రాబోయే సంక్రాంతికి ఖరారుగా వచ్చే సినిమాల్లో అధికారికంగా ప్రకటించుకున్నవి చిరంజీవి విశ్వంభర, అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ, వెంకటేష్ అనిల్ రావిపూడిల కాంబో మూవీ. ఇవి కాకుండా రవితేజ హీరోగా భాను భోగవరపుని దర్శకుడిగా పరిచయం చేస్తున్న సితార సంస్థ తీస్తున్న ఎంటర్ టైనర్ సైతం పండగ బరిలో దించబోతున్నారు. అయితే ఇక్కడో చిక్కు వచ్చి పడింది. సితార సంస్థలోనే బాలకృష్ణతో బాబీ రూపొందిస్తున్న ఎన్బికె 109 డిసెంబర్ ని ఎంచుకునే అవకాశం క్రమంగా తగ్గిపోవడంతో ఎప్పటిలాగే బాలయ్య సెంటిమెంట్ ని ఫాలో అవుతూ జనవరి పండగకే రిలీజ్ చేయాలని ప్రాధమికంగా నిర్ణయించుకున్నట్టు తెలిసింది.
ఒకే సంస్థ నుంచి ఒకే సమయంలో రెండు పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ చేయడమనే సంప్రదాయం గతంలో ఉండేది కాదు. కానీ నిన్నటి ఏడాది మైత్రి మూవీ మేకర్స్ దాన్ని వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డితో విజయవంతంగా బ్రేక్ చేసి చూపించారు. సాధ్యమేనని ఋజువు చేశారు. ఒకవేళ రవితేజ, బాలయ్య ఇద్దరూ సంక్రాంతే కావాలని పట్టుబడితే అప్పుడు మైత్రి స్ట్రాటజీనే ఫాలో కావాలని నిర్మాత నాగవంశీ అనుకున్నట్టు అంతర్గత సమాచారం. అదే జరిగితే పోటీ మరింత రసవత్తరంగా మారుతుంది. అన్ని అగ్ర బ్యానర్లు నువ్వా నేనాని థియేటర్ల కోసం యుద్ధాలే చేయాల్సి వస్తుంది.
డిసెంబర్ లో వచ్చే పుష్ప 2 ది రూల్, గేమ్ ఛేంజర్ ఆ సమయానికంతా థియేటర్ రన్ పూర్తి చేసుకుని ఉంటాయి. ఒకవేళ బ్లాక్ బస్టర్ టాక్ తో మంచి స్వింగ్ లో ఉన్నా సరే ఖాళీ చేయక తప్పని పరిస్థితి నెలకొంటుంది. పెద్ద హీరోల రిలీజుల విషయంలో నిర్మాతలు ఆరేడు నెలల ముందే అడ్వాన్స్ ప్లానింగ్ లో ఉండటం తప్పడం లేదు. లేదంటే ఆ టైంకి లేనిపోని తలనెప్పులు వచ్చి వ్యవహారం మీడియా గడప దాటి పోతోంది. విజయ్ వారసుడు టైంలో దిల్ రాజు దీన్ని ఎదురుకున్నారు. ఈసారి పరిణామాలు మరింత వేడెక్కేలా కనిపిస్తున్నాయి. ఎవరు నిలుస్తారో ఎవరు తప్పుకుంటారో చూడాలి.
This post was last modified on August 8, 2024 12:32 pm
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…