ఆగస్ట్ 15 విపరీతమైన బాక్సాఫీస్ పోటీ నడుమ ఒక తమిళ డబ్బింగ్ సినిమా జనం దృష్టిలో ఉండటం విశేషమే. అదే తంగలాన్. హీరో చియాన్ విక్రమ్ ఏదో మొక్కుబడిగా ఒకటి రెండు ప్రమోషన్లు చేయకుండా ఏపీ, తెలంగాణలో విస్తృతంగా పర్యటించి తన ప్యాన్ ఇండియా మూవీ గురించి ఎక్కువగా ప్రేక్షకుల దృష్టిలో పడేలా చేస్తున్నాడు. ఒరిజినల్ వెర్షన్ బుకింగ్స్ దుమ్ము రేపుతున్న తమిళనాడులో కాకుండా ఇక్కడ ఫోకస్ పెట్టడానికి కారణం లేకపోలేదు. డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్, ఆయ్ నుంచి తంగలాన్ కు తీవ్రమైన పోటీ ఎదురవుతోంది. ఓపెనింగ్స్ మీద వీటి ప్రభావం తీవ్రంగా ఉండనుంది.
అందుకే అడ్వాన్స్ బుకింగ్స్ గమనిస్తే రామ్, రవితేజలున్నంత దూకుడుగా విక్రమ్ కనిపించడం లేదు. పొన్నియిన్ సెల్వన్ వచ్చిన టైంలో కాంపిటీషన్ లేకపోవడంతో పాటు మణిరత్నం బ్రాండ్ తోడై జనం ఆసక్తి చూపించారు. కానీ తంగలాన్ కేసు వేరు. ఇది రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాదు. గ్లామర్ అంశాలు, మాస్ విజిల్స్ కొట్టించే డైలాగులు, గూస్ బంప్స్ ఎపిసోడ్స్ ఉండవు. కానీ ఒక సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేలా దర్శకుడు పా రంజిత్ దశాబ్దాల వెనుకటి కథ తీసుకున్నాడు. బంగారం కోసం ఒక అటవీ జాతి చేసే యుద్ధంలో శపించబడిన దెయ్యం వస్తే ఎలా ఉంటుందనే పాయింట్ మీద రూపొందించారు.
ఇంత కష్టపడి నటించినందుకు, ప్రమోషన్లు చేసుకున్నందుకు విక్రమ్ కు ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాలి. జైలర్ తర్వాత తమిళ డబ్బింగులు పెద్దగా ఆడిన దాఖలాలు లేని నేపథ్యంలో తంగలాన్ మీద భారీ బరువు ఉంది. దాన్ని నిలబెట్టుకోవడం కీలకం. విక్రమ్, మాళవిక మోహనన్ తో సహా ఎవరిని అంత సులభంగా పోల్చుకోలేనంత విచిత్రమైన గెటప్పులతో కనిపిస్తున్న ఈ హిస్టారిక్ డ్రామా కనక తెలుగులోనూ హిట్ అయితే నిజంగా హిస్టరీగా చెప్పుకోవచ్చు. సంక్రాంతి సీజన్ ని తలపించేలా ఆగస్ట్ 15 జరుగుతున్న పోటీలో అనువాదంతో వస్తున్న తంగలాన్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…