Movie News

దొమ్మీ గొడవల్లో హీరోని చంపేశారు

మన దేశంలో జరిగింది కాకపోయినా వింటేనే ఒళ్ళు జలదరించే నిజ జీవిత సంఘటన ఇది. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తీసుకొచ్చిన రిజర్వేషన్ల విధానానికి వ్యతిరేకంగా చెలరేగిన హింస ఎన్ని వందల ప్రాణాలను బలి తీసుకుందో చూస్తున్నాం.

సాక్ష్యాత్తు ప్రైమ్ మినిస్టర్ ఇంటిని లూటీ చేసిన అరుదైన దృశ్యాలు పలు టీవీ ఛానల్స్ లో కనిపిస్తూనే ఉన్నాయి. ఈ సంఘటనల్లో ఒక హీరోతో పాటు నిర్మాతైన అతని తండ్రి దారుణ హత్యకు గురి కావడం అక్కడి ఇండస్ట్రీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. తెరమీద మాత్రమే చూసే వయొలెన్స్ రియల్ లైఫ్ లో ఎవరు మాత్రం ఊహించగలరు.

సలీం ఖాన్ అనే వ్యక్తికి నిర్మాతగా బంగ్లాదేశ్ లో మంచి పేరుంది. పలు హిట్ సినిమాలు ఆయన బ్యానర్ నుంచి వచ్చాయి. ఇటీవలే కొడుకు శాంటో ఖాన్ ని హీరోగా పరిచయం చేశాడు. తాజాగా రేగిన అల్లర్లలో ప్రాణ రక్షణ కోసం వాళ్ళ కుటుంబం నివసించే చాంద్ పూర్ అనే ప్రాంతం నుంచి పారిపోతూ మధ్యలో ఫరక్కాబాద్ మార్కెట్ దగ్గర దుండగులకు దొరిపోయారు. అయితే చేతిలో ఉన్న తుపాకీతో గుళ్ళు పేల్చి అక్కడి నుంచి తప్పించుకున్నారు కానీ బగారా అనే ఏరియాకు వచ్చేసరికి బుల్లెట్లు అయిపోయాయి. అప్పటికే అక్కడ గుమికూడిన జనం ఇద్దరినీ అక్కడిక్కడే కొట్టి చంపేశారు.

వీళ్ళ మీద ఇంత ఆగ్రహానికి కారణం లేకపోలేదు. సలీం ఖాన్ ఇటీవలే తుంగి పరార్ మియా భాయ్ అనే సినిమా తీశాడు. షేక్ హసీనా తండ్రి షేక్ ముజబీర్ రెహమాన్ జీవితం ఆధారంగా ఇది రూపొందింది. కొడుకు శాంటో దీని ద్వారానే లాంచ్ అయ్యాడు.

ఇది నిర్మించినందుకే ముష్కర మూకలకు సలీం ఖాన్ టార్గెట్ అయ్యాడు. కన్నబిడ్డతో పాటు తనను తానే కోల్పోయాడు. ప్రస్తుతం ఈయన ప్రొడక్షన్ లో పదికి పైగా సినిమాలు వివిధ దశల్లో ఉన్నాయి. అవన్నీ ఆగిపోయే పరిస్థితి తలెత్తింది. చూస్తుంటే దీని మీద భవిష్యత్తులో ఏదైనా బాలీవుడ్ మూవీ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

This post was last modified on August 8, 2024 11:05 am

Share
Show comments
Published by
Satya
Tags: bangladesh

Recent Posts

రెమ్యూనరేషన్: హీరోలకే మద్దతు తెలిపిన ప్రొడ్యూసర్

ఈ మధ్య స్టార్ హీరోల పారితోషకాలు బాగా పెంచేయడం.. అందుకు తగ్గట్లే సినిమాల బడ్జెట్లు పెరిగిపోవడం.. తీరా చూస్తే బిజినెస్, కలెక్షన్లు అనుకున్నంత…

35 minutes ago

పవన్‌తో వారం షూటింగ్ చేసి బయటికి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా అంటే ఏ హీరోయిన్ అయినా ఎంతో ఎగ్జైట్ అవుతుంది. స్టార్ హీరోయిన్లు అయినా…

3 hours ago

జనవరి వచ్చిందంటూ గుర్తుచేస్తున్న షర్మిల

ఏటా జనవరి వస్తోంది.. పోతుంది... సంవత్సరాలు మారుతూ క్యాలెండర్ మారుతున్నాయి అంటూ ఏపీసీసీ చీఫ్ షర్మిల గుర్తు చేస్తున్నారు. ఇది…

5 hours ago

ముగిసిన `మండ‌లి`- క‌విత స్పీచే రికార్డ్‌!

తెలంగాణ శాస‌న మండ‌లి శీతాకాల‌ స‌మావేశాలు ముగిశాయి. ఈ సీజ‌న్‌లో మొత్తం 5 రోజుల పాటు మాత్ర‌మే ఈ స‌మావేశాలు…

7 hours ago

గిల్ ను చూసి అభిషేక్ ఏం నేర్చుకోవాలి?

టీమ్ ఇండియా యువ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ ఆట తీరు గురించి సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్…

8 hours ago

హద్దు దాటిన రోజా: ‘పోలీసులు నీళ్లు లేని బావిలో దూకి చావాలి’

నిన్న మొన్నటి వరకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అధికారులను, పోలీసులను కూడా బెదిరించిన విషయం తెలిసిందే. తాట…

8 hours ago