ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావ, కుమారి 21 ఎఫ్.. ఇలా హ్యాట్రిక్ హిట్లతో హీరోగా కెరీర్ను ఘనంగా ఆరంభించిన యువ కథానాయకుడు రాజ్ తరుణ్.. ఆ తర్వాత నిఖార్సయిన హిట్ ఒక్కటీ అందుకోలేకపోయాడు.
ఒకప్పుడు తన చిత్రాలు యావరేజ్గా అయినా ఆడేవి, వాటికి ఓపెనింగ్స్ అయినా వచ్చేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. ఈ హీరో నుంచి రెండు వారాల్లో రెండు సినిమాలు విడుదలైతే.. ఒక్కటీ కూడా మినిమం ఇంపాక్ట్ చూపించలేకపోయింది.
ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లయి రాజ్కు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. గత వారం ‘పురుషోత్తముడు’ అనే సినిమా రిలీజైన సంగతి తెలిసిందే. ఆ పేరుతో రాజ్ ఎప్పుడు సినిమా చేశాడో కూడా జనాలకు తెలియదు. సడెన్గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ట్రైలర్ వదిలారు. సినిమానూ థియేటర్లలోెకి దించేశారు.
కానీ శ్రీమంతుడు, బిచ్చగాడు లాంటి చిత్రాలకు కాపీలా అనిపించిన ‘పురుషోత్తముడు’ వీకెండ్లోనే వాషౌట్ అయిపోయింది. ఆ సినిమాను రాజ్ తరుణ్ కూడా పట్టించుకోలేదు. కానీ తర్వాతి వారం రిలీజ్కు రెడీ అయిన ‘తిరగబడర సామీ’ కోసం ప్రెస్ మీట్లో పాల్గొని ప్రమోట్ చేశాడు.
పబ్లిసిటీ కూడా పర్వాలేదనిపించింది. యజ్ఞం, పిల్లా నువ్వు లేని జీవితం లాంటి సినిమాలు తీసిన రవికుమార్ చౌదరి తీసిన చిత్రం కావడంతో ఇది ఓ మోస్తరుగా అయినా ఉంటుందనుకున్నారు. కానీ ‘పురుషోత్తముడు’నే ఎంతో నయం అనిపించేంతగా ప్రేక్షకులకు చుక్కలు చూపించేసింది ‘తిరగబడర సామీ’.
రాజ్కు ఏమాత్రం సెట్ అవని క్యారెక్టర్ చేశాడిందులో. తొలి రోజు ఉదయం ఓ మాదిరిగా ఆక్యుపెన్సీలు కనిపించాయి కానీ.. మరీ దారుణమైన టాక్ రావడంతో తర్వాత ఈ సినిమా థియేటర్లు వెలవెలబోయాయి. వారం వ్యవధిలో రాజ్ ఖాతాలో రెండో డిజాస్టర్ పడడంతో ఇక తన కెరీర్ ఏమాత్రం పుంజుకుంటుంన్నది సందేహం.
This post was last modified on August 4, 2024 6:14 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…