సూపర్ స్టార్ రజినీకాంత్కు ఒకప్పుడు తెలుగులో ఎలాంటి ఫాలోయింగ్ ఉండేదో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ టాప్ స్టార్లతో సమానంగా మార్కెట్, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారాయన. నరసింహా, చంద్రముఖి, శివాజీ రోబో, కబాలి, 2.0 లాంటి చిత్రాలకు జరిగిన బిజినెస్, వచ్చిన ఓపెనింగ్స్ చూసి ఇక్కడి ట్రేడ్ పండిట్లు షాకైపోయారు.
రజినీ సినిమాకు పోటీగా వేరే చిత్రాలను రిలీజ్ చేయడానికి కూడా భయపడ్డారు. కానీ గత కొన్నేళ్లలో రజినీ సరైన సినిమాలు చేయకపోవడం వల్ల మార్కెట్ బాగా దెబ్బ తింది. పేట, దర్బార్, పెద్దన్న లాంటి చిత్రాలకు ఘోరమైన ఫలితాలు వచ్చాయి. రజినీ మార్కెట్ పూర్తిగా కరిగిపోయిన భావన కలిగింది ఆ టైంలో. కానీ గత ఏడాది ‘జైలర్’ మూవీతో సూపర్ స్టార్ బలంగా పుంజుకున్నారు. ఆ చిత్రం రజినీ దాదాపు 50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టి రజినీకి పూర్వ వైభవం తెచ్చిపెట్టింది తెలుగులో.
మధ్యలో రజినీ ప్రత్యేక పాత్ర పోషించిన ‘లాల్ సలాం’ అనే సినిమా నిరాశపరిచింది కానీ.. అదేమీ సూపర్ స్టార్ కొత్త చిత్రం బిజినెస్ మీద ప్రభావం చూపలేదు. రజినీ దసరా టైంలో ‘వేట్టయాన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి తెలుగులో ఇంకా టైటిల్ ఖరారు ఖరారు కాలేదు. టీజర్ కూడా ఏమీ రిలీజ్ చేయలేదు.
ఐతే ‘జై భీమ్’తో ప్రశంసలు అందుకున్న జ్ఞానవేల్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయడం.. అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫాహద్ ఫాజిల్ లాంటి మేటి తారాగణం ఉండడంతో ఈ చిత్రానికి ట్రేడ్ వర్గాల్లో మంచి హైప్ ఉంది. తెలుగులో కూడా సినిమా మీద అంచనాలు బాగానే ఉన్నాయి. అందుకే విడుదలకు రెండు నెలల ముందే థియేట్రికల్ హక్కులు అమ్ముడైపోయాయి. రూ.15 కోట్లకు ఏషియన్ మూవీస్ సంస్థ ‘వేట్టయాన్’ తెలుగు హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం.
అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తెలంగాణలో అవినీతి మరింతగా రాజ్యమేలుతోందని చెప్పక తప్పదు. రాష్ట్రంలో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలే…
మాజీ సీఎం జగన్ మీడియా ముందుకు వస్తే చాలు…ఆయన నోటి నుంచి ఏం ఆణిముత్యాలు రాలుతాయో అని టీడీపీ, జనసేనకు…
పాము పగబట్టడం విన్నాం... మనిషిపై మరో మనిషి పగబట్టడడమూ చూశాం. కానీ ఓ ఏనుగు పగబట్టడం... అది కూడా ఏళ్ల…
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…