర్కు ఇబ్బంది రాకుండా చూసుకున్నారని ఈ సంస్థ ఆరోపిస్తోంది. మరి రేవంత్ రెడ్డి సర్కారు ఒక పెద్ద సెలబ్రెటీకి చెందిన కన్వెన్షన్ సెంటర్ను కూల్చేంత సాహసం చేస్తుందా అన్నది ఇప్పుడు ప్రశ్న.
This post was last modified on August 21, 2024 4:57 pm
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…