ఇంకో ఎనిమిది రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు రానుంది. విశ్వంభర టీజర్ తో పాటు ఇంద్ర రీ రిలీజ్ ని ఘనంగా సెలెబ్రేట్ చేసుకునేందుకు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ కొత్త సినిమా ప్రకటన ఏమైనా వస్తుందానే సస్పెన్స్ ఇంకా తీరడం లేదు.
దర్శకులు కలుస్తున్నారు, కథలు వింటున్నారు కానీ ఖచ్చితంగా ఫలానాది ఫైనలవుతుందని చెప్పలేమని మెగా కాంపౌండ్ టాక్. హరీష్ శంకర్ తొలుత ప్రయత్నించి కుదరకపోవడంతో రామ్ తో ప్రాజెక్టు లాక్ చేసుకున్నాడు. తర్వాత పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే ఉస్తాద్ భగత్ సింగ్ ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉంటాడు.
అనుదీప్ లాంటి కుర్ర డైరెక్టర్లు సైతం ట్రై చేశారు కానీ డిస్కషన్ల దగ్గరే ఆగిపోయింది. సాలిడ్ గా కనిపిస్తున్న అప్డేట్ ఒకటే. మోహన్ రాజా దర్శకత్వంలో బివిఎస్ రవి అందించిన కథ కనక ఫైనల్ వెర్షన్ ఒకే అయ్యుంటే ఆగస్ట్ 22 దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావొచ్చు.
ఒకవేళ ఇంకా ఏకాభిప్రాయం కుదరని పక్షంలో వాయిదా వేయొచ్చు. ఇది కాకుండా ఇంకేదయినా ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. విశ్వంభర షూట్ దాదాపు పూర్తి కావొస్తుంది. సో చిరు వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటే ఎక్కువ గ్యాప్ లేకుండా కొత్త సినిమా సెట్లో అడుగు పెట్టొచ్చు.
ఈ సస్పెన్స్ తీరాలంటే ఇంకో వారం ఎదురు చూడక తప్పదు. ఒకవేళ ప్రకటన లేకపోతే మాత్రం విశ్వంభర టీజర్ తో సర్దుకోవాల్సి రావొచ్చు. ఇంద్ర గురించి కూడా ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ ఓ స్థాయిలో సోషల్ మీడియా వేదికగా కనిపిస్తోంది.
భోళా శంకర్ తర్వాత వేగానికి ప్రాధాన్యం ఇవ్వకుండా ఆచితూచి అడుగులు వేస్తున్న చిరంజీవి ఇకపై బాలకృష్ణ తరహాలో కొత్త జెనరేషన్ దర్శకులతో పని చేయాలని చూస్తున్నారు. బాబీ, వసిష్ఠ లాంటి వాళ్ళు ఆ అవకాశాన్ని చక్కగా వాడుకున్నారు. మెహర్ రమేష్ పాత స్కూల్ లోనే ఉండిపోయి డిజాస్టర్ ఇచ్చాడు. నెక్స్ట్ లక్కీ ఛాన్స్ ఎవరిదో మరి.
This post was last modified on August 15, 2024 6:38 am
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…