ఒకప్పుడు బిచ్చగాడు రూపంలో పాతిక కోట్ల బ్లాక్ బస్టర్ అందుకున్న విజయ్ ఆంటోని కొత్త సినిమా ఒకటి నిన్న రిలీజైన విషయమే జనాలకు రిజిస్టర్ కానంత బలహీనంగా ప్రమోట్ అయ్యింది. కెరీర్ మొత్తం మీద ఇప్పటిదాకా రెండే హిట్లతో నెట్టుకొస్తున్న ఈ తమిళ హీరోకు తెలుగులో మార్కెట్ ఎప్పుడో జీరో అయినా ఇంకా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో వచ్చిందే తుఫాన్. నిన్న వారం టాలీవుడ్ లో విపరీతమైన పోటీ ఉండటంతో ఒరిజినల్ వెర్షన్ విడుదలైన వారం తర్వాత తెలుగు డబ్బింగ్ తీసుకొచ్చారు. ఇంతా చేసి ఈ తుఫాన్ ఎలా ఉందంటే గాలిలో కలిసిపోయిందనే మాట చెప్పొచ్చు.
ముందు కథేంటో చూద్దాం. అండమాన్ లో అండర్ కవర్ లా బ్రతుకుతున్న సలీం (విజయ్ ఆంటోనీ) కి భార్య చనిపోయిన గాయం వెంటాడుతూ ఉంటుంది. ఇప్పుడున్న చోటు కూడా చీఫ్ (శరత్ కుమార్) ఆదేశాల మేరకు ఎంచుకున్నదే. స్థానికంగా వడ్డీ వ్యాపారం చేస్తూ జనాల రక్తాన్ని జలగలా పీలుస్తున్న డాలీ (పుష్ప ధనుంజయ్) వల్ల బాధితురాలిగా మారిన సౌమ్య (మేఘా ఆకాష్) సలీంకు పరిచయమవుతుంది. ఆమెతో ఏర్పడ్డ బంధం కాపాడే బాధ్యతను తీసుకునేలా చేస్తుంది. అసలు ఇతని వెనుక రహస్య మిషన్ ఏంటి, ఎవరు ఇదంతా చేయిస్తున్నారనే ప్రశ్నకు సమాధానమే తుఫాన్.
దర్శకుడు విజయ్ మిల్టన్ విపరీతమైన హాలీవుడ్ ప్రభావానికి గురై స్టయిలిష్ మేకింగ్ మీద పెట్టిన శ్రద్ధ కథా కథనాల మీద చూపకపోవడంతో తుఫాన్ చాలా నిస్సారంగా సాగుతుంది. టెక్నికల్ గా కొన్ని ఎపిసోడ్స్ బాగానే తీసినప్పటికీ ఆసక్తి కలిగించేలా స్క్రీన్ ప్లే లేకపోవడంతో పరమ రొటీన్ గా భారంగా సాగుతుంది. ధనుంజయ్, సత్యరాజ్, శరత్ కుమార్ లు ఓ మోస్తరుగా నిలబెట్టారు కానీ సింగల్ ఎక్స్ ప్రెషన్ తో విజయ్ ఆంటోనీ చేసిందేమీ లేదు. మురళి శర్మ లాంటి తెలుగు ఆర్టిస్టులు వృథా అయ్యారు. బిచ్చగాడు బ్రాండ్ ని నమ్ముకుని తుఫాన్ వెళ్తే మాత్రంవిసిగించే వర్షంలో తడవడం ఖాయం.
This post was last modified on August 10, 2024 4:57 pm
దేశంలో కొత్త రాజకీయ వాతావరణం కనిపిస్తుంది. మూస పార్టీలకు భిన్నంగా సరికొత్త ఆన్ లైన్ పార్టీలు పుట్టుకొని వస్తున్నాయి. నిముషాల…
ఇటీవలే విడుదలైన విశాల్ మకుటం దారుణంగా ఫ్లాప్ అయ్యింది. డిజాస్టర్ అనే మాట చిన్నదే అనిపిస్తుంది కలెక్షన్లు చూస్తే. మొదటి…
క్రిస్టోఫర్ నోలన్తో ఎప్పటికైనా పని చేయాలని ఉందని కుర్ర మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ అనగానే సోషల్ మీడియాలో రకరకాల…
అమెరికా ఎన్నికల వ్యవస్థలో ఓటరు గుర్తింపు నిబంధనలను కఠినతరం చేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా…
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న టైంలో ఆ పార్టీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ ఎంతగా రెచ్చిపోయారో…
'అయ్యగారే నెంబర్ వన్' డైలాగ్ తో సోషల్ మీడియాను షేక్ చేసిన అఖిల్ వీరాభిమాని నాగరాజు మళ్లీ వైరల్ అవుతున్నాడు.…