పెద్ద నిర్మాణ సంస్థలైనా సరే చిన్న సినిమా తీసినప్పుడు పెద్ద చిత్రాలతో పోటీ పడేందుకు ముందు వెనుకా ఆలోచిస్తాయి. కారణం ఓపెనింగ్స్ తో పాటు మాస్ జనం స్టార్లకు ఇచ్చే ప్రాధాన్యం తమను ఎక్కడ దెబ్బ కొడుతుందోననే అనుమానంతో ఆషామాషీ నిర్ణయాలు తీసుకోవు. కానీ ఆయ్ టీమ్ మాత్రం పెద్ద రిస్క్ కు సిద్ధపడుతోంది. సితార బ్యానర్ నిర్మించిన మ్యాడ్ తో పరిచయమైన జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నితిన్ నార్నె హీరోగా నటించిన ఈ విలేజ్ ఎంటర్ టైనర్ ని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పించగా బన్నీ వాస్ నిర్మించారు. ఆగస్ట్ 15 సాయంత్రం నుంచి ప్రీమియర్లు మొదలుకాబోతున్నాయి.
ఒకపక్క డబుల్ ఇస్మార్ట్, ఇంకోవైపు మిస్టర్ బచ్చన్. ఇవి చాలవన్నట్టు తమిళ డబ్బింగ్ తంగలాన్. నైజాంలో మూడింటిని మైత్రినే పంపిణి చేస్తోంది. గీతాకు స్వంతంగా డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ ఉంది కాబట్టి పెద్దగా ఇబ్బందేం లేదనుకున్నా జనాలను రప్పించేందుకు అది సరిపోదు. కంటెంట్ బలంగా మాట్లాడాలి. సినిమా బాగుందనే టాక్ వస్తే చిన్నా పెద్ద తేడా చూడకుండా ఆడియన్స్ వస్తారు కానీ నచ్చినవన్నీ ఆడేందుకు ఇది సంక్రాంతి సీజన్ కాదు. కాకపోతే ఇండిపెండెన్స్ డే లాంగ్ వీకెండ్ తో పాటు రాఖీ పండగ లాంటి వరుస సెలవులు కలిసి రావడం వల్ల అందరికీ ఈ డేట్ మీద కన్ను పడింది.
సో బిగ్ షాట్స్ మధ్య ఆయ్ పరిగెత్తాల్సి ఉంటుంది. గోదావరి బ్యాక్ డ్రాప్ లో కుర్రాళ్ళ అల్లరి, సరదా ప్రేమకథలో కులాల ప్రస్తావన లాంటి అంశాలు తీసుకున్న ఆయ్ టీమ్ ఫలితం మీద చాలా ధీమా ఉంది. కొంచెం ఇదే నేపథ్యంలో ఇటీవలే వచ్చిన కమిటీ కుర్రోళ్ళు సక్సెస్ దీనికి మరింత బలం చేకూర్చవచ్చు కానీ సోలోగా వస్తే కలిగే లాభం కాంపిటీషన్ లో ఉండదుగా. ఎన్నో కథలు విని ఆయ్ ఓకే చేశామని చెబుతున్న బన్నీ వాస్ సినిమాకు దక్కే ఆదరణ పట్ల కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ప్రీ రిలీజ్ గెస్టులుగా అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ లను ట్రై చేశారు కానీ నాగచైతన్య వస్తున్నట్టు టాక్.
This post was last modified on August 12, 2024 11:17 am
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…