ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావ, కుమారి 21 ఎఫ్.. ఇలా హ్యాట్రిక్ హిట్లతో హీరోగా కెరీర్ను ఘనంగా ఆరంభించిన యువ కథానాయకుడు రాజ్ తరుణ్.. ఆ తర్వాత నిఖార్సయిన హిట్ ఒక్కటీ అందుకోలేకపోయాడు.
ఒకప్పుడు తన చిత్రాలు యావరేజ్గా అయినా ఆడేవి, వాటికి ఓపెనింగ్స్ అయినా వచ్చేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. ఈ హీరో నుంచి రెండు వారాల్లో రెండు సినిమాలు విడుదలైతే.. ఒక్కటీ కూడా మినిమం ఇంపాక్ట్ చూపించలేకపోయింది.
ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లయి రాజ్కు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. గత వారం ‘పురుషోత్తముడు’ అనే సినిమా రిలీజైన సంగతి తెలిసిందే. ఆ పేరుతో రాజ్ ఎప్పుడు సినిమా చేశాడో కూడా జనాలకు తెలియదు. సడెన్గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ట్రైలర్ వదిలారు. సినిమానూ థియేటర్లలోెకి దించేశారు.
కానీ శ్రీమంతుడు, బిచ్చగాడు లాంటి చిత్రాలకు కాపీలా అనిపించిన ‘పురుషోత్తముడు’ వీకెండ్లోనే వాషౌట్ అయిపోయింది. ఆ సినిమాను రాజ్ తరుణ్ కూడా పట్టించుకోలేదు. కానీ తర్వాతి వారం రిలీజ్కు రెడీ అయిన ‘తిరగబడర సామీ’ కోసం ప్రెస్ మీట్లో పాల్గొని ప్రమోట్ చేశాడు.
పబ్లిసిటీ కూడా పర్వాలేదనిపించింది. యజ్ఞం, పిల్లా నువ్వు లేని జీవితం లాంటి సినిమాలు తీసిన రవికుమార్ చౌదరి తీసిన చిత్రం కావడంతో ఇది ఓ మోస్తరుగా అయినా ఉంటుందనుకున్నారు. కానీ ‘పురుషోత్తముడు’నే ఎంతో నయం అనిపించేంతగా ప్రేక్షకులకు చుక్కలు చూపించేసింది ‘తిరగబడర సామీ’.
రాజ్కు ఏమాత్రం సెట్ అవని క్యారెక్టర్ చేశాడిందులో. తొలి రోజు ఉదయం ఓ మాదిరిగా ఆక్యుపెన్సీలు కనిపించాయి కానీ.. మరీ దారుణమైన టాక్ రావడంతో తర్వాత ఈ సినిమా థియేటర్లు వెలవెలబోయాయి. వారం వ్యవధిలో రాజ్ ఖాతాలో రెండో డిజాస్టర్ పడడంతో ఇక తన కెరీర్ ఏమాత్రం పుంజుకుంటుంన్నది సందేహం.
This post was last modified on August 4, 2024 6:14 pm
కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన అనేక మందికి సర్కారు ఏర్పడిన తర్వాత.. నామినేటెడ్ పదవులతో సంతృప్తి కలిగిస్తున్నారు. ఎన్ని…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు వరుసగా కష్టాలు మొదలైపోతున్నాయి. మొన్నటి సార్వత్రిక…
ఏపీ ప్రతిపక్ష పార్టీ(ప్రధాన కాదు) వైసీపీకి తాజాగా భారీ ఎదురు దెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 2021లో అతి…
కిరణ్ అబ్బవరం ఫ్లాప్ స్ట్రీక్కు బ్రేక్ వేసిన సినిమా.. క. గత ఏడాది దీపావళికి విడుదలైన ఈ చిత్రం సూపర్…
సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టే సంస్కృతి పెరిగిపోతోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి వారి విషయంలో…
త్రిభాషా విధానాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రచ్చ రాజుకున్న సంగతి తెలిసిందే. జనసేన…