ప్రస్తుతం రీమేక్ సినిమాలు అనుకున్నంత బాగా ఆడట్లేదన్నది వాస్తవం. ఒక పేరున్న హీరో ఓ రీమేక్ చేస్తున్నాడంటే ప్రేక్షకులు అది ఏ భాషా చిత్రమైనా సరే.. వెతికి మరీ చూసేస్తున్నారు. కథ ముందే తెలిసిపోవడం వల్ల ఎగ్జైట్మెంట్ పోతోంది. ఆ తర్వాత రీమేక్ మూవీని చూస్తూ ఒరిజినల్తో పోల్చి చూస్తున్నారు. ఏమాత్రం తక్కువగా అనిపించినా విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రీమేక్ సినిమాలు తీయడం కత్తి మీద సాములా మారి.. ఈ ప్రయత్నాలు తగ్గించుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది.
ఐతే ఈ విషయంలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ రూటే వేరు. ఆయన కెరీర్లో రీమేక్ సినిమాలు ఎక్కువే కానీ.. ఒరిజినల్ను ఉన్నదున్నట్లు తీయకుండా మార్పులు చేర్పులు చేసి.. మసాలా అద్ది సినిమా రూపు రేఖలే మార్చేస్తుంటారు. ఇంతకుముందు గబ్బర్ సింగ్, గద్దలకొండ గణేష్.. ఇప్పుడు ‘మిస్టర్ బచ్చన్’ విషయంలోనూ ఆ ఫార్ములానే అనుసరించారు.
‘మిస్టర్ బచ్చన్’ గురువారమే విడుదల కాబోతుండగా.. దీని ఒరిజినల్ ‘రైడ్’ చూసే థియేటర్లకు రావాలని ప్రేక్షకులకు హరీష్ సూచించడం విశేషం. మామూలుగా రీమేక్ సినిమాలు చేసినపుడు.. ఒరిజినల్ చూడొద్దని మేకర్స్ చెబుతుంటారని.. కానీ తాను మాత్రం మాతృకను చూసే రావాలని కోరుతున్నానని హరీష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఒరిజినల్ చూసి వస్తేనే.. తాను ఏమేం మార్పులు చేశానో, ఒరిజినల్తో పోలిస్తే రీమేక్ను ఎంత భిన్నంగా తీర్చిదిద్దానో తెలుస్తుందని ఆయనన్నాడు. ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడానికి గట్స్ ఉండాలంటూ హరీష్ మీద సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.
తాను రీమేక్ సినిమాలు చేస్తానని ఎవ్వరైనా విమర్శలు చేస్తే వారి పట్ల జాలి పడతానని హరీష్ ఇంతకుముందే ఓ స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రీమేక్ సినిమాలు చేయడం అంత తేలిక కాదని కూడా ఆయనంటుంటాడు. మరి ‘రైడ్’ చూసి వెళ్లిన వారిని హరీస్ ఏ రకంగా సంతృప్తిపరుస్తాడో ఈ రోజు పడుతున్న ప్రిమియర్ షోలతోనే తేలిపోతుంది.
This post was last modified on August 14, 2024 4:06 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…