సుషాంత్ సింగ్ రాజ్పుట్ది ఆత్మహత్య కాదు హత్య అంటూ అతని తండ్రి ఆరోపించాడు. తన అనుమానాలను వ్యక్తం చేస్తూ ఎఫ్ఐఆర్ దాఖలు చేసాడు. ముందు ఆ కోణంలోనే మొదలైన దర్యాప్తు విచారణలో డ్రగ్స్ యాంగిల్ వైపు డైవర్ట్ అయింది. రియా చక్రవర్తిని ఒక కేసు మీద విచారణకు పిలిచి మరో వ్యవహారంలో దోషిగా నిలబెట్టి అరెస్ట్ చేసారు. ఇక అక్కడ్నుంచి నెమ్మదిగా సుషాంత్ సింగ్ కథ మరుగున పడిపోతూ వచ్చింది.
ప్రస్తుతం ఆ కేసు పూర్తిగా డ్రగ్స్ చుట్టూనే తిరుగుతోంది. రియా చిన్న చేప అయితే ఇప్పుడు దీపిక, శ్రద్ధ, రకుల్ లాంటి పెద్ద వాళ్లను విచారణకు పిలిపిస్తూ వుండడంతో మీడియా కూడా సుషాంత్ సింగ్ ముచ్చట మరచిపోయింది. అతడు మరణించి అయిదు నెలలు గడచిపోవడంతో సోషల్ మీడియాలో కూడా హడావుడి తగ్గిపోయింది. సుషాంత్ కేసుని పక్కదోవ పట్టించేసారని, అతడికి న్యాయం జరగకుండా వేరే ఏవో విషయాలతో కాలక్షేపం చేస్తున్నారని అతని కుటుంబం ఆక్రోశం వ్యక్తం చేస్తోంది.
జనాలకు కూడా ఎప్పటికప్పుడు కొత్త అంశాలు కావాలి కనుక సుషాంత్ ఆత్మహత్య పరంగా ఎలాంటి ఎక్సయిటింగ్ అప్డేట్స్ లేక దానిని వదిలేసారు. దీపిక లాంటి పెద్ద హీరోయిన్లు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారగానే దీని గురించి మరింత సమాచారం కోసం ఇంటర్నెట్లో దేవులాడుతున్నారు.
This post was last modified on September 26, 2020 9:39 pm
కడప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను కడప…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న హరిహర వీరమల్లు రెండు…
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…