మాస్ రాజా రవితేజ పక్కన నటించే హీరోయిన్ల విషయంలో ఈ మధ్య చాలా చర్చ జరుగతోంది. రవితేజ వయసులో సగం వయసు కూడా లేని అమ్మాయిలను తన పక్కన కథానాయికలుగా పెడుతున్నారని.. జోడీ ఏమాత్రం బాగుండట్లేదని సోషల్ మీడియాలో విమర్శలు తప్పట్లేదు. ‘ధమాకా’ సినిమాకు రవితేజ పక్కన శ్రీలీలను పెట్టినపుడు చాలా ట్రోలింగ్ నడిచింది. ఇప్పుడు ఆయన సరసన భాగ్యశ్రీ బోర్సే అనే మరో కొత్తమ్మాయిని పెట్టడం మీదా నెటిజన్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ‘మిస్టర్ బచ్చన్’ సినిమాకు సంబంధించిన రొమాంటిక్ పోస్టర్లు, వీడియో ప్రోమోలు రిలీజైనపుడల్లా దీని మీద సోషల్ మీడియాలో రచ్చ జరిగింది. వేరే భాషలకు సంబంధించిన ట్విట్టర్ హ్యాండిల్స్ కూడా దీని గురించి కామెంట్లు చేశాయి. దీని గురించి ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు హరీష్ స్పందించాడు.
‘‘మీ ఇంట్లో అమ్మాయికి పెళ్లి చేస్తున్నపుడు వయసు మాత్రమే కాక అన్నీ చూసుకుంటారు. అందులో తప్పు లేదు. కానీ ఒక సినిమాలో ఒక హీరో పక్కన నటించే హీరోయిన్ విషయంలో మీకెందుకు ఈ అభ్యంతరాలు? చేస్తున్న అమ్మాయికి అభ్యంతరం లేదు. ఇష్టపూర్వకంగానే సినిమాకు సంతకం చేసింది. సినిమాలో నటించింది. మరి మీ బాధ ఏంటి? సినిమా అంటేనే కల్పితం. అందులో నటీనటులు చేసేది యాక్టింగ్. అలాంటపుడు అభ్యంతరాలు ఏంటి? సినిమాలో హీరో పాత్రకు ఒక వయసు, స్వభావం ఉంటాయి. అవి చూడాలి కానీ.. హీరో వయసంత, హీరోయిన్ వయసింత అనడం ఏంటి? ‘ధమాకా’ సినిమా విషయంలోనూ ఇలాగే అన్నారు. ఆ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. ఒకప్పుడు ఎన్టీఆర్, శ్రీదేవి జోడీ గురించి కూడా ఎన్నో మాటలు అన్నారు. కానీ వాళ్ల సినిమాలు సెన్సేషనల్ హిట్టయ్యాయి. సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్లే ఇవన్నీ పట్టించుకుంటారు. మామూలు జనానికి ఇవేమీ పట్టవు. సినిమా బాగుందా లేదా అనేదే చూస్తారు’’ అని హరీష్ తేల్చేశాడు.
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…