ఆగస్ట్ 15 విపరీతమైన బాక్సాఫీస్ పోటీ నడుమ ఒక తమిళ డబ్బింగ్ సినిమా జనం దృష్టిలో ఉండటం విశేషమే. అదే తంగలాన్. హీరో చియాన్ విక్రమ్ ఏదో మొక్కుబడిగా ఒకటి రెండు ప్రమోషన్లు చేయకుండా ఏపీ, తెలంగాణలో విస్తృతంగా పర్యటించి తన ప్యాన్ ఇండియా మూవీ గురించి ఎక్కువగా ప్రేక్షకుల దృష్టిలో పడేలా చేస్తున్నాడు. ఒరిజినల్ వెర్షన్ బుకింగ్స్ దుమ్ము రేపుతున్న తమిళనాడులో కాకుండా ఇక్కడ ఫోకస్ పెట్టడానికి కారణం లేకపోలేదు. డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్, ఆయ్ నుంచి తంగలాన్ కు తీవ్రమైన పోటీ ఎదురవుతోంది. ఓపెనింగ్స్ మీద వీటి ప్రభావం తీవ్రంగా ఉండనుంది.
అందుకే అడ్వాన్స్ బుకింగ్స్ గమనిస్తే రామ్, రవితేజలున్నంత దూకుడుగా విక్రమ్ కనిపించడం లేదు. పొన్నియిన్ సెల్వన్ వచ్చిన టైంలో కాంపిటీషన్ లేకపోవడంతో పాటు మణిరత్నం బ్రాండ్ తోడై జనం ఆసక్తి చూపించారు. కానీ తంగలాన్ కేసు వేరు. ఇది రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాదు. గ్లామర్ అంశాలు, మాస్ విజిల్స్ కొట్టించే డైలాగులు, గూస్ బంప్స్ ఎపిసోడ్స్ ఉండవు. కానీ ఒక సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేలా దర్శకుడు పా రంజిత్ దశాబ్దాల వెనుకటి కథ తీసుకున్నాడు. బంగారం కోసం ఒక అటవీ జాతి చేసే యుద్ధంలో శపించబడిన దెయ్యం వస్తే ఎలా ఉంటుందనే పాయింట్ మీద రూపొందించారు.
ఇంత కష్టపడి నటించినందుకు, ప్రమోషన్లు చేసుకున్నందుకు విక్రమ్ కు ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాలి. జైలర్ తర్వాత తమిళ డబ్బింగులు పెద్దగా ఆడిన దాఖలాలు లేని నేపథ్యంలో తంగలాన్ మీద భారీ బరువు ఉంది. దాన్ని నిలబెట్టుకోవడం కీలకం. విక్రమ్, మాళవిక మోహనన్ తో సహా ఎవరిని అంత సులభంగా పోల్చుకోలేనంత విచిత్రమైన గెటప్పులతో కనిపిస్తున్న ఈ హిస్టారిక్ డ్రామా కనక తెలుగులోనూ హిట్ అయితే నిజంగా హిస్టరీగా చెప్పుకోవచ్చు. సంక్రాంతి సీజన్ ని తలపించేలా ఆగస్ట్ 15 జరుగుతున్న పోటీలో అనువాదంతో వస్తున్న తంగలాన్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
This post was last modified on August 13, 2024 12:39 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…