అక్షయ్ కుమార్ అంటే బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడు. ఆయన సినిమాలు ఒకప్పుడు వందల కోట్ల వసూళ్లు రాబట్టేవి. కానీ కొన్నేళ్లుగా అక్షయ్ స్టార్ డమ్ కరిగిపోతూ వస్తోంది. తన సినిమాలకు ఓపెనింగ్స్ ఉండట్లేదు. అక్షయ్ నటించిన కొన్ని మంచి సినిమాలు సైతం వసూళ్లు రాబట్టలేక డిజాస్టర్లు అయ్యాయి.
గత కొన్నేళ్లలో ఆయన చూసిన హిట్ అంటే.. అతిథి పాత్ర చేసిన ఓఎంజీ-2 మాత్రమే. ఈ ఏడాది వేసవిలో అక్షయ్ నుంచి వచ్చిన బడేమియా చోటేమియా బాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది.
ఈ మధ్యే అక్షయ్ నుంచి సఫీరా అనే మరో సినిమా రిలీజైంది. ఇంతకుముందు అక్షయ్ సినిమాలు రిలీజయ్యాక ఫ్లాప్ అయ్యేవి. కానీ ఇది రిలీజ్కు ముందే డిజాస్టర్ అని తేలిపోయింది. ఈ పేరుతో సినిమా వచ్చినట్లు కూడా జనాలకు తెలియదు. అంత దారుణంగా ఆడింది. ఐతే ప్రతి ఫ్లాప్ తర్వాత ఆశగా అక్షయ్ అభిమానులు మరో సినిమా వైపు చూడడం మామూలైపోయింది.
అలాగే ఇండిపెండెన్స్ డే వీకెండ్లో వచ్చిన ఖేల్ ఖేల్ మే మీద ఫోకస్ పెట్టారు.కానీ పెద్దగా బజ్ లేకుండా రిలీజైన ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర ప్రభావం చూపట్లేదు. క్రేజీ వీకెండ్లో రిలీజైనా సరే.. ప్రేక్షకుల దృష్టిని ఈ చిత్రం ఆకర్షించలేకపోతోంది. ఈ వారం స్త్రీ-2, వేదా చిత్రాలు కూడా రిలీజ్ కాగా.. వాటి వెనుక మూడో స్థానానికి పరిమితమైంది ఖేల్ ఖేల్ మే.
స్త్రీ-2 బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తుంటే.. ఖేల్ ఖేల్ మే తేలిపోతోంది. ఐతే ఖేల్ ఖేల్ మేలో అక్షయ్ చేసింది లీడ్ రోల్ కాదు. వేరే ముఖ్య పాత్రల్లో తనదీ ఒకటి. స్క్రీన్ టైం పూర్తి స్థాయిలో ఉండదు. అయినా దీన్ని అక్షయ్ సినిమాగానే భావించాలి. దీనికి ఇలాంటి నిరాశాజనక ఫలితం వస్తుంటే.. ఈ వీకెండ్లో బ్లాక్బస్టర్ ఫలితాన్ని అందుకుంటున్న స్త్రీ-2లోనూ అక్షయ్ నటించాడు.
అందులో అతడిది కొన్ని నిమిషాలు కనిపించే క్యామియో రోల్. ఆ సినిమాకే కాదు.. పాత్రకూ మంచి స్పందన వస్తోంది. కానీ ముఖ్య పాత్ర పోషించిన సినిమా వెలవెలబోతుంటే.. క్యామియో రోల్ చేసిన సినిమా ఇరగాడేస్తున్న నేపథ్యంలో అక్షయ్కు నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి తలెత్తుతోంది.
This post was last modified on August 17, 2024 10:28 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…