ఆర్.ఆర్.ఆర్. చిత్రం కోసం ఇంకొద్ది రోజుల పాటు పని చేస్తే తారక్ పని అయిపోతుంది. ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా మొదలు పెట్టేస్తాడు. అయితే ఈ కరోనా సంక్షోభం వల్ల అదెప్పటికి జరుగుతుందనేది తెలీదు. అయితే ఈ లాక్ డౌన్ వల్ల ఎక్కువ సమయం దొరకడంతో త్రివిక్రమ్ కథ పక్కాగా సిద్ధం చేసుకుంటున్నాడు.
అరవింద సమేత చేసినప్పుడు ఎన్టీఆర్ కూడా స్క్రిప్ట్ డిస్కషన్ లో కూర్చునేవాడు. ఈసారి లాక్ డౌన్ వల్ల ఎవరింటికి వాళ్లే పరిమితం అయ్యారు. అయినా కానీ ఎన్టీఆర్ స్క్రిప్ట్ గురించి ఎప్పటికప్పుడు త్రివిక్రమ్ తో చర్చిస్తున్నాడు. త్రివిక్రమ్ రాసిన సన్నివేశాల గురించి వీడియో కాల్స్ ద్వారా ఇద్దరు గంటలు గంటలు మాట్లాడుకుంటూ కావాల్సిన విధంగా మలచుకుంటున్నారట.
ఇప్పటికే కథ చాలా వరకు రెడీ అయిందని, మరో నెల రోజుల్లో స్క్రిప్ట్ లాక్ అయిపోతుందని తెలిసింది. ఒకసారి అది లాక్ అయిపోతే త్రివిక్రమ్ డైలాగ్ వెర్షన్ కి వెళ్తాడు. ఎన్టీఆర్ ఇక ఆర్.ఆర్.ఆర్. బాలన్స్ పని కోసం చూస్తాడు. మొత్తానికి ఈ లాక్ డౌన్ వల్ల ఎన్టీఆర్ పనులు అటు ఇటు అయ్యాయి తప్ప పూర్తిగా ఆగిపోలేదన్నమాట.
This post was last modified on April 28, 2020 3:08 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…