వరదలు వచ్చింది కేరళలో. అక్కడ తెలుగు సినిమాలు ఆడిన దాఖలాలు తక్కువ. ఆర్ఆర్ఆర్, కల్కి లాంటివి తప్ప అద్భుతాలు చేసినవి వేళ్ళ మీద లెక్కబెట్టొచ్చు. అల్లు అర్జున్ కు తప్ప మిగిలిన స్టార్లు ఎవరూ తమకంటూ ప్రత్యేక మార్కెట్ సంపాదించుకోలేకపోయారు. అయినా సరే అక్కడ వరదల భీభత్సం చూసి టాలీవుడ్, కోలీవుడ్ నటీనటుల హృదయాలు తల్లడిల్లిపోయాయి. పొరుగు రాష్ట్రంలో వందలాది మంది మృతి చెంది వేలాది జనాభా ఆశ్రయం కోసం అల్లాడిపోతున్న వైనం చూసి కరిగిపోయారు. అందుకే మార్కెట్, ఇమేజ్ లెక్కలు వేసుకోకుండా తమవంతుగా చేయూతనిస్తున్నారు.
డార్లింగ్ ప్రభాస్ 2 కోట్లు, మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ సంయుక్తంగా కోటి, అల్లు అర్జున్ 25 లక్షలు, సూర్య కుటుంబం 50 లక్షలు, నయనతార జంట 20 లక్షలు, తండ్రీకొడుకులు మమ్ముట్టి దుల్కర్ సల్మాన్ 35 లక్షలు, ఫహద్ ఫాసిల్ – కమల్ హాసన్ విడివిడిగా చెరో పాతిక లక్షలు, విక్రమ్ 20 లక్షలు, రష్మిక మందన్న 10 లక్షలు ఇలా ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు భూరి విరాళాలు అందిస్తున్నారు. మల్లువుడ్ హీరోలు సైతం ఇంత కాంట్రిబ్యూట్ చేయకపోవడం గమనించాల్సిన విషయం. ఏవైనా పరిమితులు ఉండొచ్చేమో కానీ మొత్తానికి తెలుగు తమిళ హీరోలు స్పందించిన విధానం అనూహ్యం.
విపత్తు ఎక్కడ వచ్చినా ఖచ్చితంగా చందాలు ఇవ్వాలన్న నిబంధన లేకపోయినా హీరోలు స్వచ్చందంగా ఇలా ముందుకు రావడం హర్షించదగ్గ విషయం. వయనాడ్ విలయం చూస్తే ఎవరికైనా కళ్ళు చెమరుస్తాయి. కొందరు యాంటీ ఫ్యాన్స్ దీని మీద కూడా అక్కసు వెళ్లగక్కుతున్న వాళ్ళు లేకపోలేదు. వరదల వల్ల కేరళలో సినిమాలు సైతం సరిగా విడుదల కావడం లేదు. కొత్త రిలీజులు చూసే స్థితిలో ప్రేక్షకులు లేకపోవడంతో ట్రేడ్ తీవ్ర నిరాశలో ఉంది. పరిస్థితి చక్కబడేందుకు ఇంకో రెండు మూడు వారాలు పట్టేలా ఉండటంతో అప్పటిదాకా కేరళ బాక్సాఫీస్ చప్పగా ఉండబోతోంది.
This post was last modified on August 8, 2024 11:06 am
నాని ది ప్యారడైజ్ షూటింగ్ చివరి ఘట్టానికి వచ్చేసింది. ఇంకో వారం పది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు. కీర్తి…
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిణామాలను గమనిస్తే.. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇమేజ్కు యువత పెద్ద ఎత్తున…
సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ డెబ్యూ ఫలితం తేలిపోయింది. కుర్రాడి నటనకు కాసిన్ని ప్రశంసలు దక్కినప్పటికీ కంటెంట్ పరంగా…
త్వరలోనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు తెరదీయనున్నారు. సెప్టెంబరు-అక్టోబరు మధ్య మునిసిపాలిటీ… నవంబరు-డిసెంబరు మధ్య కార్పోరేషన్లు, జనవరిలో పంచాయతీ ఎన్నికలు…
శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ నుంచి బుమ్రా గాయం కారణంగా తప్పుకున్నాడు. అయితే అతని స్థానంలో సీనియర్ బౌలర్…
ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను ఫేస్బుక్ నుంచి తొలగించిన వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సోషల్ మీడియా దిగ్గజం మెటా…