Movie News

నిజమా.. ఆ రీమేక్‌లో బాలయ్య?

టాలీవుడ్లో చాలా తక్కువ రీమేక్స్‌లో నటించిన హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. ఆయనకు వేరే భాషా చిత్రాలను రీమేక్ చేయడం పట్ల అంతగా ఆసక్తి ఉండదు. గత 20 ఏళ్ల వ్యవధిలో ఆయన చేసిన రీమేక్ సినిమా ఒక్కటి మాత్రమే. 2004లో వచ్చిన ‘లక్ష్మీనరసింహా’ తమిళ బ్లాక్ బస్టర్ ‘సామి’కి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. మళ్లీ ఆయన రీమేక్‌ల జోలికే వెళ్లలేదు. పాత క్లాసిక్ ‘లవకుశ’ను ‘శ్రీరామరాజ్యం’ పేరుతో రీమేక్ చేశారే తప్ప.. వేరే భాషా చిత్రాల రీమేక్స్‌లో మాత్రం నటించలేదు.

ఐతే ఇప్పడు ఆయన ఆ ప్రయత్నం చేయబోతున్నారని సోషల్ మీడియాలో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. కొన్ని నెలల కిందట మలయాళంలో సంచలనం రేపిన ‘ఆవేశం’ రీమేక్‌లో బాలయ్య నటించబోతున్నాడని ఓ రూమర్ హల్ చల్ చేస్తోంది.

‘పుష్ప’ మూవీతో తెలుగు వారికి కూడా బాగా పరిచయం ఉన్న ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఆవేశం’ బ్లాక్ బస్టర్ అయింది. అందులో ఫాహద్ ఒక క్రేజీ క్యారెక్టర్ చేశాడు. తన క్యారెక్టరైజేషన్, పెర్ఫామెన్స్ మీదే ఆ సినిమా ఆడింది. ప్రతి హీరో ఇలాంటి ఒక పాత్ర చేయాలని ఆశపడతాడు.

ఐతే ఫాహద్ స్థానంలో మరో నటుడిని ఊహించుకోవడం కష్టమే. మామూలుగానే రీమేక్‌లను ఇష్టపడని బాలయ్య.. తన శైలికి నప్పని ఇలాంటి పాత్రను చేస్తాడు అంటే నమ్మశక్యంగా అనిపించదు. కానీ బాలయ్యతో వరుసగా సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమా రీమేక్ హక్కులు కొని.. బాలయ్యతో పునర్నిర్మించడానికి ట్రై చేస్తోందని.. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. మరి ఈ వార్తలో ఎంతమేర నిజముందో చూడాలి. బాలయ్య చేస్తే మాత్రం ఇదొక క్రేజీ మూవీ అవుతుందనడంలో సందేహం లేదు.

This post was last modified on August 5, 2024 3:20 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఒకేసారి ఇన్ని సినిమాలు ఎందుక‌య్యా?

ఐతే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్న‌ట్లే ఉంటుంది బాక్సాఫీస్ వ్య‌వ‌హారం. సంక్రాంతికి ఒకేసారి అయిదు సినిమ‌లు రిలీజ‌య్యాయి. కానీ త‌ర్వాతి…

32 minutes ago

తెలుగువారి మ‌న‌సు దోచిన‌ దురంధ‌ర్

రెండు నెల‌ల కింద‌ట రిలీజైన దురంధ‌ర్ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవ‌లం…

5 hours ago

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

9 hours ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

10 hours ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

11 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

11 hours ago