మాస్ రాజా రవితేజ పక్కన నటించే హీరోయిన్ల విషయంలో ఈ మధ్య చాలా చర్చ జరుగతోంది. రవితేజ వయసులో సగం వయసు కూడా లేని అమ్మాయిలను తన పక్కన కథానాయికలుగా పెడుతున్నారని.. జోడీ ఏమాత్రం బాగుండట్లేదని సోషల్ మీడియాలో విమర్శలు తప్పట్లేదు. ‘ధమాకా’ సినిమాకు రవితేజ పక్కన శ్రీలీలను పెట్టినపుడు చాలా ట్రోలింగ్ నడిచింది. ఇప్పుడు ఆయన సరసన భాగ్యశ్రీ బోర్సే అనే మరో కొత్తమ్మాయిని పెట్టడం మీదా నెటిజన్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ‘మిస్టర్ బచ్చన్’ సినిమాకు సంబంధించిన రొమాంటిక్ పోస్టర్లు, వీడియో ప్రోమోలు రిలీజైనపుడల్లా దీని మీద సోషల్ మీడియాలో రచ్చ జరిగింది. వేరే భాషలకు సంబంధించిన ట్విట్టర్ హ్యాండిల్స్ కూడా దీని గురించి కామెంట్లు చేశాయి. దీని గురించి ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు హరీష్ స్పందించాడు.
‘‘మీ ఇంట్లో అమ్మాయికి పెళ్లి చేస్తున్నపుడు వయసు మాత్రమే కాక అన్నీ చూసుకుంటారు. అందులో తప్పు లేదు. కానీ ఒక సినిమాలో ఒక హీరో పక్కన నటించే హీరోయిన్ విషయంలో మీకెందుకు ఈ అభ్యంతరాలు? చేస్తున్న అమ్మాయికి అభ్యంతరం లేదు. ఇష్టపూర్వకంగానే సినిమాకు సంతకం చేసింది. సినిమాలో నటించింది. మరి మీ బాధ ఏంటి? సినిమా అంటేనే కల్పితం. అందులో నటీనటులు చేసేది యాక్టింగ్. అలాంటపుడు అభ్యంతరాలు ఏంటి? సినిమాలో హీరో పాత్రకు ఒక వయసు, స్వభావం ఉంటాయి. అవి చూడాలి కానీ.. హీరో వయసంత, హీరోయిన్ వయసింత అనడం ఏంటి? ‘ధమాకా’ సినిమా విషయంలోనూ ఇలాగే అన్నారు. ఆ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. ఒకప్పుడు ఎన్టీఆర్, శ్రీదేవి జోడీ గురించి కూడా ఎన్నో మాటలు అన్నారు. కానీ వాళ్ల సినిమాలు సెన్సేషనల్ హిట్టయ్యాయి. సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్లే ఇవన్నీ పట్టించుకుంటారు. మామూలు జనానికి ఇవేమీ పట్టవు. సినిమా బాగుందా లేదా అనేదే చూస్తారు’’ అని హరీష్ తేల్చేశాడు.
రేపు శ్రీరామనవమి సందర్భంగా ఫస్ట్ షాట్ పేరుతో పెద్ది టీజర్ విడుదల చేయబోతున్నారు. గేమ్ ఛేంజర్ దెబ్బకు తీవ్ర నిరాశలో…
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభమైన కొన్ని రోజుల్లోనే ఓ వర్గం అభిమానుల్లో నిరాశ మొదలైంది. ఎక్కువ అంచనాల మధ్య బరిలోకి…
స్టార్ క్యాస్టింగ్ లేకుండా హనుమాన్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన ప్రశాంత్ వర్మ ప్రస్తుతం దాని సీక్వెల్ జై హనుమాన్…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తన బాల్యం, విద్యాభ్యాసం గురించి శనివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజావేదికలో…
కేవలం అయిదే రోజుల్లో గుడ్ బ్యాడ్ అగ్లీ విడుదల కానుంది. ఏప్రిల్ 10 రిలీజని వారాల కృత్రమే ప్రకటించినప్పటికీ ప్రమోషన్ల…
ఏపీ వాణిజ్య రాజధాని విశాఖపట్నంలో సెంటు భూమి కూడా అత్యంత విలువైనదే. అలాంటి నగరంలో ఇప్పుడు 15.17 ఎకరాల భూమిపై…