ఈ వారం విడుదల కాబోతున్న కొత్త సినిమాల్లో అంతో ఇంతో సౌండ్ చేసే అవకాశం ఉన్నది మారుతీనగర్ సుబ్రహ్మణ్యం ఒక్కటే. నిజానికి ఆగస్ట్ 23 దీని రిలీజ్ డేట్ ప్రకటించినప్పుడు మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ వచ్చిన వారానికే దిగడం రిస్కేమోనని అందరూ భావించారు. తీరా చూస్తే అవి డిజాస్టర్ కావడంతో ఎక్కువ స్క్రీన్లు అందుబాటులోకి వచ్చాయి. మంచి జోరు మీదున్న ఆయ్, అంతకు ముందు కమిటీ కుర్రోళ్ళు అదే ఊపుని కొనసాగించేలా ఉండగా కంటెంట్ మాత్రమే గెలిచిన ఆగస్ట్ లో ఈ సుబ్రహ్మణ్యం ఎలా నెగ్గుకొస్తాడో చూడాలి. అయితే నక్కతోక పదం వెనుక కారణముంది.
మారుతినగర్ సుబ్రహ్మణ్యంలో హీరో రావు రమేష్. కేవలం ఈయన కోసమే థియేటర్లకు టికెట్లు కొనుక్కుని రావడం కష్టం. సినిమా చాలా బాగుందనే టాక్ రావాలి. అది జరగాలంటే ముందు ఓపెనింగ్స్ అందుకోవాలి. దాని కోసమే రేపు అల్లు అర్జున్ ని ముఖ్య అతిథిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఒప్పించారు. ఒక రోజు ముందే ఆగస్ట్ 22 సాయంత్రం స్పెషల్ ప్రీమియర్ వేస్తున్నారు. ఆయ్ లో మెప్పించిన అంకిత్ కొయ్య ఇందులో కీలక పాత్ర పోషించాడు. డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు మైత్రి తీసుకుంది. కథ నచ్చేయడంతో సుకుమార్ తన భార్యను భాగస్వామిగా మార్చారు. ఎంతో నమ్మితేనే ఇలా చేస్తారు కదా.
సో బాగుందనే మాట బయటికి వస్తే మారుతినగర్ సుబ్రహ్మణ్యంకు జాక్ పాట్ తగిలినట్టే. అటుపై ఎలాగూ సరిపోదా శనివారం ఉంటుంది కనక వీలైనంత మొదటి వారంలోనే రాబట్టుకోవాలి. టీమ్ మాత్రం విజయం పట్ల చాలా నమ్మకం ఉంది. క్యారెక్టర్ ఆర్టిస్టులు సోలో హీరోలుగా చేసిన సినిమాలు, దక్కిన సినిమాలు వేళ్ళ మీద లెక్కబెట్టొచ్చు. రావు రమేష్ తండ్రి స్వర్గీయ రావుగోపాలరావు గారు మా ఊళ్ళో మహాశివుడు, కలియుగ రావణాసురుడు లాంటి టైటిల్ రోల్స్ సినిమాలు కొన్ని చేశారు. కొన్ని హిట్టయ్యాయి కూడా. మరి వారసుడు కూడా అదే బాట పడతారో లేదో చూడాలి.
This post was last modified on August 20, 2024 3:45 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…