సీనియర్ కమెడియన్లను వాడుకోవడం ఒక ఆర్టు. అది సరిగ్గా తెలిసిన దర్శకులు అద్భుతాలు చేయొచ్చు. ఈ మధ్యకాలంలో బ్రహ్మానందం లాంటి లెజెండరీ ఆర్టిస్టుని మొక్కుబడి సీన్లలో ఎలా వృథా చేసుకుంటున్నారో కళ్లారా చూస్తున్నాం. ఆయన వరకు డైరెక్టర్లు అడిగినట్టు చేస్తున్నారు కానీ బలహీనమైన సన్నివేశాల వల్ల ఉపయోగపడలేకపోతున్నారు. ఇప్పుడు అలీ కూడా అదే రూట్లో వెళ్తున్నారు. నిన్న రిలీజైన డబుల్ ఇస్మార్ట్ విమర్శల్లో మొదటి అంశం బోకా కామెడీ ఎపిసోడ్. అడవి నుంచి పారిపోయి వచ్చిన మనిషిగా అలీ చేసిన చిత్ర విచిత్ర విన్యాసాలు నవ్వించకపోగా ఎబ్బెట్టు కలిగించాయి.
ఒకప్పుడు ఇదే పూరి అలీ కలయికలో బీహార్ ఇసుక పేరుతో ఇడియట్ లో ఎంత బ్రహ్మాండమైన కామెడీ పండించారో రవితేజ అభిమానులు ఎప్పటికి మర్చిపోలేరు. అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయిలో అమాయకుడు, పోకిరిలో బిచ్చగాడు, బద్రిలో పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ కాంబోలో వచ్చిన ఆణిముత్యాలు బోలెడు. కానీ డబుల్ ఇస్మార్ట్ లో ఆ మేజిక్ మచ్చుకు కూడా కనపడలేదు సరికదా రివర్స్ అయ్యింది. పరిస్థితి ఎలా ఉందంటే పలు చోట్ల డిస్ట్రిబ్యూటర్లు అలీ ట్రాక్ మొత్తం తీసేస్తే టాక్ కొంత మెరుగు పడుతుందని చెబుతున్నారట. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.
హాస్యనటులను వాడుకోవడంలో కొత్త జనరేషన్ డైరెక్టర్లే మెరుగ్గా ఆలోచిస్తున్నారు. టీవీ, యూట్యూబ్ ఇలా ఎన్నో ఆప్షన్లలో వినోదం దొరుకుతున్న టైంలో ఎప్పుడో దశాబ్దాల నాటి జోకులతో జనాన్ని నవ్వించాలంటే కుదరదు. రాత తీత రెండు విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి. లేదంటే వందల సినిమాలు చేసిన బ్రహ్మానందం, అలీలు ఫలానా చిత్రం చేయకపోయి ఉంటే బాగుండేదని వాళ్ళ ఫ్యాన్స్ ఫీలయ్యే దాకా తీసుకురాకూడదు. మిస్టర్ బచ్చన్ ఫలితాన్ని పక్కనపెడితే బాబు మోహన్, రవితేజ సీన్ ఉన్నది కాసేపే అయినా హుందాగా ఉంది. ఇలాంటి కోణాల్లో ఆలోచించి రాస్తే బెటరేమో.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…