ఇండియాలో మిగతా ఫిలిం ఇండస్ట్రీలతో పోలిస్తే తమిళ సినీ పరిశ్రమ భిన్నం. అక్కడ సామాజిక అంశాల మీద చాలా సినిమాలు వస్తుంటాయి. ముఖ్యంగా ఆర్థిక వెనుకబాటు, కుల వివక్ష, అస్పృశ్యత లాంటి అంశాల ఆధారంగా తరచుగా సినిమాలు తెరకెక్కుతుంటాయి. కొందరు దర్శకులు ఈ తరహా చిత్రాలకు బాగా పేరుపడ్డారు. అందులో పా.రంజిత్ ఒకరు.
దర్శకుడిగా తన తొలి చిత్రం ‘అట్టకత్తి’తో మొదలుపెడితే.. మద్రాస్, కబాలి, కాలి.. ఇలా ప్రతి చిత్రంలోనూ అతను కుల వివక్ష మీదే కథను నడిపించాడు. తన ప్రొడక్షన్లో వచ్చిన ‘పరియేరుం పెరుమాళ్’ లాంటి సినిమాల్లోనూ దళితుల సమస్యలు, వారి పోరాటం గురించి అర్థవంతమైన చర్చ జరిగేలా చేశాడని అతడికి మంచి పేరుంది. సినిమాల ద్వారా దళితుల వాయిస్ను బలంగా వినిపించడమే కాక.. బయట కూడా ఈ అంశం మీద ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాడు రంజిత్. ఐతే కొన్నిసార్లు తన అభిప్రాయాలు, వాదనలు వివాదాస్పదం అవుతుంటాయి.
ఇటీవల ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును సైతం పా.రంజిత్ తప్పుబడుతూ పెట్టిన పోస్టు వైరల్ అయింది. ఐతే రిజర్వేషన్ల ఫలాలను ఇప్పటికే ఎంతో అనుభవించి ఆర్థికంగా స్థిరపడ్డ వారిని పక్కన పెట్టి.. వెనుకబడ్డ వారికే రిజర్వేషన్లు దక్కేలా వర్గీకరణ చేయాలనే డిమాండ్కు సుప్రీం కోర్టు, ప్రభుత్వాలు మద్దతు పలికితే తప్పేంటన్న చర్చ నడుస్తోంది.
ఈ క్రమంలో రంజిత్ను చాలామంది తప్పుబడుతున్నారు. ఇదిలా ఉండగా అస్పృశ్యత, అంటరాని తనం గురించి తాజాగా రంజిత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపేలా ఉన్నాయి. ప్రస్తుతం టీ షాపుల్లో గాజు గ్లాసులతో కంటే పేపర్ కప్పుల్లో టీ తాగేవారే సంఖ్య ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. దీన్ని రంజిత్ తప్పుబట్టాడు. ఇది అంటరానితనంలో భాగమే అని అతనన్నాడు.
వేరే కులాల వారు తాగిన గ్లాసుల్లో తాము తాగడం ఏంటనే ఉద్దేశంతోనే జనం పేపర్ కప్పుల్ని ప్రిఫర్ చేస్తున్నారన్నది తన ఉద్దేశం కావచ్చు. కానీ దీన్ని చాలామంది తప్పుబడుతున్నారు. ఇక్కడ శుభ్రత అన్నది ప్రయారిటీ తప్ప కులం కోణం ఉండదని.. దీన్ని కూడా అంటరానితనం కోణంలో చూడడం కరెక్ట్ కాదని.. కొందరి ఉద్దేశం అదే అయినా దాన్ని అందరికీ ఆపాదించడం కరెక్ట్ కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on August 14, 2024 8:04 pm
మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…
నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…