ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మీద సంగీత ప్రియులకు ఉన్న అభిమానాన్ని మరో స్థాయికి తీసుకెళ్లిన ఘనత రామోజీ రావుదే. ఆయన ఈటీవీలో బాలు ఆధ్వర్యంలో నడిపించిన ‘పాడుతా తీయగా’ ప్రోగ్రాం ఎంతటి ఆదరణ సంపాదించుకుందో.. సంగీత ప్రియుల్ని ఎంతగా అలరించిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈ ప్రోగ్రాం ద్వారానే రామోజీ రావు, బాలుల మధ్య గొప్ప అనుబంధం ఏర్పడింది.
చెన్నైలో నివాసముండే బాలు.. ఈ ప్రోగ్రాం కోసం ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్ వచ్చి వెళ్తున్నారు. ఐతే ఈ సందర్భంగా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్లో బాలు అడుగు పెట్టిన దగ్గర్నుంచి తిరిగి వెళ్లే వరకు ఆయన ఎక్కడికి వెళ్లాలన్నా కూడా రామోజీ గ్రూప్ వాళ్ల కారునే వాడేవారట. చెన్నైలో బయల్దేరే ముందు ఫోన్ చేసి విషయం చెప్పగానే ఆయన కోసం ఎయిర్పోర్టులో కారుండేదట. హైదరాబాద్లో ఇంకా ఏమేం పనులున్నప్పటికీ బాలు ఆ కారులోనే వెళ్లేవారట.
గతంలో ‘పాడుతా తీయగా’ సంబంధించిన ఒక బహుమతి ప్రదానోత్సవంలో రామోజీ రావు పక్కనుండగా బాలు ఈ విషయాల్ని వెల్లడించారు. ఒకసారి వ్యక్తిగత పని మీద తాను హైదరాబాద్ వచ్చానని.. ఆ సమయంలో కారు కోసం రామోజీ గారి ఆఫీసుకి ఫోన్ చేస్తే ఎవరూ రెస్పాండవలేదని.. దీంతో ధైర్యం చేసి తాను నేరుగా రామోజీ గారి ఇంటికే ఫోన్ చేశానని.. స్వయంగా ఆయనే ఫోన్ తీశారని.. కారు గురించి చెబితే ఆయన కనుక్కుని చూశారని.. ఆదివారం కావడం వల్ల డ్రైవర్లెవరూ అందుబాటులో లేరని చెప్పారని బాలు వెల్లడించారు.
ఐతే వేరే డ్రైవర్లు లేకపోయినా.. మరొకరు ఉన్నారని.. అతను కారు నడిపి చాలా కాలం అయిందని చెబుతూ ఆ వ్యక్తి పేరు ‘రామోజీ రావు’ అని వెల్లడించారని.. ఆయనలా అనగానే తాను సిగ్గు పడ్డానని, ఎక్కువ చనువు తీసుకున్నానా అనిపించిందని బాలు చెప్పారు. ఐతే తర్వాత రామోజీ రావు పెద్ద కొడుకు కిరణ్ ఎయిర్పోర్టుకు వచ్చి తనను రిసీవ్ చేసుకున్నట్లు బాలు వెల్లడించారు.
This post was last modified on September 26, 2020 9:38 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…