తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కుటుంబం, టీఆర్ఎస్ నేతలు, వారికి అనుకూలంగా ఉన్నవాళ్లుె గత పదేళ్ల వ్యవధిలో చేసిన అక్రమాల మీద ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. కాళేశ్వరం సహా పలు అంశాల్లో కేసీఆర్ అండ్ కోను ఇరుకున పెట్టేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది.
అంతే కాక హైదరాబాద్లో గత ప్రభుత్వ మద్దతుగా సాగిన అక్రమ కట్టడాల మీద కూడా స్పెషల్ ఫోకస్ పెట్టింది. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించేందుకు ఏర్పాటు చేసిన హైడ్రా వింగ్ దూకుడుగా వ్యవహరిస్తోంది. అక్రమ కట్టడాలను గుర్తించి వెంటనే కూల్చివేస్తోంది. తాజాగా కేటీఆర్కు చెందినదిగా భావిస్తున్న జవ్వాడ ఫామ్ హౌస్ అక్రమం అంటూ కూల్చివేయడానికి రంగం సిద్ధమైంది. ఐతే దీనికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లడం కూడా తెలిసిన సంగతే.
ఇదిలా ఉంటే కొందరు సెలబ్రెటీలు అక్రమంగా నిర్మించిన కట్టడాల మీద కూడా హైడ్రా దృష్టిసారించినట్లు తెలుస్తోంది. అందులో అక్కినేని నాగార్జుకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ కన్వెన్షన్ సెంటర్ మీద ఎప్పట్నుంచో వివాదాలున్నాయి. తమ్మిడి చెరువులో 3 ఎకరాల 30 గుంటలను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ను నిర్మించారని హైడ్రాకు ఎప్పట్నుంచో ఫిర్యాదులు వస్తున్నాయి. ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూల్చివేయాలని హైడ్రా కమిషనర్కు జనం కోసం అనే సంస్థ ఫిర్యాదు చేసింది. గతంలోనే దీనిపై చర్యలకు ఉపక్రమించారని.. కానీ మధ్యలో ఆపేశారని.. ఇప్పుడు దీని మీద దృష్టిసారించాలంటూ ఇది అక్రమ కట్టడం అనడానికి రుజువులు కూడా చూపిస్తోంది జనం కోసం సంస్థ.
నాగార్జున గతంలో ప్రభుత్వ అధినేతలకు సన్నిహితంగా మెలగడం ద్వారా కన్వెన్షన్ సెంటర్కు ఇబ్బంది రాకుండా చూసుకున్నారని ఈ సంస్థ ఆరోపిస్తోంది. మరి రేవంత్ రెడ్డి సర్కారు ఒక పెద్ద సెలబ్రెటీకి చెందిన కన్వెన్షన్ సెంటర్ను కూల్చేంత సాహసం చేస్తుందా అన్నది ఇప్పుడు ప్రశ్న.
This post was last modified on August 21, 2024 4:57 pm
దురంధర్ ది రివెంజ్ విడుదలయ్యాక ఈ సినిమాలోని పాటలు చాలా వైరల్ అవుతున్నాయి. మొదటి భాగంలోనూ ఛార్ట్ బస్టర్స్ ఉన్నప్పటికీ…
తన వందో సినిమాను చడీ చప్పుడు లేకుండా మొదలుపెట్టి.. చకచకా పూర్తి చేసేస్తున్నాడు టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున.…
ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ పెద్ది ఏప్రిల్ 30 రావడం లేదనే వార్త సోషల్ మీడియాని కుదిపేస్తోంది. ఖచ్చితంగా రిలీజ్…
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, దీనికి సంబంధించి నియమించిన పీసీ ఘోష్ నివేదిక అంశాలపై తెలంగాణ అసెంబ్లీలో నిన్న స్వల్పకాలిక చర్చ…
విశాఖపట్నం గాజువాక పరిధిలోని ఎల్వీ నగర్లో దారుణ ఘటన వెలుగుచూసింది. నేవీ ఉద్యోగి రవీంద్ర తనకు పరిచయమైన మౌనిక (29)ను…
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ రంగంలో అడుగు పెట్టి.. హీరోగా ఒక స్థాయి అందుకోవడం తేలికైన విషయం కాదు. చాలా…