భారతీయుడు.. సౌత్ ఇండియన్ ఆడియన్స్కు ఒక మరపురాని జ్ఞాపకం. ఆ సినిమా వేసిన ఇంపాక్ట్ అలాంటిలాంటిది కాదు. అది సాధించిన విజయం గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. ఇలాంటి ఐకానిక్ మూవీకి 28 ఏళ్ల తర్వాత సీక్వెల్ తీసి థియేటర్లలోకి వదిలింది చిత్ర బృందం.
‘భారతీయుడు’ దర్శకుడు శంకరే దీన్ని రూపొందించగా.. కమల్ హాసనే లీడ్ రోల్ చేశారు. కానీ ‘భారతీయుడు-2’ ప్రేక్షకులకు ఏమాత్రం రుచించలేదు. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచిందీ చిత్రం. రూ.250 కోట్లు పెట్టి సినిమా తీస్తే.. అందులో పదో వంతు షేర్ కూడా రాబట్టలేదు.
ఈ సినిమా రిలీజైనపుడు సోషల్ మీడియాలో మామూలు ట్రోలింగ్ జరగలేదు. శంకర్ కెరీర్లో ఇలాంటి పరాజయం, ఇంత ట్రోలింగ్ ఎప్పుడూ చూసి ఉండడేమో. వీకెండ్లో కూడా ఈ సినిమా నిలబడలేకపోయింది. ఆ తర్వాత పూర్తిగా వాషౌట్ అయిపోయింది.
స్కేల్ ప్రకారం చూసుకుంటే ‘భారతీయుడు-2’ లాంటి భారీ చిత్రాలు ఓటీటీలోకి రావడానికి టైం పడుతుంది. కానీ థియేటర్లలో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన ఈ చిత్రం.. నెల రోజుల్లోపే ఓటీటీలోకి వస్తోంది. స్ట్రీమింగ్ జెయింట్ నెట్ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని ఆగస్టు 9 నుంచి స్ట్రీమ్ చేయబోతోంది.
ఐతే ‘భారతీయుడు-2’ రిలీజైనపుడు సోషల్ మీడియాలో ఎంత ట్రోలింగ్ జరిగిందో తెలిసిందే. శంకర్ లాంటి దర్శకుడు అంత పేలవంగా సినిమా తీశాడా అన్న ఆసక్తితో అయినా ఓటీటీలో ప్రేక్షకులు ఈ సినిమా చూస్తారనడంలో సందేహం లేదు. అలా చూసిన వాళ్లు ఊరికే ఉండరు.
థియేటర్లలో ఎలా భరించారీ సినిమాను అంటూ వాళ్లు కూడా ట్రోలింగ్కు దిగడం గ్యారెంటీ. కాబట్టి ఆగస్టు 9 తర్వాత మరి కొన్ని రోజుల పాటు ‘భారతీయుడు-2’ టీంకు బ్యాండ్ తప్పదు అన్నట్లే. ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘భారతీయుడు-3’ వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
This post was last modified on August 5, 2024 6:58 am
ఆంధ్రకింగ్ తాలూకా తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫైనల్ గా కొత్త ప్రాజెక్టుతో ముందుకొచ్చాడు.…
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహానాడు అంటే ఉద్వేగ భరితమైన వేదిక. పార్టీ విధానాలు, భవిష్యత్ దిశ, నాయకత్వ సందేశం కార్యకర్తలకు…
అనుకున్నంతా అయ్యింది. పెట్రోల్, డిజిల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం శుక్రవారంతో నిజమయ్యాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం…
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తయ్యే స్టేజికు…
ఇటీవలే శ్వాసనాళానికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రమంగా కోలుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్…
టిడిపిలోనే కొందరు నాయకులకు మెజారిటీ సమస్య ఇప్పుడు కొంత గడబిడగా మారింది. గత ఎన్నికల సమయంలో భారీ స్థాయి మెజారిటీతో…