Movie News

ఓజీ అప్‌డేట్ అడిగిన నాని

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత ఏడాది చివర్లో తన చేతిలో ఉన్న మూడు చిత్రాల షూటింగ్‌ను హోల్డ్‌లో పెట్టేసి.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజీ అయిపోయారు. ఎన్నికలు అయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తర్వాత డిప్యూటీ హోం మినిస్టర్‌గా, నాలుగు శాఖల మంత్రిగా బాధ్యతలు తీసుకుని ఆ వ్యవహారాల్లో తలమునకలు అయిపోయారు జనసేన అధినేత.

ఐతే మధ్యలో ఆగిన తన చిత్రాలను ఎప్పుడు పూర్తి చేస్తారా అని ఆయా చిత్రాల నిర్మాతలతో పాటు అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఒక మూడు నెలలు అయినా పని చేయనివ్వండి, తర్వాత వీలును చూసుకుని సినిమాలు పూర్తి చేస్తా అంటూ ఓ బహిరంగ సమావేశంలో పవన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆ మూడు నెలలు పూర్తి కావస్తున్న నేపథ్యంలో పవన్ మళ్లీ ముఖానికి రంగు ఎప్పుడు వేసుకుంటాడా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

పవన్ రీఎంట్రీ ఏ సినిమాతో ఉంటుందనే ఆసక్తి కూడా నెలకొంది. ఆల్రెడీ ‘హరిహర వీరమల్లు’ చిత్రం ఆల్రెడీ చిత్రీకరణ దశలోకి వెళ్లగా.. ఇప్పుడు ‘ఓజీ’ కూడా అదే బాటలో సాగబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. స్వయంగా ‘ఓజీ’ నిర్మాత డీవీవీ దానయ్య దీని గురించి అప్‌డేట్ ఇచ్చారు. ఆయన ప్రొడక్షన్లో తెరకెక్కిన కొత్త చిత్రం ‘సరిపోదా శనివారం’ మీడియా మీట్‌లో హీరో నాని ‘ఓజీ’ గురించి దానయ్యను అప్‌డేట్ అడగడం విశేషం. దానికాయన బదులిస్తూ.. “ఓజీ త్వరలోనే విడుదల అవుతుంది. షూటింగ్ కూడా అతి త్వరలోనే మళ్లీ మొదలుపెడుతున్నాం” అని చెప్పారు. దీంతో అక్కడున్న అందరిలోనూ హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

ప్రస్తుతం ‘ఓజీ’ టీం కొత్త షెడ్యూల్ కోసం ప్రణాళికలు వేస్తున్నట్లు సమాచారం. పవన్ వీలును బట్టి ‘హరిహర వీరమల్లు’, ‘ఓజీ’ షూటింగ్స్‌లో మార్చి మార్చి పాల్గొంటారని సమాచారం. కాగా సెప్టెంబరు 2న పవన్ పుట్టిన రోజును పురస్కరించుకుని ‘ఓజీ’ నుంచి ఓ పాటను రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.

This post was last modified on August 21, 2024 5:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

22 minutes ago

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

2 hours ago

కూట‌మికి `బ్ర‌హ్మాస్త్రం` ఇచ్చేసిన‌ ప‌య్యావుల ..!

కూట‌మి నాయ‌కుల‌కు ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ కీల‌క రాజ‌కీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానిక‌రం`` అంటూ..…

2 hours ago

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కౌంట్ డౌన్?

వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…

4 hours ago

ధనుష్‌ను ఆకాశానికెత్తేసిన మృణాల్

తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…

4 hours ago

తారక్, ప్రభాస్ ఇద్దరూ పునుగుల పిచ్చోళ్లే

టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్‌ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…

4 hours ago