భారతీయుడు.. సౌత్ ఇండియన్ ఆడియన్స్కు ఒక మరపురాని జ్ఞాపకం. ఆ సినిమా వేసిన ఇంపాక్ట్ అలాంటిలాంటిది కాదు. అది సాధించిన విజయం గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. ఇలాంటి ఐకానిక్ మూవీకి 28 ఏళ్ల తర్వాత సీక్వెల్ తీసి థియేటర్లలోకి వదిలింది చిత్ర బృందం.
‘భారతీయుడు’ దర్శకుడు శంకరే దీన్ని రూపొందించగా.. కమల్ హాసనే లీడ్ రోల్ చేశారు. కానీ ‘భారతీయుడు-2’ ప్రేక్షకులకు ఏమాత్రం రుచించలేదు. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచిందీ చిత్రం. రూ.250 కోట్లు పెట్టి సినిమా తీస్తే.. అందులో పదో వంతు షేర్ కూడా రాబట్టలేదు.
ఈ సినిమా రిలీజైనపుడు సోషల్ మీడియాలో మామూలు ట్రోలింగ్ జరగలేదు. శంకర్ కెరీర్లో ఇలాంటి పరాజయం, ఇంత ట్రోలింగ్ ఎప్పుడూ చూసి ఉండడేమో. వీకెండ్లో కూడా ఈ సినిమా నిలబడలేకపోయింది. ఆ తర్వాత పూర్తిగా వాషౌట్ అయిపోయింది.
స్కేల్ ప్రకారం చూసుకుంటే ‘భారతీయుడు-2’ లాంటి భారీ చిత్రాలు ఓటీటీలోకి రావడానికి టైం పడుతుంది. కానీ థియేటర్లలో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన ఈ చిత్రం.. నెల రోజుల్లోపే ఓటీటీలోకి వస్తోంది. స్ట్రీమింగ్ జెయింట్ నెట్ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని ఆగస్టు 9 నుంచి స్ట్రీమ్ చేయబోతోంది.
ఐతే ‘భారతీయుడు-2’ రిలీజైనపుడు సోషల్ మీడియాలో ఎంత ట్రోలింగ్ జరిగిందో తెలిసిందే. శంకర్ లాంటి దర్శకుడు అంత పేలవంగా సినిమా తీశాడా అన్న ఆసక్తితో అయినా ఓటీటీలో ప్రేక్షకులు ఈ సినిమా చూస్తారనడంలో సందేహం లేదు. అలా చూసిన వాళ్లు ఊరికే ఉండరు.
థియేటర్లలో ఎలా భరించారీ సినిమాను అంటూ వాళ్లు కూడా ట్రోలింగ్కు దిగడం గ్యారెంటీ. కాబట్టి ఆగస్టు 9 తర్వాత మరి కొన్ని రోజుల పాటు ‘భారతీయుడు-2’ టీంకు బ్యాండ్ తప్పదు అన్నట్లే. ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘భారతీయుడు-3’ వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
This post was last modified on August 5, 2024 6:58 am
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…