టాలీవుడ్ సినిమాలకు సంగీత దర్శకత్వం వహించే ముందు వరసలో తమన్, దేవిశ్రీ ప్రసాద్ లాంటి ఒకరిద్దరి పేర్లే ఎక్కువ హైలైట్ అవుతున్నప్పటికీ క్రమంగా ఈ ట్రెండ్ లో మార్పొస్తోంది. ఇతర భాషల నుంచి మ్యూజిక్ డైరెక్టర్లు తమదైన ముద్ర వేసేందుకు బలంగా ప్రయత్నిస్తున్నారు. కల్కి 2898 ఏడి లాంటి భారీ భాద్యత నాగ్ అశ్విన్ కోరిమరీ సంతోష్ నారాయణన్ చేతిలో పెట్టడానికి కారణం అదే. సలార్ కి స్కోర్ ఇచ్చింది శాండల్ వుడ్ లో పేరొందిన రవి బస్రూర్. ఇప్పుడదే తరహాలో జేక్స్ బెజోయ్ పేరు మారుమ్రోగుతుందని న్యాచురల్ స్టార్ నాని వ్యక్తం చేస్తున్న నమ్మకం బలంగా ఉంది.
ఆగస్ట్ 29 విడుదల కాబోతున్న సరిపోదా శనివారంకి అతను ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు థియేటర్లను మ్యూజిక్ కన్సర్ట్ లా మార్చేస్తాయని చెప్పడం చూస్తే అవుట్ ఫుట్ ఓ రేంజ్ లో వచ్చిందని అర్థమవుతోంది. శాంపిల్ ఆల్రెడీ ట్రైలర్ లో చూసేశాం కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ నిజమే అనిపిస్తోంది. ఆ మధ్య విశ్వక్ సేన్ సైతం తన మెకానిక్ రాకీకి జేక్స్ బెజోయ్ ఇచ్చిన ఆల్బమ్ గురించి చెబుతూ కెరీర్ లో బెస్ట్ అవుతుందనే రేంజ్ లో ఊరించాడు. ఈ స్థాయిలో రిలీజ్ కు ముందు టాలీవుడ్ హీరోలతో ప్రశంసలు అందుకున్న పక్క రాష్ట్రం సంగీత దర్శకులు ఈ మధ్య కాలంలో అయితే లేరు.
అయితే జేక్స్ బెజోయ్ తెలుగులో పని చేయడం ఇది మొదటిసారి కాదు. విజయ్ దేవరకొండ టాక్సీ వాలాతోనే రుజువు చేసుకున్నాడు. చావు కబురు చల్లగా, పక్కా కమర్షియల్ ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఒకే ఒక జీవితం మంచి హిట్ అందుకుంది. ఎన్ని ఆఫర్లు వస్తున్నా మలయాళంలో విపరీతమైన బిజీగా ఉండటంతో ఎక్కువ టాలీవుడ్ సినిమాలు చేయడం లేదు. ఇతని విడుదల కావాల్సిన మల్లువుడ్ చిత్రాలు పది దాకా ఉన్నాయంటేనే డిమాండ్ ఏ స్థాయిలో అర్థం చేసుకోవచ్చు. నాని చెప్పింది కనక నిజమే అయితే మాత్రం జేక్స్ బెజోయ్ హ్యాపీగా ఇక్కడే సెటిలైపోయేలా ప్లాన్ చేసుకోవచ్చు.
This post was last modified on August 21, 2024 3:11 pm
ఇప్పుడు మధ్య తరగతి వాళ్లు సైతం కోటి.. అంతకంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వచ్చేశాయి. ధరలు అంతగా…
సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…
‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…
ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…