రాబోయే సంక్రాంతికి ఖరారుగా వచ్చే సినిమాల్లో అధికారికంగా ప్రకటించుకున్నవి చిరంజీవి విశ్వంభర, అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ, వెంకటేష్ అనిల్ రావిపూడిల కాంబో మూవీ. ఇవి కాకుండా రవితేజ హీరోగా భాను భోగవరపుని దర్శకుడిగా పరిచయం చేస్తున్న సితార సంస్థ తీస్తున్న ఎంటర్ టైనర్ సైతం పండగ బరిలో దించబోతున్నారు. అయితే ఇక్కడో చిక్కు వచ్చి పడింది. సితార సంస్థలోనే బాలకృష్ణతో బాబీ రూపొందిస్తున్న ఎన్బికె 109 డిసెంబర్ ని ఎంచుకునే అవకాశం క్రమంగా తగ్గిపోవడంతో ఎప్పటిలాగే బాలయ్య సెంటిమెంట్ ని ఫాలో అవుతూ జనవరి పండగకే రిలీజ్ చేయాలని ప్రాధమికంగా నిర్ణయించుకున్నట్టు తెలిసింది.
ఒకే సంస్థ నుంచి ఒకే సమయంలో రెండు పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ చేయడమనే సంప్రదాయం గతంలో ఉండేది కాదు. కానీ నిన్నటి ఏడాది మైత్రి మూవీ మేకర్స్ దాన్ని వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డితో విజయవంతంగా బ్రేక్ చేసి చూపించారు. సాధ్యమేనని ఋజువు చేశారు. ఒకవేళ రవితేజ, బాలయ్య ఇద్దరూ సంక్రాంతే కావాలని పట్టుబడితే అప్పుడు మైత్రి స్ట్రాటజీనే ఫాలో కావాలని నిర్మాత నాగవంశీ అనుకున్నట్టు అంతర్గత సమాచారం. అదే జరిగితే పోటీ మరింత రసవత్తరంగా మారుతుంది. అన్ని అగ్ర బ్యానర్లు నువ్వా నేనాని థియేటర్ల కోసం యుద్ధాలే చేయాల్సి వస్తుంది.
డిసెంబర్ లో వచ్చే పుష్ప 2 ది రూల్, గేమ్ ఛేంజర్ ఆ సమయానికంతా థియేటర్ రన్ పూర్తి చేసుకుని ఉంటాయి. ఒకవేళ బ్లాక్ బస్టర్ టాక్ తో మంచి స్వింగ్ లో ఉన్నా సరే ఖాళీ చేయక తప్పని పరిస్థితి నెలకొంటుంది. పెద్ద హీరోల రిలీజుల విషయంలో నిర్మాతలు ఆరేడు నెలల ముందే అడ్వాన్స్ ప్లానింగ్ లో ఉండటం తప్పడం లేదు. లేదంటే ఆ టైంకి లేనిపోని తలనెప్పులు వచ్చి వ్యవహారం మీడియా గడప దాటి పోతోంది. విజయ్ వారసుడు టైంలో దిల్ రాజు దీన్ని ఎదురుకున్నారు. ఈసారి పరిణామాలు మరింత వేడెక్కేలా కనిపిస్తున్నాయి. ఎవరు నిలుస్తారో ఎవరు తప్పుకుంటారో చూడాలి.
This post was last modified on August 8, 2024 12:32 pm
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి అసలేం బాగోలేదు. హౌస్ ఫుల్ బోర్డులకు బూజు పడుతోంది. టికెట్లన్నీ అమ్ముడుపోయాయని గర్వంగా చెప్పుకునే…
https://youtu.be/COhEUjI-GEk?si=vlcLiVU0tytCMihG ఎంఆర్పీ సినిమా టీజర్ విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రముఖ నిర్మాత సాహు గారపాటి చేతుల మీదుగా…
జూన్ నెలకు వాయిదా వేసుకున్న పెద్ది చివరి ఘట్టంకు వచ్చేసింది. ఐటెం సాంగ్ తీస్తే గుమ్మడికాయ కొట్టొచ్చు. దర్శకుడు బుచ్చిబాబు…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు(90) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో సతమతం అవుతున్న నాదెండ్ల…
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఇక జైలు ఊచలు లెక్కపెట్టక తప్పేలా లేదు. ఎందుకంటే...తన వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం అనే…
ప్రస్తుతం మంచి ఊపులో షూటింగ్ జరుపుకుంటున్న బాలకృష్ణ - గోపీచంద్ మలినేని మూవీలో ముందు తీసుకున్న హీరోయిన్ నయనతార. ఇది…