జంటగా పలు చిత్రాల్లో నటించిన ఒక హీరో, హీరోయిన్.. 14 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ కలిసి తెరపై కనిపించబోతున్నారంటే అది విశేషమే. అందులోనూ ఆ హీరో హీరోయిన్ కొన్నేళ్ల పాటు వెండి తెర మీదే దర్శనం ఇవ్వనంతగా గ్యాప్ తీసుకుని.. మళ్లీ రీఎంట్రీలో జంటగా నటించడం ఇంకా ప్రత్యేకం. సీనియర్ నటులు శివాజీ, లయ ఇలాగే ప్రేక్షకులను ఆశ్చర్యపరచబోతున్నారు. ఒకప్పుడు మిడ్ రేంజ్ సినిమాల్లో హిట్ పెయిర్గా మంచి గుర్తింపే సంపాదించారు శివాజీ, లయ.
తొలిసారిగా ‘మిస్సమ్మ’ సినిమాలో జంటగా నటించి మెప్పించిన వీళ్లిద్దరూ.. ఆ తర్వాత అదిరందయ్యా చంద్రం, టాటా బిర్లా మధ్యలో లైలా, బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం లాంటి చిత్రాల్లో నటించారు. వీళ్లిద్దరికీ ఆ చిత్రాల్లో చాలా బాగా జంట కుదిరింది. ఐతే తర్వాత లయ పెళ్లి చేసుకుని ఫిలిం కెరీర్కు టాటా చెప్పేయగా.. శివాజీకి కూడా క్రమంగా సినిమాలు తగ్గిపోయాయి.
లయ చాలా ఏళ్ల పాటు కెమెరా ముందుకు రాలేదు. ఈ మధ్యే ఆమె మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. శివాజీ కూడా కొన్నేళ్లు గ్యాప్ తీసుకుని ఈ మధ్యే ‘నైంటీస్ మిడిల్ క్లాస్’ వెబ్ సిరీస్తో రీఎంట్రీ ఇచ్చాడు. వీళ్లిద్దరినీ జంటగా పెట్టి ఓ సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు సుధీర్ శ్రీరామ్ అనే యువ దర్శకుడు. నైంటీస్ మిడిల్ క్లాస్ తర్వాత శివాజీ ఈటీవీ విన్తోనే అసోసియేట్ అయి సాగుతున్నాడు. ఆ సిరీస్ రెండో సీజన్తో పాటు మరో ప్రాజెక్ట్ కూడా చేస్తున్నాడు. ఇప్పుడు లయతో చేయబోయే చిత్రం కూడా ఈటీవీ విన్ కోసమేనట. అది థియేటర్లలోకి రాకపోవచ్చు.
ఐతే ఎలాగైతేనేం హిట్ పెయిర్గా గుర్తింపు సంపాదించుకున్న శివాజీ-లయలను మళ్లీ జంటగా చూడబోతుండడం ప్రేక్షకులకు ప్రత్యేకమైన విషయమే. లయ అక్క, వదిన పాత్రలతోనూ టాలీవుడ్లో బిజీ అవ్వాలని చూస్తోంది.
This post was last modified on August 17, 2024 10:00 pm
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…