బాలీవుడ్ హీరోయిన్ల గురించి ఏదో ఒక దశలో ఎఫైర్ వార్తలు రాకపోతే ఆశ్చర్యపోవాలి. ఏ ఎఫైర్ లేకుంటే ఇక్కడ పాపులారిటీ రావడం కూడా కష్టమే. అందుకే కొందరు హీరోయిన్లు కావాలని మీడియాకు లీక్స్ ఇస్తుంటారని కూడా ప్రచారం జరుగుతూ ఉంటుంది. ఆ సంగతి అలా ఉంచితే ‘1 నేనొక్కడినే’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించి.. ఆపై బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగిన కృతి గురించి గతంలో కొన్ని ఎఫైర్ వార్తలు వచ్చాయి. కాగా ఈ మధ్య తన గురించి వచ్చిన రూమర్ మాత్రం ఆశ్చర్యకరమైంది.
ప్రస్తుతం కృతికి 34 ఏళ్లు కాగా.. తనకంటే పదేళ్ల చిన్నవాడైన కబీర్ బహియా అనే యూకే వ్యాపారవేత్తతో ఆమె ప్రేమలో పడిందని.. వీళ్లిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నారని ఇటీవల బాలీవుడ్ మీడియాలో వార్తలొచ్చాయి. సోషల్ మీడియాలో కూడా దీని గురించి రచ్చ జరుగుతోంది.
ఐతే ఈ రూమర్ల మీద కృతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. “నా గురించి తప్పుడు సమాచారం రాసినపుడు నాతో పాటు కుటుంబం కూడా బాధ పడుతుంది. దాని వల్ల వచ్చే పరిణామాలను మేమంతా ఎదుర్కోవాలి. ’34 ఏళ్ల కృతి తనకంటే పదేళ్ల చిన్న వ్యక్తితో డేటింగ్ చేస్తోంది’ అంటూ హెడ్డింగ్ పెట్టి వార్తలు రాశారు. దీన్ని చాలామంది ఉపయోగించారు. ఏమాత్రం నిజానిజాలు తెలుసుకోకుండా ఇలా ఇష్టం వచ్చినట్లు రాసేశారు. ఇది ఈ మధ్య కామన్ అయిపోయింది. సోషల్ మీడియా లేనపుడు పత్రికల్లో వార్తలు చూసి జనం ఒక అభిప్రాయానికి వచ్చేవారు. ఇప్పుడు ఆన్ లైన్లో ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు రాస్తున్నారు. నెగెటివ్ కామెంట్స్ పెట్టడం ఒక ట్రెండ్ అయిపోయింది. మీరు రాసే వార్తలతో ఎందరో స్పందించి మెసేజ్ చేస్తారు. అవి సులభంగా ప్రజల్లోకి వెళ్లిపోతాయి. వాళ్లందరికీ వివరణ ఇచ్చుకోవడం ఎంతో ఇబ్బంది కలిగిస్తుంది” అని కృతి పేర్కొంది.
This post was last modified on August 13, 2024 9:16 pm
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…
ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…
సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…
అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…