సీనియర్ కమెడియన్లను వాడుకోవడం ఒక ఆర్టు. అది సరిగ్గా తెలిసిన దర్శకులు అద్భుతాలు చేయొచ్చు. ఈ మధ్యకాలంలో బ్రహ్మానందం లాంటి లెజెండరీ ఆర్టిస్టుని మొక్కుబడి సీన్లలో ఎలా వృథా చేసుకుంటున్నారో కళ్లారా చూస్తున్నాం. ఆయన వరకు డైరెక్టర్లు అడిగినట్టు చేస్తున్నారు కానీ బలహీనమైన సన్నివేశాల వల్ల ఉపయోగపడలేకపోతున్నారు. ఇప్పుడు అలీ కూడా అదే రూట్లో వెళ్తున్నారు. నిన్న రిలీజైన డబుల్ ఇస్మార్ట్ విమర్శల్లో మొదటి అంశం బోకా కామెడీ ఎపిసోడ్. అడవి నుంచి పారిపోయి వచ్చిన మనిషిగా అలీ చేసిన చిత్ర విచిత్ర విన్యాసాలు నవ్వించకపోగా ఎబ్బెట్టు కలిగించాయి.
ఒకప్పుడు ఇదే పూరి అలీ కలయికలో బీహార్ ఇసుక పేరుతో ఇడియట్ లో ఎంత బ్రహ్మాండమైన కామెడీ పండించారో రవితేజ అభిమానులు ఎప్పటికి మర్చిపోలేరు. అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయిలో అమాయకుడు, పోకిరిలో బిచ్చగాడు, బద్రిలో పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ కాంబోలో వచ్చిన ఆణిముత్యాలు బోలెడు. కానీ డబుల్ ఇస్మార్ట్ లో ఆ మేజిక్ మచ్చుకు కూడా కనపడలేదు సరికదా రివర్స్ అయ్యింది. పరిస్థితి ఎలా ఉందంటే పలు చోట్ల డిస్ట్రిబ్యూటర్లు అలీ ట్రాక్ మొత్తం తీసేస్తే టాక్ కొంత మెరుగు పడుతుందని చెబుతున్నారట. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.
హాస్యనటులను వాడుకోవడంలో కొత్త జనరేషన్ డైరెక్టర్లే మెరుగ్గా ఆలోచిస్తున్నారు. టీవీ, యూట్యూబ్ ఇలా ఎన్నో ఆప్షన్లలో వినోదం దొరుకుతున్న టైంలో ఎప్పుడో దశాబ్దాల నాటి జోకులతో జనాన్ని నవ్వించాలంటే కుదరదు. రాత తీత రెండు విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి. లేదంటే వందల సినిమాలు చేసిన బ్రహ్మానందం, అలీలు ఫలానా చిత్రం చేయకపోయి ఉంటే బాగుండేదని వాళ్ళ ఫ్యాన్స్ ఫీలయ్యే దాకా తీసుకురాకూడదు. మిస్టర్ బచ్చన్ ఫలితాన్ని పక్కనపెడితే బాబు మోహన్, రవితేజ సీన్ ఉన్నది కాసేపే అయినా హుందాగా ఉంది. ఇలాంటి కోణాల్లో ఆలోచించి రాస్తే బెటరేమో.
This post was last modified on August 16, 2024 12:02 pm
ఆంధ్రకింగ్ తాలూకా తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫైనల్ గా కొత్త ప్రాజెక్టుతో ముందుకొచ్చాడు.…
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహానాడు అంటే ఉద్వేగ భరితమైన వేదిక. పార్టీ విధానాలు, భవిష్యత్ దిశ, నాయకత్వ సందేశం కార్యకర్తలకు…
అనుకున్నంతా అయ్యింది. పెట్రోల్, డిజిల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం శుక్రవారంతో నిజమయ్యాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం…
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తయ్యే స్టేజికు…
ఇటీవలే శ్వాసనాళానికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రమంగా కోలుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్…
టిడిపిలోనే కొందరు నాయకులకు మెజారిటీ సమస్య ఇప్పుడు కొంత గడబిడగా మారింది. గత ఎన్నికల సమయంలో భారీ స్థాయి మెజారిటీతో…