ప్రస్తుతం టాలీవుడ్లో మంచి రైజింగ్ మీద ఉన్న హీరోయిన్లలో శ్రీలీల ఒకరు. పూజా హెగ్డే డౌన్ అయిపోయాక నంబర్ వన్ హీరోయిన్ స్థానానికి శ్రీలీల గట్టి పోటీదారుగా మారింది. ఆల్రెడీ మహేష్ బాబు లాంటి టాప్ స్టార్తో ‘గుంటూరు కారం’ చేసిన శ్రీలీల.. దీని తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
దీంతో పాటు నితిన్తో ‘రాబిన్ హుడ్’లోనూ నటిస్తోంది. ‘ధమాకా’ తర్వాత మరోసారి రవితేజతోనూ సినిమాకు ఓకే చెప్పింది. ఇలా మంచి ఊపులో సాగుతున్న శ్రీలీల కెరీర్.. బాలీవుడ్ వైపు కూడా టర్న్ తీసుకుంటోంది. ఆల్రెడీ హిందీలో ‘దిలేర్’ అనే ఓ చిన్న సినిమా చేస్తోంది శ్రీలీల. ఐతే ఇప్పుడు బాలీవుడ్లో ఓ పెద్ద ఆఫరే ఆమె పట్టేసినట్లు సమాచారం. బాలీవుడ్ అప్ కమింగ్ స్టార్లలో ఒకడైన సిద్దార్థ్ మల్హోత్రా సరసన శ్రీలీల నటించబోతోందట.
బల్వీందర్ సింగ్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాడు. ఈ చిత్రానికి ‘మిట్టి’ అనే టైటిల్ కూడా ఖరారైనట్లు తెలిసింది. ఇదొక యాక్షన్ టచ్ ఉన్న ఫ్యామిలీ డ్రామా అని సమాచారం. శ్రీలీలకు ఇందులో ఓ మంచి పాత్రే దక్కిందట. ప్రస్తుతం టాలీవుడ్లో హ్యాపెనింగ్ హీరోయిన్లలో ఒకరైన సంయుక్త సైతం బాలీవుడ్లో అరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ సైతం ‘తెరి’ రీమేక్తో బాలీవుడ్లో అడుగు పెడుతోంది.
వీరి కోవలోనే శ్రీలీల సైతం హిందీ సినిమా వైపు చూస్తోంది. ఐతే సౌత్ హీరోయిన్లు బాలీవుడ్లో క్లిక్ అయిన సందర్భాలు తక్కువే. అయినా సరే.. దేశమంతా పాపులర్ అయిన హిందీ చిత్రాల్లో అవకాశాలు వస్తే ఎవరు మాత్రం కాదంటారు. మరి బాలీవుడ్ స్టైల్కు తగ్గట్లు తన అప్పీయరెన్స్, యాక్టింగ్ను శ్రీలీల మార్చుకుని అక్కడా తనదైన ముద్ర వేస్తుందేమో చూడాలి.
This post was last modified on August 15, 2024 11:06 am
భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టింది నేనే, గుమ్మడికాయ కట్టింది నేనే అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే.…
నేచురల్ స్టార్ నాని కేవలం నటుడిగానే కాకుండా 'వాల్ పోస్టర్ సినిమా' బ్యానర్పై నిర్మాతగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన…
టాలీవుడ్లో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో క్రిష్ ఒకడు. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్లో క్రిష్ ఎన్నడూ రొటీన్ సినిమా…
మంచి టాలెంట్ ఉన్న యంగ్ జనరేషన్ దర్శకులు కెరీర్ ప్రారంభంలో హిట్లు అందుకున్నప్పటికీ దాన్ని నిలబెట్టుకునే క్రమంలో, కథల ఎంపికలో…
స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని సినిమాల్లో చూడటమే కానీ నిజ జీవితంలో దాన్ని ఆచరించే వాళ్ళను వేళ్ళ మీద…
ఒక జడ్జి ప్రజల్ని చీమలతో పోల్చితో మరొకరు నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చడం దేశ ప్రజలను విస్మయానికి గురి చేసింది. దాని…