మిస్టర్ బచ్చన్ విడుదలకు ముందు మాంచి హుషారుగా కనిపించాడు దర్శకుడు హరీస్ శంకర్. సినిమా ఫలితం మీద చాలా ధీమాగా ఉన్న ఆయన.. ఉత్సాహంగా మీడియా ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడారు.
కానీ ఆయన సినిమా గురించి చెప్పిన మాటలకు.. సినిమాలో కంటెంట్కు పొంతన లేకపోయింది. సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది. అందులోనూ పోటీలో వేరే సినిమాలుండడం దీనికి చేటు చేసింది. ‘మిస్టర్ బచ్చన్’ బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ బాగా లేదు.
ఐతే సినిమా గురించి కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు హరీష్ శంకర్. తాజాగా మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన హరీష్.. పనిగట్టుకుని ఈ చిత్రం గురించి కొందరు నెగెటివ్ ప్రచారం చేస్తున్నారని ఆరోపించాడు.
‘‘సోషల్ మీడియాలో ట్రోల్స్ నాకు కొత్త కాదు. అలానే సోషల్ మీడియా మాత్రమే జీవితం కాదు. గబ్బర్ సింగ్ సినిమాలో ‘నేను ఆకాశం లాంటి వాడిని. ఉరుము వచ్చినా పిడుగు వచ్చినా ఇలాగే ఉంటా’ అనే డైలాగ్ నాకు ఇష్టం. నా వ్యక్తిత్వం కూడా అలాంటిదే. గతంలో రవితేజ సినిమాలకు కొన్నింటికి వచ్చిన రెస్పాన్స్ నిరాశ పరిచాయి. కానీ ఆ దర్శకుల మీద లేని ఎటాక్ నా మీద జరిగింది. కొందరు ఉద్దేశపూర్వకంగానే నన్ను టార్గెట్ చేసి నెగెటివ్ టాక్ ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఒక డ్యాన్స్ మూమెంట్ తీసుకుని సినిమాను విమర్శిస్తున్నారు. కానీ ఇందులో మంచి డైలాగులున్నాయి. ‘కట్నం తీసుకుని కాపురం చేసే మగవాడు వ్యభిచారం చేసినట్లు లెక్క’ అని రాశాను. దాన్ని పట్టించుకోలేదు. ఆ డైలాగ్ నచ్చిందని చాలామంది అమ్మాయిలు ఫోన్ చేసి చెప్పారు. హీరో ఓ సందర్భంలో ‘నీకు నా ప్రేమ అర్థమయ్యే వరకు నిన్ను కదిలించను’ అంటాడు. అమ్మాయిలు ‘నో’ చెబితే గౌరవించాలనే ఉద్దేశంతో ఆ డైలాగ్ రాశా. దీని గురించి కూడా ఎవరూ మాట్లాడలేదు. మంచిని పక్కన పెట్టి వాళ్లకు సౌలభ్యంగా ఉన్న వాటిని తీసుకుని విమర్శించేవారిని పట్టించుకోనవసరం లేదు’’ అని హరీష్ అన్నాడు.
This post was last modified on August 20, 2024 7:23 am
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…
ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…