Movie News

జాతీయ గౌరవం అందుకున్న కార్తికేయ 2

ఇవాళ 70న జాతీయ సినిమా అవార్డుల ప్రకటన అధికారికంగా వచ్చేసింది. వివిధ బాషల నుంచి ఎంపిక చేసిన చిత్రాలకు, విజేతలకు పురస్కారాలు అందించబోతున్నారు. ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా కార్తికేయ 2 ఎంపికయ్యింది. నిఖిల్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ ప్యాన్ ఇండియా మూవీ 2022లో విపరీతమైన పోటీ మధ్య విడుదలై భారీ ఎత్తున విజయం సాధించడం తెలిసిందే. సరైన థియేటర్లు తొలుత దొరక్కపోయినా విజయం సాధించాక నార్త్ నుంచి సౌత్ దాకా అన్ని చోట్లా విజయకేతనం ఎగరేసింది. ఇప్పుడీ కీర్తి దక్కింది.

ఉత్తమ చిత్రంగా మలయాళం మూవీ ఆట్టంకు అగ్ర తాంబూలం దక్కింది. బెస్ట్ యాక్టర్ గా రిషబ్ శెట్టి కాంతారకు గాను విన్నర్ గా నిలిచాడు. రీజనల్ మూవీస్ క్యాటగిరీలో కన్నడ కెజిఎఫ్ 2, తమిళం పొన్నియిన్ సెల్వన్ 1 అవార్డులు గెలిచాయి. ఉత్తమ దర్శకుడు సూరజ్ ఆర్ బరజాత్య (ఊంచాయి), విజువల్ ఎఫెక్ట్స్ (బ్రహ్మాస్త్ర పార్ట్ 1), హోల్ సం ఎంటర్ టైన్మెంట్ (కాంతార), సినిమాటోగ్రఫీ (పీఎస్ 1), గాయకుడు ఆర్జిత సింగ్ (బ్రహ్మాస్త్ర), గాయని బాంబే జయశ్రీ (చాయుమ్ మెయిల్), చైల్డ్ ఆర్టిస్ట్ శ్రీపథ్ (మల్లికాపురం), స్క్రీన్ ప్లే ఆనంద్ ఏకర్షి (అట్టం) కు వివిధ విభాగాల్లో పురస్కారం గెలుచుకున్నారు.

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు గాను ఏఆర్ రెహమాన్ కు పొన్నియిన్ సెల్వన్ 1కు గాను అవార్డు రాగా, ఉత్తమ సంగీతం బ్రహ్మాస్త్ర చేతికి వెళ్లిపోయింది. కొరియోగ్రఫీ జానీ మాస్టర్ – సతీష్ కృష్ణన్ (తిరుచిత్రంబలం), సౌండ్ డిజైన్ పీఎస్ 1 ఖాతాలో చేరింది. తెలుగు సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యం దక్కలేదు కానీ ఉన్నంతలో కార్తికేయ 2 కు ఎక్కువ గుర్తింపు వచ్చింది. వివిధ ప్రామాణికాలను ఆధారంగా చేసుకుని ఇచ్చే జాతీయ అవార్డులు మరిన్ని టాలీవుడ్ కు రావాల్సింది కానీ ఈసారి సర్దుకోవాల్సిందే. 2023 సంవత్సరానికి ఎక్కువ నామినేషన్లు ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చూద్దాం.

This post was last modified on August 16, 2024 4:03 pm

Share

Recent Posts

మహాకాళి శ్రియ… థియేటర్లలో పూనకాలే!

శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…

15 minutes ago

త్రినాధ్ సంభవాన్ని తక్కువంచనా వేశారా

ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…

19 minutes ago

హోంమంత్రి పై కూలిన డ్రోన్‌… ఏం జ‌రిగింది?

ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్‌.. కొద్ద దూరం పైకి వెళ్లి…

2 hours ago

కుళ్లిపోయిన 100 టన్నుల చికెన్‌… చేపల ఆహారంగా!

కుళ్లిపోయిన చికెన్‌ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో…

3 hours ago

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

3 hours ago

ఆ ముగ్గురి మ‌ర‌ణానికి కార‌ణం ఐఫోన్ కాదా?

మ‌హారాష్ట్ర‌లో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండ‌గా, నిమిషాల వ్య‌వ‌ధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్…

3 hours ago