ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావ, కుమారి 21 ఎఫ్.. ఇలా హ్యాట్రిక్ హిట్లతో హీరోగా కెరీర్ను ఘనంగా ఆరంభించిన యువ కథానాయకుడు రాజ్ తరుణ్.. ఆ తర్వాత నిఖార్సయిన హిట్ ఒక్కటీ అందుకోలేకపోయాడు.
ఒకప్పుడు తన చిత్రాలు యావరేజ్గా అయినా ఆడేవి, వాటికి ఓపెనింగ్స్ అయినా వచ్చేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. ఈ హీరో నుంచి రెండు వారాల్లో రెండు సినిమాలు విడుదలైతే.. ఒక్కటీ కూడా మినిమం ఇంపాక్ట్ చూపించలేకపోయింది.
ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లయి రాజ్కు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. గత వారం ‘పురుషోత్తముడు’ అనే సినిమా రిలీజైన సంగతి తెలిసిందే. ఆ పేరుతో రాజ్ ఎప్పుడు సినిమా చేశాడో కూడా జనాలకు తెలియదు. సడెన్గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ట్రైలర్ వదిలారు. సినిమానూ థియేటర్లలోెకి దించేశారు.
కానీ శ్రీమంతుడు, బిచ్చగాడు లాంటి చిత్రాలకు కాపీలా అనిపించిన ‘పురుషోత్తముడు’ వీకెండ్లోనే వాషౌట్ అయిపోయింది. ఆ సినిమాను రాజ్ తరుణ్ కూడా పట్టించుకోలేదు. కానీ తర్వాతి వారం రిలీజ్కు రెడీ అయిన ‘తిరగబడర సామీ’ కోసం ప్రెస్ మీట్లో పాల్గొని ప్రమోట్ చేశాడు.
పబ్లిసిటీ కూడా పర్వాలేదనిపించింది. యజ్ఞం, పిల్లా నువ్వు లేని జీవితం లాంటి సినిమాలు తీసిన రవికుమార్ చౌదరి తీసిన చిత్రం కావడంతో ఇది ఓ మోస్తరుగా అయినా ఉంటుందనుకున్నారు. కానీ ‘పురుషోత్తముడు’నే ఎంతో నయం అనిపించేంతగా ప్రేక్షకులకు చుక్కలు చూపించేసింది ‘తిరగబడర సామీ’.
రాజ్కు ఏమాత్రం సెట్ అవని క్యారెక్టర్ చేశాడిందులో. తొలి రోజు ఉదయం ఓ మాదిరిగా ఆక్యుపెన్సీలు కనిపించాయి కానీ.. మరీ దారుణమైన టాక్ రావడంతో తర్వాత ఈ సినిమా థియేటర్లు వెలవెలబోయాయి. వారం వ్యవధిలో రాజ్ ఖాతాలో రెండో డిజాస్టర్ పడడంతో ఇక తన కెరీర్ ఏమాత్రం పుంజుకుంటుంన్నది సందేహం.
This post was last modified on August 4, 2024 6:14 pm
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…
కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…
తెలంగాణలో సింగిల్ స్క్రీన్లను నడిపించే ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు మధ్య పీటముడి గట్టిగానే బిగుసుకునేలా కనిపిస్తోంది. అద్దె విధానం పక్కన పెట్టి…
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో…
ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 108 సీట్లు గెలుచుకున్న విజయ్ పార్టీ…మ్యాజిక్…