ఆగస్ట్ 22 చిరంజీవి పుట్టినరోజుని పురస్కరించుకుని ఇంద్రని గ్రాండ్ గా రీ రిలీజ్ చేస్తామని గత నెల వైజయంతి మూవీస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే డేట్ దగ్గర పడుతున్నా ఎలాంటి ప్రమోషన్లు లేవని, కనీసం కౌంట్ డౌన్ పోస్టర్లు కూడా వదలడం లేదని మెగా ఫ్యాన్స్ గత రెండు రోజులుగా ఎక్స్ వేదికగా నిరసన స్వరం వినిపిస్తున్నారు. కల్కి వర్కింగ్ స్టిల్స్ పెట్టడమే తప్ప ఇంద్ర గురించి ఎలాంటి ఊసు లేకపోవడం గురించి కాసింత కోపంగానే ఉన్నారు. ఎప్పుడో ఇరవై రోజుల తర్వాత వచ్చే గబ్బర్ సింగ్ హడావిడిలో కనీసం పావు వంతు కూడా ఇంద్రకు లేదని వాపోతున్నారు.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇంద్ర రావడం దాదాపు అనుమానమేనట. ఎందుకంటే ఆగస్ట్ 15 పెద్ద ఎత్తున కొత్త సినిమాల పోటీ ఉంది. వారం రెండు వారాలు అగ్రిమెంట్లు చేసుకుని థియేటర్లకు వస్తున్నాయి. అవి ఉండగా ఇంద్రకు సరిపడా స్క్రీన్లు దొరకవు. ఒకవేళ డిస్ట్రిబ్యూటర్లు ఆసక్తి చూపించినా చేతులారా కొత్త చిత్రాల రెవిన్యూని రిస్క్ లో పెట్టినట్టు అవుతుంది. మొన్న మురారి వల్ల కమిటీ కుర్రోళ్ళ వసూళ్లలో కోత పడిందనేది కాదనలేని వాస్తవం. రవితేజ, రామ్, విక్రమ్ లాంటి క్రేజీ హీరోలతో ఇంద్ర పోటీ పడటం సబబు కాదనేది ట్రేడ్ తో పాటు అశ్వినిదత్ బృందం భావిస్తోందట.
దీనికి సంబంధించిన ఏదో ఒక నిర్ణయం ఆగస్ట్ 15 వెలువరించాలని ఫిక్సయ్యారట. ఒకవేళ పోస్టుపోన్ అంటే మాత్రం ఇంకో నెల రెండు నెలలు ఆలస్యం కావొచ్చు. సెప్టెంబర్ 2 గబ్బర్ సింగ్ వచ్చాక కొంచెం గ్యాప్ వచ్చేలా చూసుకుంటే బెటర్. లేదూ మెగాస్టార్ బర్త్ డే కానుకగా ఆగస్ట్ 22నే రిలీజ్ చేస్తామంటే స్క్రీన్ల సమస్యని ఎలా పరిష్కరిస్తారో చూడాలి. ఏది ఏమైనా మెగాభిమానులు ప్రతికూల ప్రకటనకే ప్రిపేరైతే బెటరేమో. ఎప్పుడు వచ్చినా ఇంద్ర రికార్డులు మ్రోగించడం ఖాయమే. కాకపోతే అది పుట్టినరోజే జరగాలని ఫ్యాన్స్ ఆకాంక్ష. ఏం చేయబోతున్నారో లెట్ వెయిట్ అండ్ సీ.
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. హైదరాబాద్ లోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా…
తెలంగాణలో జనసేన అస్థిత్వంపై అనేక విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. అనేక ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడం..ఆ తర్వాత…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై భూకబ్జా ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని శంకర్పల్లి…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉండే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. గతంలో…
ఈ రోజు జనసేన తలపెట్టిన 'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ-జనసేన సాధక్ సమ్మేళనం' సభకు తెలంగాణ పోలీసులు, హైకోర్టు…
దర్శకుడు గుణశేఖర్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పుడేదో ఫ్లాపుల్లో ఉన్నారు కానీ ఒక్కడు, చూడాలని ఉంది, రామాయణం, సొగసు…