మెహర్ రమేష్తో సినిమా చేస్తున్నట్టు చిరంజీవి కూడా అధికారికంగా ప్రకటించేసారు. అయితే ఆ సినిమా ఎప్పుడు మొదలయ్యేదీ ఆయన స్పష్టత ఇవ్వలేదు. లూసిఫర్ రీమేక్ వినాయక్తో, వేదళాం రీమేక్ మెహర్తో ఖాయం చేసుకున్నారు. లూసిఫర్ గురించి వినాయక్ వైపు నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. కానీ మెహర్ రమేష్ సినిమా మాత్రం ఏదో ఒక రకంగా వార్తల్లో నానుతూనే వుంది.
ఇంకా చెప్పాలంటే ముందుగా రావాల్సిన ‘ఆచార్య’ కంటే ఈ చిత్రం గురించే మీడియాలో ఎక్కువగా రాస్తున్నారు. రాక రాక వచ్చిన అవకాశాన్ని ఎలాగయినా సద్వినియోగం చేసుకోవాలని, మెగాస్టార్ మనసు మార్చుకోకముందే ఈ చిత్రానికి అన్నీ ఖాయం చేసేసి పెట్టేయాలని మెహర్ తొందర పడుతున్నట్టున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కోసం ఒక ట్యూన్ రెడీ చేయించేసాడట. తాజాగా కెజిఎఫ్ ఫైట్ మాస్టర్లను తీసుకెళ్లి చిరంజీవితో మీటింగ్ పెట్టించాడట.
అలాగే సాయి పల్లవిని చెల్లెలి పాత్రకు ఓకే చేయడం కోసం ఇప్పట్నుంచే ఆమె మేనేజర్ చుట్టూ తిరుగుతున్నాడట. ఆచార్య షూటింగ్ పూర్తయ్యేలోగా ఈ చిత్రానికి అన్నీ సిద్ధం చేసేసి, లూసిఫర్ కంటే ముందు ఈ చిత్రాన్ని మెగాస్టార్ మొదలు పెట్టేలా చేయాలనేది మెహర్ లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ చిత్రానికి అనిల్ సుంకర నిర్మాత అంటున్నారు కానీ ఇంతవరకు అధికారికంగా ధృవీకరించలేదు.
This post was last modified on September 27, 2020 3:47 pm
టీడీపీ అధినేత చంద్రబాబుకు.. బిగ్ బ్రేక్ వచ్చింది. ఇప్పటి వరకు కేంద్రంలోని పెద్దలు ఎవరూ.. ముఖ్యంగా బీజేపీ అగ్రనాయకులుగా ఉన్నవారు…
ఏపీలో సంచలనం చోటు చేసుకుంది. ఎన్నికల వేళ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది…
ఏపీలో ఎన్నికలకు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నెల 13న అంటే వచ్చే సోమవారం.. ఎన్నికల…
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మెగా పవర్ స్టార్ ఆలస్యం చేయకుండా శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ మొదలుపెట్టేశాడని చాలా సంతోషించారు మెగా…
కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత.. అమిత్ షా.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశా రు.…
ఈ ఏడాది పాన్ ఇండియా స్థాయిలో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. ‘పుష్ప: ది రైజ్’తో…