టాలీవుడ్ యువ కథానాయకుడు రాజ్ తరుణ్ తనను ప్రేమించి, పెళ్లి కూడా చేసుకుని.. ఆ తర్వాత మోసం చేశాడంటూ వార్తల్లోకి వచ్చిన లావణ్య చౌదరి గురించి గత నెల రోజులుగా మీడియాలో ఎంత చర్చ జరిగిందో తెలిసిందే. ముందు అందరూ ఈ వ్యవహారంలో రాజ్ను ఒక మోసగాడిలాగే చూశారు. బాధితురాలిగా కనిపించిన లావణ్యకే ఎక్కువ మద్దతు లభించింది. ఆమె తరఫున కేసు టేకప్ చేసిన కళ్యాణ్ దిలీప్ సుంకర కూడా మొదట్లో రాజ్కు వ్యతిరేకంగా బలమైన పాయింట్లు చెబుతూ మీడియా దృష్టిని ఆకర్షించాడు. కానీ గత కొన్ని రోజుల్లో వ్యవహారం పూర్తిగా మారిపోయింది. లావణ్య, కళ్యాణ్ దిలీప్ తీరుతో జనాల అభిప్రాయమే మారిపోయే పరిస్థితి వచ్చింది. రాజ్కు మద్దతుగా మాట్లాడుతున్న ఆర్జే శేఖర్ బాషాను టీవీ ఛానెల్ లైవ్లో లావణ్య చెప్పుతో కొడితే.. మరో సందర్భంలో అతడిని దారుణమైన బూతులు తిట్టి కళ్యాణ్ దిలీప్ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. ఇదే సమయంలో లావణ్యకు సంబంధించిన ఒక ఆడియో క్లిప్ వైరల్ అయింది. అందులో ఆమె భాష, వాడిన బూతులు చూస్తే జనం వామ్మో అని తలలు పట్టుకున్నారు.
ఇలా రోజు రోజుకూ లావణ్య పట్ల అనుమానాలు, వ్యతిరేకత పెరిగిపోతున్న సమయంలో ఇంకో ఇంటర్వ్యూలో లావణ్య మాటలు చూస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేం. లావణ్య డ్రగ్స్ కేసులో కొన్ని రోజుల పాటు జైల్లో గడిపినట్లు వెల్లడైన సంగతి తెలిసిందే. తనకు ఏ పాపం తెలియదని.. ఈ కేసులో తనను రాజ్ తరుణే ఇరికించినట్లు ఆమె గతంలో ఆరోపించింది. కాగా ఈ కేసు విషయమై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘నార్సింగ్ పోలీస్ స్టేషన్కు నన్ను తీసుకెళ్లారు. ఒకటిన్నర రోజు నన్ను అక్కడే ఉంచారు. ఆ తర్వాత ఈ కేసులో నన్ను ఏ2గా రాసి జైలుకు పంపించారు. మరి రాజ్ తరుణ్ తలుచుకుంటే ఇది నిజంగా అయ్యే కేసే కాదండి. నా దగ్గర 4 గ్రాములు దొరికినా.. అలా దొరికిన వాళ్లు ఎంతమంది డబ్బులిచ్చి వదిలించుకోరండి. నాకు సమస్య వచ్చినా సాయం చేసే పరిస్థితిలో ఉన్న మనిషే. కానీ ఏం చేయలేదు’’ అని లావణ్య చెప్పింది. తన మాటల్ని బట్టి చూస్తే.. తన దగ్గర డ్రగ్స్ దొరికిన మాట వాస్తవమే కానీ.. ఆ కేసులోంచి తనను తప్పించకపోవడం రాజ్ తప్పు అన్నట్లుగా ఉంది. సంబంధిత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఇదేం వాదన అంటూ లావణ్యను అందరూ తప్పుబడుతున్నారు.
This post was last modified on August 7, 2024 7:13 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…