Movie News

ఓజీ అప్‌డేట్ అడిగిన నాని

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత ఏడాది చివర్లో తన చేతిలో ఉన్న మూడు చిత్రాల షూటింగ్‌ను హోల్డ్‌లో పెట్టేసి.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజీ అయిపోయారు. ఎన్నికలు అయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తర్వాత డిప్యూటీ హోం మినిస్టర్‌గా, నాలుగు శాఖల మంత్రిగా బాధ్యతలు తీసుకుని ఆ వ్యవహారాల్లో తలమునకలు అయిపోయారు జనసేన అధినేత.

ఐతే మధ్యలో ఆగిన తన చిత్రాలను ఎప్పుడు పూర్తి చేస్తారా అని ఆయా చిత్రాల నిర్మాతలతో పాటు అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఒక మూడు నెలలు అయినా పని చేయనివ్వండి, తర్వాత వీలును చూసుకుని సినిమాలు పూర్తి చేస్తా అంటూ ఓ బహిరంగ సమావేశంలో పవన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆ మూడు నెలలు పూర్తి కావస్తున్న నేపథ్యంలో పవన్ మళ్లీ ముఖానికి రంగు ఎప్పుడు వేసుకుంటాడా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

పవన్ రీఎంట్రీ ఏ సినిమాతో ఉంటుందనే ఆసక్తి కూడా నెలకొంది. ఆల్రెడీ ‘హరిహర వీరమల్లు’ చిత్రం ఆల్రెడీ చిత్రీకరణ దశలోకి వెళ్లగా.. ఇప్పుడు ‘ఓజీ’ కూడా అదే బాటలో సాగబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. స్వయంగా ‘ఓజీ’ నిర్మాత డీవీవీ దానయ్య దీని గురించి అప్‌డేట్ ఇచ్చారు. ఆయన ప్రొడక్షన్లో తెరకెక్కిన కొత్త చిత్రం ‘సరిపోదా శనివారం’ మీడియా మీట్‌లో హీరో నాని ‘ఓజీ’ గురించి దానయ్యను అప్‌డేట్ అడగడం విశేషం. దానికాయన బదులిస్తూ.. “ఓజీ త్వరలోనే విడుదల అవుతుంది. షూటింగ్ కూడా అతి త్వరలోనే మళ్లీ మొదలుపెడుతున్నాం” అని చెప్పారు. దీంతో అక్కడున్న అందరిలోనూ హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

ప్రస్తుతం ‘ఓజీ’ టీం కొత్త షెడ్యూల్ కోసం ప్రణాళికలు వేస్తున్నట్లు సమాచారం. పవన్ వీలును బట్టి ‘హరిహర వీరమల్లు’, ‘ఓజీ’ షూటింగ్స్‌లో మార్చి మార్చి పాల్గొంటారని సమాచారం. కాగా సెప్టెంబరు 2న పవన్ పుట్టిన రోజును పురస్కరించుకుని ‘ఓజీ’ నుంచి ఓ పాటను రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.

This post was last modified on August 21, 2024 5:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆ ప్రచారంపై మండిపడ్డ కోమటిరెడ్డి

తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…

25 minutes ago

అమరావతిపై మాట్లాడే నైతిక హక్కు ఉందా జగన్!

ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…

52 minutes ago

నాగ్ ఓకే అనడమే ఆలస్యం

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…

2 hours ago

ప్రభాస్ సరదాలు ఓవర్… ఇక సమరమే!

ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…

2 hours ago

పందెం రాయుళ్లకు తిప్పలు తప్పవా…?

సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…

2 hours ago

అమరావతిపై 48 గంటల్లో టోన్ మార్చిన వైసీపీ!

ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సోకాల్డ్ రాజధాని అంటూ అమరావతిని…

2 hours ago