బాలీవుడ్ హీరోయిన్ల గురించి ఏదో ఒక దశలో ఎఫైర్ వార్తలు రాకపోతే ఆశ్చర్యపోవాలి. ఏ ఎఫైర్ లేకుంటే ఇక్కడ పాపులారిటీ రావడం కూడా కష్టమే. అందుకే కొందరు హీరోయిన్లు కావాలని మీడియాకు లీక్స్ ఇస్తుంటారని కూడా ప్రచారం జరుగుతూ ఉంటుంది. ఆ సంగతి అలా ఉంచితే ‘1 నేనొక్కడినే’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించి.. ఆపై బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగిన కృతి గురించి గతంలో కొన్ని ఎఫైర్ వార్తలు వచ్చాయి. కాగా ఈ మధ్య తన గురించి వచ్చిన రూమర్ మాత్రం ఆశ్చర్యకరమైంది.
ప్రస్తుతం కృతికి 34 ఏళ్లు కాగా.. తనకంటే పదేళ్ల చిన్నవాడైన కబీర్ బహియా అనే యూకే వ్యాపారవేత్తతో ఆమె ప్రేమలో పడిందని.. వీళ్లిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నారని ఇటీవల బాలీవుడ్ మీడియాలో వార్తలొచ్చాయి. సోషల్ మీడియాలో కూడా దీని గురించి రచ్చ జరుగుతోంది.
ఐతే ఈ రూమర్ల మీద కృతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. “నా గురించి తప్పుడు సమాచారం రాసినపుడు నాతో పాటు కుటుంబం కూడా బాధ పడుతుంది. దాని వల్ల వచ్చే పరిణామాలను మేమంతా ఎదుర్కోవాలి. ’34 ఏళ్ల కృతి తనకంటే పదేళ్ల చిన్న వ్యక్తితో డేటింగ్ చేస్తోంది’ అంటూ హెడ్డింగ్ పెట్టి వార్తలు రాశారు. దీన్ని చాలామంది ఉపయోగించారు. ఏమాత్రం నిజానిజాలు తెలుసుకోకుండా ఇలా ఇష్టం వచ్చినట్లు రాసేశారు. ఇది ఈ మధ్య కామన్ అయిపోయింది. సోషల్ మీడియా లేనపుడు పత్రికల్లో వార్తలు చూసి జనం ఒక అభిప్రాయానికి వచ్చేవారు. ఇప్పుడు ఆన్ లైన్లో ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు రాస్తున్నారు. నెగెటివ్ కామెంట్స్ పెట్టడం ఒక ట్రెండ్ అయిపోయింది. మీరు రాసే వార్తలతో ఎందరో స్పందించి మెసేజ్ చేస్తారు. అవి సులభంగా ప్రజల్లోకి వెళ్లిపోతాయి. వాళ్లందరికీ వివరణ ఇచ్చుకోవడం ఎంతో ఇబ్బంది కలిగిస్తుంది” అని కృతి పేర్కొంది.
This post was last modified on August 13, 2024 9:16 pm
టిల్లు సిరీస్ తర్వాత సిద్దు జొన్నలగడ్డ చేస్తున్న సినిమాగా జాక్ మీద ఈపాటికి భారీ అంచనాలు నెలకొనాలి. అయితే బయట…
ఏపీ సీఎం చంద్రబాబుపై జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మరోసారి పొగడ్తల వర్షం కురిపించారు. బాబు ఔదార్యం…
దేశంలో మహిళలు, బాలికలకు భద్రతే లేకుండా పోయింది. ఈ మాటలు కాస్తంత కఠువుగా ఉన్నా.. వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలు…
కొన్ని పాత్రల విషయంలో మేకర్స్ చాలా పర్టికులర్గా ఉంటారు. ఒక పాత్రను ఫలానా వాళ్లు చేస్తేనే సినిమా చేయాలని లేదంటే లేదని…
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకుంటున్న పలు నిర్ణయాలు ప్రవాస భారతీయుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోన్న సంగతి…
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం అల్లూరి సీతారామ రాజు జిల్లా పర్యటనకు వెళ్లారు. గిరి…