ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఇళయరాజాల బంధం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇద్దరూ కలిసి సంగీత ప్రియులకు వేల పాటలు అందించారు. ఎన్నో కచేరీలతో అలరించారు. వ్యక్తిగతంగానూ వీళ్లిద్దరూ ఆప్త మిత్రులు. ఒకరినొకరు సోదరుల్లా చూసుకుంటారు. ఆ మధ్య ఇద్దరి మధ్య అనుకోకుండా విభేదాలు వచ్చాయి. బాలు నిర్వహించే సంగీత కచేరీల్లో తన పాటలు వాడుకుంటున్నందుకు రాయల్టీ చెల్లించాలంటూ ఇళయరాజా నోటీసులివ్వడం కలకలం రేపింది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఇద్దరి మధ్య గొడవ సద్దుమణిగింది.
ఆ సంగతలా వదిలేస్తే.. గత నెల బాలు ఆరోగ్యం విషమించిందని వార్త బయటికి వచ్చినపుడు ఇళయరాజా తల్లడిల్లిపోయారు. ఎప్పుడూ ఏ విషయంలోనూ పెద్దగా ఎమోషనల్ అవ్వని ఆయన.. తీవ్ర భావోద్వేగంతో ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ‘‘బాలూ.. త్వరగా లేచిరా. నీకోసం ఎదురు చూస్తున్నా. నువ్వు కచ్చితంగా తిరిగి వస్తావని నా అంతరాత్మ చెబుతోంది. అది నిజవ్వాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నాను. బాలూ.. త్వరగా రా’’ అంటూ ఆ వీడియోలో పిలుపునిచ్చారు ఇళయరాజా. ఆ వీడియో చూసిన సంగీతాభిమానులు కూడా తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. కానీ ఇళయరాజా పిలుపును బాలు మన్నించలేకపోయారు. ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. తన ఆప్త మిత్రుడిని కోల్పోయినా ఇళయరాజా ఇప్పుడే స్థితిలో ఉంటారో అని అభిమానులు కంగారు పడుతున్నారు.
బాలు మరణానంతరం కూడా ముందులాగే ఒక వీడియో రిలీజ్ చేశారు ఇళయరాజా. దాదాపు ఏడుస్తూ మాట్లాడిన ఆయన.. బాలు వెళ్లిపోవడం తనకెంత లోటో వివరించారు. ‘‘బాలూ.. నీ కోసం నేను ఎదురు చూస్తుంటానని చెప్పాను.. కానీ నా మాట వినకుండా వెళ్లిపోయావు. నా నోటివెంట మాట రావడం లేదు. ఎక్కడికి వెళ్లావు? ఎందుకు వెళ్లావు? గంధర్వుల కోసం పాడేందుకు వెళ్లావా? ఇక ప్రపంచంలో నేను దేన్నీ చూడలేను. ఎంతటి దుఃఖానికైనా ఓ హద్దు ఉంటుంది.. కానీ నీ విషయంలో దానికి పరిమితి లేదు” అంటూ ఇళయరాజా ఉద్వేగానికి గురైన తీరు సంగీతాభిమానులకు కంటతడి పెట్టించింది.
This post was last modified on September 26, 2020 8:29 pm
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…