మెహర్ రమేష్… యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ‘బిల్లా’ లాంటి స్టయిలిష్ బ్లాక్ బస్టర్ మూవీని తెరకెక్కించారు. సినిమాల ఫలితాల సంగతెలా ఉన్నా స్టైలిష్ మేకర్గా గుర్తింపు సంపాదించుకున్నారు. మెగాఫోన్కు కొంతకాలం దూరమైన రమేష్ త్వరలో ఓ మెగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వేదాళం
రీమేక్ చేయబోతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్కు, తెలుగు నేటివిటీకి తగినట్టుగా ఆ కథను మెహర్ రమేష్ మార్చారు. ఇందుకోసం మూడేళ్ల పాటు ఆయన కష్టపడ్డారు. ఆయన పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది. మెహర్ రమేష్ చేసిన మార్పులు నచ్చడంతో చిరంజీవి ఆ సినిమా చేయడానికి అంగీకరించారు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతోంది. ఈ సినిమా గురించి పవన్ కల్యాణ్ ఇటీవల ట్విటర్ ద్వారా స్పందించారు. తాజాగా చిరంజీవి కూడా ఓ ఆంగ్ల దినపత్రికతో మాట్లాడుతూ మెహర్ రమేష్ తో సినిమా చేయబోతున్నట్టు కన్ఫామ్ చేశారు. ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ కావాలని మెహర్ రమేష్ చాలా పట్టుదలగా ఉన్నారు. త్వరలోనే ఆయన కోరిక నెరవేరనుంది.
This post was last modified on September 25, 2020 11:11 pm
ఈ వారం కొత్త రిలీజులకే జనం వస్తారో రారోననే అనుమానాలు నెలకొంటే మే 10 ఆర్ఆర్ఆర్ రీ రిలీజ్ చేయబోతున్నారు.…
పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. విజయం కోసం.. మెగా కుటుంబం రోడ్డెక్కిన విషయం…
ఎన్నికలు ఇంకో వారం రోజుల్లో జరగనుండగా ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఏపీ అధికారి పార్టీని…
కెరీర్ మొదలుపెట్టి సంవత్సరాలు గడుతున్నా ఒక పెద్ద బ్రేక్ దక్కించుకుని టాప్ లీగ్ లోకి వెళ్లిపోవాలనే ప్లాన్ లో ఉన్న…
ఇంకో మూడు రోజుల్లో విడుదల కావాల్సిన ప్రతినిధి 2కి కష్టాల పరంపర కొనసాగతూనే ఉన్నట్టు ఫిలిం నగర్ టాక్. నారా…
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో వారమే సమయం ఉంది. ఈ ఎన్నికలు ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్కు, అటు ప్రతిపక్ష…