Movie News

మైత్రి తరహాలో సితార సంక్రాంతి ప్లానింగ్

రాబోయే సంక్రాంతికి ఖరారుగా వచ్చే సినిమాల్లో అధికారికంగా ప్రకటించుకున్నవి చిరంజీవి విశ్వంభర, అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ, వెంకటేష్ అనిల్ రావిపూడిల కాంబో మూవీ. ఇవి కాకుండా రవితేజ హీరోగా భాను భోగవరపుని దర్శకుడిగా పరిచయం చేస్తున్న సితార సంస్థ తీస్తున్న ఎంటర్ టైనర్ సైతం పండగ బరిలో దించబోతున్నారు. అయితే ఇక్కడో చిక్కు వచ్చి పడింది. సితార సంస్థలోనే బాలకృష్ణతో బాబీ రూపొందిస్తున్న ఎన్బికె 109 డిసెంబర్ ని ఎంచుకునే అవకాశం క్రమంగా తగ్గిపోవడంతో ఎప్పటిలాగే బాలయ్య సెంటిమెంట్ ని ఫాలో అవుతూ జనవరి పండగకే రిలీజ్ చేయాలని ప్రాధమికంగా నిర్ణయించుకున్నట్టు తెలిసింది.

ఒకే సంస్థ నుంచి ఒకే సమయంలో రెండు పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ చేయడమనే సంప్రదాయం గతంలో ఉండేది కాదు. కానీ నిన్నటి ఏడాది మైత్రి మూవీ మేకర్స్ దాన్ని వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డితో విజయవంతంగా బ్రేక్ చేసి చూపించారు. సాధ్యమేనని ఋజువు చేశారు. ఒకవేళ రవితేజ, బాలయ్య ఇద్దరూ సంక్రాంతే కావాలని పట్టుబడితే అప్పుడు మైత్రి స్ట్రాటజీనే ఫాలో కావాలని నిర్మాత నాగవంశీ అనుకున్నట్టు అంతర్గత సమాచారం. అదే జరిగితే పోటీ మరింత రసవత్తరంగా మారుతుంది. అన్ని అగ్ర బ్యానర్లు నువ్వా నేనాని థియేటర్ల కోసం యుద్ధాలే చేయాల్సి వస్తుంది.

డిసెంబర్ లో వచ్చే పుష్ప 2 ది రూల్, గేమ్ ఛేంజర్ ఆ సమయానికంతా థియేటర్ రన్ పూర్తి చేసుకుని ఉంటాయి. ఒకవేళ బ్లాక్ బస్టర్ టాక్ తో మంచి స్వింగ్ లో ఉన్నా సరే ఖాళీ చేయక తప్పని పరిస్థితి నెలకొంటుంది. పెద్ద హీరోల రిలీజుల విషయంలో నిర్మాతలు ఆరేడు నెలల ముందే అడ్వాన్స్ ప్లానింగ్ లో ఉండటం తప్పడం లేదు. లేదంటే ఆ టైంకి లేనిపోని తలనెప్పులు వచ్చి వ్యవహారం మీడియా గడప దాటి పోతోంది. విజయ్ వారసుడు టైంలో దిల్ రాజు దీన్ని ఎదురుకున్నారు. ఈసారి పరిణామాలు మరింత వేడెక్కేలా కనిపిస్తున్నాయి. ఎవరు నిలుస్తారో ఎవరు తప్పుకుంటారో చూడాలి.

Satya

Recent Posts

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

53 minutes ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

59 minutes ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

1 hour ago

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

3 hours ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

4 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

4 hours ago