మెహర్ రమేష్… యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ‘బిల్లా’ లాంటి స్టయిలిష్ బ్లాక్ బస్టర్ మూవీని తెరకెక్కించారు. సినిమాల ఫలితాల సంగతెలా ఉన్నా స్టైలిష్ మేకర్గా గుర్తింపు సంపాదించుకున్నారు. మెగాఫోన్కు కొంతకాలం దూరమైన రమేష్ త్వరలో ఓ మెగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వేదాళం రీమేక్ చేయబోతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్కు, తెలుగు నేటివిటీకి తగినట్టుగా ఆ కథను మెహర్ రమేష్ మార్చారు. ఇందుకోసం మూడేళ్ల పాటు ఆయన కష్టపడ్డారు. ఆయన పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది. మెహర్ రమేష్ చేసిన మార్పులు నచ్చడంతో చిరంజీవి ఆ సినిమా చేయడానికి అంగీకరించారు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతోంది. ఈ సినిమా గురించి పవన్ కల్యాణ్ ఇటీవల ట్విటర్ ద్వారా స్పందించారు. తాజాగా చిరంజీవి కూడా ఓ ఆంగ్ల దినపత్రికతో మాట్లాడుతూ మెహర్ రమేష్ తో సినిమా చేయబోతున్నట్టు కన్ఫామ్ చేశారు. ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ కావాలని మెహర్ రమేష్ చాలా పట్టుదలగా ఉన్నారు. త్వరలోనే ఆయన కోరిక నెరవేరనుంది.
This post was last modified on September 25, 2020 11:11 pm
సినిమా ఇండస్ట్రీలో కొన్ని క్రేజీ కాంబినేషన్లు సెట్స్ పైకి వెళ్లకముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి. ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్,…
నందమూరి బాలకృష్ణ స్పీడ్ ను అందుకోవడం ఇప్పుడున్న కుర్ర హీరోలకు కూడా కష్టమే అనిపిస్తోంది. అఖండ 2 ఫ్లాప్ అయినా…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. వాస్తవానికి గతంలో కొన్ని కొన్ని చెదురుమొదురు ఘటనలు జరిగేవి. తాజాగా…
80, 90 దశకాల్లో వైభవం చూసిన కథానాయకుల్లో రాజశేఖర్ ఒకరు. స్వతహాగా తమిళుడైనప్పటికీ.. తెలుగులోనే ఆయన పెద్ద హీరోగాఎదిగారు. అంకుశం,…
గ్లోబల్ పాప్ సెన్సేషన్ రిహానా పేరు వింటేనే ఒక రేంజ్ వైబ్ గుర్తొస్తుంది. అలాంటిది ఈ ఇంటర్నేషనల్ స్టార్ సడన్గా…
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె వెనుక ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశం, వాటి నిర్వహణ విధానం.. తద్వారా ఉద్యోగాలకు పొంచి…