ప్రస్తుతం రీమేక్ సినిమాలు అనుకున్నంత బాగా ఆడట్లేదన్నది వాస్తవం. ఒక పేరున్న హీరో ఓ రీమేక్ చేస్తున్నాడంటే ప్రేక్షకులు అది ఏ భాషా చిత్రమైనా సరే.. వెతికి మరీ చూసేస్తున్నారు. కథ ముందే తెలిసిపోవడం వల్ల ఎగ్జైట్మెంట్ పోతోంది. ఆ తర్వాత రీమేక్ మూవీని చూస్తూ ఒరిజినల్తో పోల్చి చూస్తున్నారు. ఏమాత్రం తక్కువగా అనిపించినా విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రీమేక్ సినిమాలు తీయడం కత్తి మీద సాములా మారి.. ఈ ప్రయత్నాలు తగ్గించుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది.
ఐతే ఈ విషయంలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ రూటే వేరు. ఆయన కెరీర్లో రీమేక్ సినిమాలు ఎక్కువే కానీ.. ఒరిజినల్ను ఉన్నదున్నట్లు తీయకుండా మార్పులు చేర్పులు చేసి.. మసాలా అద్ది సినిమా రూపు రేఖలే మార్చేస్తుంటారు. ఇంతకుముందు గబ్బర్ సింగ్, గద్దలకొండ గణేష్.. ఇప్పుడు ‘మిస్టర్ బచ్చన్’ విషయంలోనూ ఆ ఫార్ములానే అనుసరించారు.
‘మిస్టర్ బచ్చన్’ గురువారమే విడుదల కాబోతుండగా.. దీని ఒరిజినల్ ‘రైడ్’ చూసే థియేటర్లకు రావాలని ప్రేక్షకులకు హరీష్ సూచించడం విశేషం. మామూలుగా రీమేక్ సినిమాలు చేసినపుడు.. ఒరిజినల్ చూడొద్దని మేకర్స్ చెబుతుంటారని.. కానీ తాను మాత్రం మాతృకను చూసే రావాలని కోరుతున్నానని హరీష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఒరిజినల్ చూసి వస్తేనే.. తాను ఏమేం మార్పులు చేశానో, ఒరిజినల్తో పోలిస్తే రీమేక్ను ఎంత భిన్నంగా తీర్చిదిద్దానో తెలుస్తుందని ఆయనన్నాడు. ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడానికి గట్స్ ఉండాలంటూ హరీష్ మీద సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.
తాను రీమేక్ సినిమాలు చేస్తానని ఎవ్వరైనా విమర్శలు చేస్తే వారి పట్ల జాలి పడతానని హరీష్ ఇంతకుముందే ఓ స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రీమేక్ సినిమాలు చేయడం అంత తేలిక కాదని కూడా ఆయనంటుంటాడు. మరి ‘రైడ్’ చూసి వెళ్లిన వారిని హరీస్ ఏ రకంగా సంతృప్తిపరుస్తాడో ఈ రోజు పడుతున్న ప్రిమియర్ షోలతోనే తేలిపోతుంది.
This post was last modified on August 14, 2024 4:06 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…