Movie News

ఓజీ అప్‌డేట్ అడిగిన నాని

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత ఏడాది చివర్లో తన చేతిలో ఉన్న మూడు చిత్రాల షూటింగ్‌ను హోల్డ్‌లో పెట్టేసి.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజీ అయిపోయారు. ఎన్నికలు అయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తర్వాత డిప్యూటీ హోం మినిస్టర్‌గా, నాలుగు శాఖల మంత్రిగా బాధ్యతలు తీసుకుని ఆ వ్యవహారాల్లో తలమునకలు అయిపోయారు జనసేన అధినేత.

ఐతే మధ్యలో ఆగిన తన చిత్రాలను ఎప్పుడు పూర్తి చేస్తారా అని ఆయా చిత్రాల నిర్మాతలతో పాటు అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఒక మూడు నెలలు అయినా పని చేయనివ్వండి, తర్వాత వీలును చూసుకుని సినిమాలు పూర్తి చేస్తా అంటూ ఓ బహిరంగ సమావేశంలో పవన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆ మూడు నెలలు పూర్తి కావస్తున్న నేపథ్యంలో పవన్ మళ్లీ ముఖానికి రంగు ఎప్పుడు వేసుకుంటాడా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

పవన్ రీఎంట్రీ ఏ సినిమాతో ఉంటుందనే ఆసక్తి కూడా నెలకొంది. ఆల్రెడీ ‘హరిహర వీరమల్లు’ చిత్రం ఆల్రెడీ చిత్రీకరణ దశలోకి వెళ్లగా.. ఇప్పుడు ‘ఓజీ’ కూడా అదే బాటలో సాగబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. స్వయంగా ‘ఓజీ’ నిర్మాత డీవీవీ దానయ్య దీని గురించి అప్‌డేట్ ఇచ్చారు. ఆయన ప్రొడక్షన్లో తెరకెక్కిన కొత్త చిత్రం ‘సరిపోదా శనివారం’ మీడియా మీట్‌లో హీరో నాని ‘ఓజీ’ గురించి దానయ్యను అప్‌డేట్ అడగడం విశేషం. దానికాయన బదులిస్తూ.. “ఓజీ త్వరలోనే విడుదల అవుతుంది. షూటింగ్ కూడా అతి త్వరలోనే మళ్లీ మొదలుపెడుతున్నాం” అని చెప్పారు. దీంతో అక్కడున్న అందరిలోనూ హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

ప్రస్తుతం ‘ఓజీ’ టీం కొత్త షెడ్యూల్ కోసం ప్రణాళికలు వేస్తున్నట్లు సమాచారం. పవన్ వీలును బట్టి ‘హరిహర వీరమల్లు’, ‘ఓజీ’ షూటింగ్స్‌లో మార్చి మార్చి పాల్గొంటారని సమాచారం. కాగా సెప్టెంబరు 2న పవన్ పుట్టిన రోజును పురస్కరించుకుని ‘ఓజీ’ నుంచి ఓ పాటను రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.

This post was last modified on August 21, 2024 5:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వేరే ఆఫర్లు వచ్చినా RCBని ఎందుకు వదల్లేదంటే..: కోహ్లీ

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ, తన ఆటపై అభిమానుల ప్రేమ మాత్రం ఏమాత్రం…

37 minutes ago

కూలీ మొదలెట్టాడు…వార్ 2 ఇంకా ఆలస్యమా

ఈ సంవత్సరం ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ క్లాష్ గా ట్రేడ్ అభివర్ణిస్తున్న ఆగస్ట్ 14 జరిగే కూలీ వర్సెస్ వార్…

2 hours ago

రేపటి నుంచి ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ

ఏపీ ప్రజలకు కూటమి సర్కారు మంగళవారం శుభవార్తను చెప్పింది. రాష్ట్రంలో ఉంటూ ఇప్పటిదాకా రేషన్ కార్డులు లేని కుటుంబాలకు కొత్తగా…

3 hours ago

అసలేం జరుగుతుంది? బాబు సీరియస్

కూట‌మి ప్ర‌భుత్వంలో నామినేటెడ్ ప‌ద‌వుల వ్య‌వ‌హారం.. అంతా సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల క‌నుస‌న్న‌ల్లోనే జ‌రుగుతోంది. ఇది…

5 hours ago

రూ.1000 పెంచిన బాబుకు మంచి మార్కులు

ప్ర‌తి నెలా 1వ తేదీన ఠంచ‌నుగా అందుతున్న ఎన్టీఆర్ భ‌రోసా సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌ను ప్ర‌భుత్వానికి మంచి మార్కులే వేస్తోంది.…

6 hours ago

Don’t Miss: క్యాష్ లెస్ ట్రీట్మెంట్ ఫర్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్

కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు సోమవారం రాత్రి ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రోడ్డు ప్రమాద బాధితులకు ఎంతో ఉపయుక్తంగా భావిస్తున్న…

7 hours ago