ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావ, కుమారి 21 ఎఫ్.. ఇలా హ్యాట్రిక్ హిట్లతో హీరోగా కెరీర్ను ఘనంగా ఆరంభించిన యువ కథానాయకుడు రాజ్ తరుణ్.. ఆ తర్వాత నిఖార్సయిన హిట్ ఒక్కటీ అందుకోలేకపోయాడు.
ఒకప్పుడు తన చిత్రాలు యావరేజ్గా అయినా ఆడేవి, వాటికి ఓపెనింగ్స్ అయినా వచ్చేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. ఈ హీరో నుంచి రెండు వారాల్లో రెండు సినిమాలు విడుదలైతే.. ఒక్కటీ కూడా మినిమం ఇంపాక్ట్ చూపించలేకపోయింది.
ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లయి రాజ్కు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. గత వారం ‘పురుషోత్తముడు’ అనే సినిమా రిలీజైన సంగతి తెలిసిందే. ఆ పేరుతో రాజ్ ఎప్పుడు సినిమా చేశాడో కూడా జనాలకు తెలియదు. సడెన్గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ట్రైలర్ వదిలారు. సినిమానూ థియేటర్లలోెకి దించేశారు.
కానీ శ్రీమంతుడు, బిచ్చగాడు లాంటి చిత్రాలకు కాపీలా అనిపించిన ‘పురుషోత్తముడు’ వీకెండ్లోనే వాషౌట్ అయిపోయింది. ఆ సినిమాను రాజ్ తరుణ్ కూడా పట్టించుకోలేదు. కానీ తర్వాతి వారం రిలీజ్కు రెడీ అయిన ‘తిరగబడర సామీ’ కోసం ప్రెస్ మీట్లో పాల్గొని ప్రమోట్ చేశాడు.
పబ్లిసిటీ కూడా పర్వాలేదనిపించింది. యజ్ఞం, పిల్లా నువ్వు లేని జీవితం లాంటి సినిమాలు తీసిన రవికుమార్ చౌదరి తీసిన చిత్రం కావడంతో ఇది ఓ మోస్తరుగా అయినా ఉంటుందనుకున్నారు. కానీ ‘పురుషోత్తముడు’నే ఎంతో నయం అనిపించేంతగా ప్రేక్షకులకు చుక్కలు చూపించేసింది ‘తిరగబడర సామీ’.
రాజ్కు ఏమాత్రం సెట్ అవని క్యారెక్టర్ చేశాడిందులో. తొలి రోజు ఉదయం ఓ మాదిరిగా ఆక్యుపెన్సీలు కనిపించాయి కానీ.. మరీ దారుణమైన టాక్ రావడంతో తర్వాత ఈ సినిమా థియేటర్లు వెలవెలబోయాయి. వారం వ్యవధిలో రాజ్ ఖాతాలో రెండో డిజాస్టర్ పడడంతో ఇక తన కెరీర్ ఏమాత్రం పుంజుకుంటుంన్నది సందేహం.
This post was last modified on August 4, 2024 6:14 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…