యాంకర్గా ప్రయాణం మొదలుపెట్టి, నటిగా బిజీ అయిన అనసూయ భరద్వాజ్.. సోషల్ మీడియాలో చాలా పాపులర్. బోల్డ్ ఫొటో షూట్లతో ఫ్యాషన్కు వయసు అడ్డంకి కాదు అని చాటుతూ ఉంటుందామె. ఐతే ఈ క్రమంలో నెటిజన్ల నుంచి కొన్నిసార్లు వ్యతిరేకత ఎదుర్కొంటూ.. వాళ్లతో వాదనలు పెట్టుకుంటూ ఉంటుంది. ఐతే ఏ సందర్భంలోనూ తగ్గేదే లే అన్నట్లు వాళ్లను ఢీకొడుతూనే ఉంటుంది అనసూయ.
ఒకట్రెండు సందర్భాల్లో మాత్రమే ఆమె హర్టయి కన్నీళ్లు పెట్టుకునే స్థితికి వెళ్లింది. ఆ సందర్భాల్లో కూడా తర్వాత బలంగా పుంజుకుని తన మీద నెగెటివ్ కామెంట్లు పెట్టే నెటిజన్లను ఢీకొట్టుంది. ప్రధానంగా అనసూయ డ్యాన్సింగ్ గురించి.. టీవీ షోల్లో తన మాటలు, ప్రవర్తన గురించి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తుంటారు నెటిజన్లు. ఐతే తన డ్రెస్సింగ్ తన ఇష్టమని.. దాని గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదని అంటుంటుంది అనసూయ. ఇక షోల్లో మాట్లాడే మాటలు, చేేసే చేష్టల్ని ప్రొఫెషన్లో భాగంగానే చూడమంటుంది.
ఐతే బయటి వాళ్లు విమర్శించడం, కామెంట్లు చేయడం సంగతి అలా ఉంచితే.. తన ఇంట్లో వాళ్లే తన డ్రెస్సింగ్ను విమర్శిస్తారని అంటోంది అనసూయ. తన కొడుక్కి తన డ్రెస్సింగ్ నచ్చదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పడం ఆశ్చర్యపరిచింది. తాను నడుంపైకి టాప్ వేసుకుంటే అది తన కొడుక్కి నచ్చదని.. ఫుల్ టాప్ వేయమని అంటాడని.. వేరే డ్రెస్సుల విషయంలోనూ ఇలా అభ్యంతరాలు వ్యక్తం చేస్తాడని అనసూయ చెప్పింది.
ఐతే తన డ్రెస్సింగ్ తన ఇష్టమని.. తనకు ఏది కంఫర్ట్గా ఉంటే, తాను ఎలా అందంగా ఉంటే అలా డ్రెస్ చేసుకుంటానని.. ఈ విషయంలో అభ్యంతరపెట్టకూడదని తన కొడుక్కి తాను చెబుతానని అనసూయ వెల్లడించింది.
అంతే కాక తన పిల్లల డ్రెస్సింగ్ విషయంలోనూ తాను వేలు పెట్టనని.. షాప్కు తీసుకెళ్లి నచ్చింది తీసుకోమని చెబుతానని ఆమె చెప్పింది. తాను డిగ్రీ వచ్చే వరకు తానేం ధరించాలో తన తల్లిదండ్రులే నిర్ణయించారని.. కానీ తాను మాత్రం తన పిల్లలకు చిన్నతనం నుంచే స్వేచ్ఛ ఇచ్చానని అనసూయ వెల్లడించింది.
This post was last modified on August 5, 2024 6:56 am
https://www.youtube.com/watch?v=ddmpaI3WTvc
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కౌంట్ డౌన్ వేగంగా జరిగిపోతోంది. మార్చి 26 రావాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ హఠాత్తుగా మార్చి…
టాలీవుడ్ మోస్ట్ క్రేజీ మూవీస్ లో ఒకటిగా నిర్మాణంలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ ప్యాన్ ప్యాన్…
విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో పీజీ వైద్య విద్యార్థిని బత్తుల దీపిక ఆత్మహత్య కేసులో కీలక మలుపు తిరిగింది.…
ఏపీలో కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న జనసేన పార్టీ.. ఈ ఏడాది పార్టీ సభ్యత్వాన్ని గత నెలలోనే ప్రారంభించిన…
పార్టీ విధానాలకు, సిద్ధాంతాలకు అనుగుణంగా నాయకులు పనిచేయాలని.. ఎమ్మెల్యేలు-ఎంపీలు కలివిడిగా ఉండాలని సీఎం చంద్రబాబు టీడీపీ నాయకులకు సూచించారు. నంద్యాల…