Movie News

హరీష్ శంకర్ ఆవేదన

మిస్టర్ బచ్చన్ విడుదలకు ముందు మాంచి హుషారుగా కనిపించాడు దర్శకుడు హరీస్ శంకర్. సినిమా ఫలితం మీద చాలా ధీమాగా ఉన్న ఆయన.. ఉత్సాహంగా మీడియా  ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడారు.

కానీ ఆయన సినిమా గురించి చెప్పిన మాటలకు.. సినిమాలో కంటెంట్‌కు పొంతన లేకపోయింది. సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది. అందులోనూ పోటీలో వేరే సినిమాలుండడం దీనికి చేటు చేసింది. ‘మిస్టర్ బచ్చన్’ బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ బాగా లేదు.

ఐతే సినిమా గురించి కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు హరీష్ శంకర్. తాజాగా మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన హరీష్.. పనిగట్టుకుని ఈ చిత్రం గురించి కొందరు నెగెటివ్ ప్రచారం చేస్తున్నారని ఆరోపించాడు.

‘‘సోషల్ మీడియాలో ట్రోల్స్ నాకు కొత్త కాదు. అలానే సోషల్ మీడియా మాత్రమే జీవితం కాదు. గబ్బర్ సింగ్ సినిమాలో ‘నేను ఆకాశం లాంటి వాడిని. ఉరుము వచ్చినా పిడుగు వచ్చినా ఇలాగే ఉంటా’ అనే డైలాగ్ నాకు ఇష్టం. నా వ్యక్తిత్వం కూడా అలాంటిదే. గతంలో రవితేజ సినిమాలకు కొన్నింటికి వచ్చిన రెస్పాన్స్ నిరాశ పరిచాయి. కానీ ఆ దర్శకుల మీద లేని ఎటాక్ నా మీద జరిగింది. కొందరు ఉద్దేశపూర్వకంగానే నన్ను టార్గెట్ చేసి నెగెటివ్ టాక్ ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఒక డ్యాన్స్ మూమెంట్ తీసుకుని సినిమాను విమర్శిస్తున్నారు. కానీ ఇందులో మంచి డైలాగులున్నాయి. ‘కట్నం తీసుకుని కాపురం చేసే మగవాడు వ్యభిచారం చేసినట్లు లెక్క’ అని రాశాను. దాన్ని పట్టించుకోలేదు. ఆ డైలాగ్ నచ్చిందని చాలామంది అమ్మాయిలు ఫోన్ చేసి చెప్పారు. హీరో ఓ సందర్భంలో ‘నీకు నా ప్రేమ అర్థమయ్యే వరకు నిన్ను కదిలించను’ అంటాడు. అమ్మాయిలు ‘నో’ చెబితే గౌరవించాలనే ఉద్దేశంతో ఆ డైలాగ్ రాశా. దీని గురించి కూడా ఎవరూ మాట్లాడలేదు. మంచిని పక్కన పెట్టి వాళ్లకు సౌలభ్యంగా ఉన్న వాటిని తీసుకుని విమర్శించేవారిని పట్టించుకోనవసరం లేదు’’ అని  హరీష్ అన్నాడు.

This post was last modified on August 20, 2024 7:23 am

Share

Recent Posts

రవితేజకు డబ్బులే డబ్బులు

మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…

1 hour ago

దృశ్యం 4… ఇంకెన్నిసార్లు సాగదీస్తారో

ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…

1 hour ago

హైదరాబాద్ వచ్చిన జాంబీరెడ్డి ఏం చేయబోతున్నాడు

కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…

1 hour ago

మహిళను చంపి…. బిర్యానీ వండి…

ఏమైందో ఏమో కానీ ఆ దంపతులు ఒక మహిళను హత్య చేశారు. హత్య చేసి తీరిగ్గా ఆ మహిళ దేహాన్ని…

2 hours ago

బాలయ్య తీసుకునేది తెలివైన నిర్ణయమే

ప్రమాదంలో కలిగిన గాయం వల్ల చికిత్స చేయించుకుని విశ్రాంతిలో ఉన్న బాలకృష్ణ డాక్టర్లు చెప్పిన టైం కన్నా ముందే షూటింగ్…

2 hours ago

హైదరాబాద్‌లో ఇంకా పెద్ద ఐమాక్స్?

దేశంలో సినీ అభిమానం పరంగా టాప్‌లో నిలిచే తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యమే. గతంలో ప్రసాద్స్‌లో ఈ…

2 hours ago