ప్రస్తుతం టాలీవుడ్ హ్యాపెనింగ్ హీరోయిన్లలో శ్రీలీల ఒకరు. తన అందచందాలు, చలాకీ నటన, డ్యాన్సింగ్ టాలెంట్తో ఆమె యువతను బాగానే ఆకట్టుకుంది. ‘ధమాకా’ బ్లాక్బస్టర్ కావడంతో శ్రీలీల స్టార్ స్టేటస్ సంపాదించేసింది. ఇప్పటికే ఆమె తెలుగులో అరడజను చిత్రాల్లో నటించేసింది. అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ ‘గుంటూరు కారం’ కూడా ఉండడం విశేషం.
ఐతే వరుసగా ఫ్లాపులు ఎదురు కావడంతో శ్రీలీల జోరు కాస్త తగ్గినట్లు అనిపించింది కానీ.. తనకు సినిమాల విషయంలో అయితే ఢోకా లేదు. ఉస్తాద్ భగత్ సింగ్, రాబిన్ హుడ్ లాంటి క్రేజీ చిత్రాలు చేతిలో ఉన్నాయి. కొత్తగా రవితేజ సినిమాను కూడా ఒప్పుకుంది.
కాగా ఇప్పుడు ఓ ప్రతిష్టాత్మక సంస్థలో శ్రీలీలకు సినిమా కన్ఫమ్ అయింది. అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ప్రొడక్షన్ హౌస్ గీతా ఆర్ట్స్లో ఆమె నటించబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా అల్లు అరవిందే వెల్లడించారు. గీతా ఆర్ట్స్-2 ప్రొడక్షన్లో వచ్చిన కొత్త చిత్రం ‘ఆయ్’ ప్రమోషనల్ ఈవెంట్కు శ్రీలీల హాజరైంది. ఈ సందర్భంగా అల్లు అరవింద్ ఆమెను పక్కన పెట్టుకుని మాట్లాడుతూ.. శ్రీలీలను ఈ ఈవెంట్కు పిలవడానికి తమ టీం కాల్ చేస్తే.. గీతా ఆర్ట్స్లో సినిమా ఇస్తారనుకుంటే ఈవెంట్కు పిలుస్తారా అని జోక్ చేసిందని.. తను చాలా కష్టపడి చాలా దూరం నుంచి ఈ కార్యక్రమానికి వచ్చిందని అరవింద్ చెప్పారు.
ఐతే ఈ స్టేజ్ మీదే తనకు చెబుతున్నా అంటూ తమ సంస్థలో రాబోతున్న ఓ సినిమాలో శ్రీలీల ఓ మంచి పాత్ర చేయబోతోందని వెల్లడించారు. అరవింద్ ఇంత ప్రత్యేకంగా చెప్పారంటే బన్నీ సరసన ఏమైనా శ్రీలీల ఛాన్స్ కొట్టేస్తుందేమో చూడాలి.
This post was last modified on August 14, 2024 4:03 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…