ఆగస్ట్ 15 విపరీతమైన బాక్సాఫీస్ పోటీ నడుమ ఒక తమిళ డబ్బింగ్ సినిమా జనం దృష్టిలో ఉండటం విశేషమే. అదే తంగలాన్. హీరో చియాన్ విక్రమ్ ఏదో మొక్కుబడిగా ఒకటి రెండు ప్రమోషన్లు చేయకుండా ఏపీ, తెలంగాణలో విస్తృతంగా పర్యటించి తన ప్యాన్ ఇండియా మూవీ గురించి ఎక్కువగా ప్రేక్షకుల దృష్టిలో పడేలా చేస్తున్నాడు. ఒరిజినల్ వెర్షన్ బుకింగ్స్ దుమ్ము రేపుతున్న తమిళనాడులో కాకుండా ఇక్కడ ఫోకస్ పెట్టడానికి కారణం లేకపోలేదు. డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్, ఆయ్ నుంచి తంగలాన్ కు తీవ్రమైన పోటీ ఎదురవుతోంది. ఓపెనింగ్స్ మీద వీటి ప్రభావం తీవ్రంగా ఉండనుంది.
అందుకే అడ్వాన్స్ బుకింగ్స్ గమనిస్తే రామ్, రవితేజలున్నంత దూకుడుగా విక్రమ్ కనిపించడం లేదు. పొన్నియిన్ సెల్వన్ వచ్చిన టైంలో కాంపిటీషన్ లేకపోవడంతో పాటు మణిరత్నం బ్రాండ్ తోడై జనం ఆసక్తి చూపించారు. కానీ తంగలాన్ కేసు వేరు. ఇది రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాదు. గ్లామర్ అంశాలు, మాస్ విజిల్స్ కొట్టించే డైలాగులు, గూస్ బంప్స్ ఎపిసోడ్స్ ఉండవు. కానీ ఒక సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేలా దర్శకుడు పా రంజిత్ దశాబ్దాల వెనుకటి కథ తీసుకున్నాడు. బంగారం కోసం ఒక అటవీ జాతి చేసే యుద్ధంలో శపించబడిన దెయ్యం వస్తే ఎలా ఉంటుందనే పాయింట్ మీద రూపొందించారు.
ఇంత కష్టపడి నటించినందుకు, ప్రమోషన్లు చేసుకున్నందుకు విక్రమ్ కు ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాలి. జైలర్ తర్వాత తమిళ డబ్బింగులు పెద్దగా ఆడిన దాఖలాలు లేని నేపథ్యంలో తంగలాన్ మీద భారీ బరువు ఉంది. దాన్ని నిలబెట్టుకోవడం కీలకం. విక్రమ్, మాళవిక మోహనన్ తో సహా ఎవరిని అంత సులభంగా పోల్చుకోలేనంత విచిత్రమైన గెటప్పులతో కనిపిస్తున్న ఈ హిస్టారిక్ డ్రామా కనక తెలుగులోనూ హిట్ అయితే నిజంగా హిస్టరీగా చెప్పుకోవచ్చు. సంక్రాంతి సీజన్ ని తలపించేలా ఆగస్ట్ 15 జరుగుతున్న పోటీలో అనువాదంతో వస్తున్న తంగలాన్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
This post was last modified on August 13, 2024 12:39 pm
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…