రాబోయే సంక్రాంతికి ఖరారుగా వచ్చే సినిమాల్లో అధికారికంగా ప్రకటించుకున్నవి చిరంజీవి విశ్వంభర, అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ, వెంకటేష్ అనిల్ రావిపూడిల కాంబో మూవీ. ఇవి కాకుండా రవితేజ హీరోగా భాను భోగవరపుని దర్శకుడిగా పరిచయం చేస్తున్న సితార సంస్థ తీస్తున్న ఎంటర్ టైనర్ సైతం పండగ బరిలో దించబోతున్నారు. అయితే ఇక్కడో చిక్కు వచ్చి పడింది. సితార సంస్థలోనే బాలకృష్ణతో బాబీ రూపొందిస్తున్న ఎన్బికె 109 డిసెంబర్ ని ఎంచుకునే అవకాశం క్రమంగా తగ్గిపోవడంతో ఎప్పటిలాగే బాలయ్య సెంటిమెంట్ ని ఫాలో అవుతూ జనవరి పండగకే రిలీజ్ చేయాలని ప్రాధమికంగా నిర్ణయించుకున్నట్టు తెలిసింది.
ఒకే సంస్థ నుంచి ఒకే సమయంలో రెండు పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ చేయడమనే సంప్రదాయం గతంలో ఉండేది కాదు. కానీ నిన్నటి ఏడాది మైత్రి మూవీ మేకర్స్ దాన్ని వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డితో విజయవంతంగా బ్రేక్ చేసి చూపించారు. సాధ్యమేనని ఋజువు చేశారు. ఒకవేళ రవితేజ, బాలయ్య ఇద్దరూ సంక్రాంతే కావాలని పట్టుబడితే అప్పుడు మైత్రి స్ట్రాటజీనే ఫాలో కావాలని నిర్మాత నాగవంశీ అనుకున్నట్టు అంతర్గత సమాచారం. అదే జరిగితే పోటీ మరింత రసవత్తరంగా మారుతుంది. అన్ని అగ్ర బ్యానర్లు నువ్వా నేనాని థియేటర్ల కోసం యుద్ధాలే చేయాల్సి వస్తుంది.
డిసెంబర్ లో వచ్చే పుష్ప 2 ది రూల్, గేమ్ ఛేంజర్ ఆ సమయానికంతా థియేటర్ రన్ పూర్తి చేసుకుని ఉంటాయి. ఒకవేళ బ్లాక్ బస్టర్ టాక్ తో మంచి స్వింగ్ లో ఉన్నా సరే ఖాళీ చేయక తప్పని పరిస్థితి నెలకొంటుంది. పెద్ద హీరోల రిలీజుల విషయంలో నిర్మాతలు ఆరేడు నెలల ముందే అడ్వాన్స్ ప్లానింగ్ లో ఉండటం తప్పడం లేదు. లేదంటే ఆ టైంకి లేనిపోని తలనెప్పులు వచ్చి వ్యవహారం మీడియా గడప దాటి పోతోంది. విజయ్ వారసుడు టైంలో దిల్ రాజు దీన్ని ఎదురుకున్నారు. ఈసారి పరిణామాలు మరింత వేడెక్కేలా కనిపిస్తున్నాయి. ఎవరు నిలుస్తారో ఎవరు తప్పుకుంటారో చూడాలి.
పెద్ది విజయోత్సవ వేడుకలో చిరంజీవి నేషనల్ అవార్డు గురించి ప్రస్తావిస్తూ రామ్ చరణ్ కది రావడం రాకపోవడం అసలు సమస్యే…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ నిర్మిస్తున్న 'ధర్మన్' ఇవాళ ఘనంగా ప్రారంభమయ్యింది. దర్శకులు మారుతూ వచ్చిన ఈ…
ఇంకో పది రోజుల్లో రావు బహదూర్ విడుదల కానుంది. సత్యదేవ్ ఎప్పుడూ లేనంత వైవిధ్యంగా వివిధ గెటప్స్ లో ఇందులో…
నిన్న పెద్ది సక్సెస్ మీట్ ఘనంగా జరిగింది. ప్రత్యేక ఆకర్షణగా చిరంజీవి నిలిచారు. గతంలో తండ్రి కొడుకుల స్టేజి కలయిక…
ప్రభుత్వాలు చేపట్టే కీలక కార్యక్రమాలకు పేర్లు సూచించే వారికి బహుమానాలు ఇస్తుంటాయి. అలానే కానుకలు కూడా ఇస్తాయి. గతంలో స్వచ్ఛ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఐదేళ్లు పాలించిన జగన్.. నానుస్తూ వచ్చి.. చివరకు తనకు సాధ్యంకాదని…