Movie News

విశ్వంభరపై అంచనాలు ఇంకా పెంచేశాడు

బాహుబలి సినిమా చూశాక స్టార్ హీరోలు అందరికీ అలాంటి భారీ స్థాయి పాన్ ఇండియా సినిమా చేయాలని.. ప్రేక్షకులను ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్లి విహరింపజేయడం ద్వారా భారీ విజయాన్ని అందుకోవాలని ఆశ పుట్టింది. మెగాస్టార్ చిరంజీవి ఇంతకుముందే ‘సైరా నరసింహారెడ్డి’ పేరుతో పాన్ ఇండియా స్థాయి సినిమానే చేశాడు. కానీ ఆ చిత్రం ఆశించిన ఫలితాన్నివ్వలేదు. దీంతో మళ్లీ మామూలు సినిమాలకే పరిమితం అయ్యారు.

కానీ ఇప్పుడు ఆయన చేస్తున్న ‘విశ్వంభర’ వేరే లెవెల్ అన్నది టీం వర్గాల మాట. ఈ సినిమా టీజర్ చూసినా.. చిరు ఏదో ఎక్స్‌ట్రార్డినరీ సినిమానే చేస్తున్న ఫీలింగ్ కలిగింది. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘అంజి’ తరహాలో ఫాంటసీ టచ్ ఉన్న విజువల్ వండర్ ట్రై చేస్తున్నట్లున్నాడు ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ. ఎక్కువ హడావుడి చేయకుండా అతను తన టీంతో కలిసి సైలెంటుగా సినిమాను లాగించేస్తున్నాడు.

సంక్రాంతికే ‘విశ్వంభర’ ప్రేక్షకుల ముందుకు రానుండగా.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ చిత్రం మీద హైప్ పెరిగేలా మాట్లాడాడు వశిష్ఠ. ఈ చిత్రానికి ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ లాంటి సినిమాలే రెఫరెన్స్ అనే విషయాన్ని మరోసారి నొక్కి వక్కాణించిన వశిష్ఠ.. ఆ సినిమాలాగే ‘విశ్వంభర’ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పాడు.

చిరంజీవి కెరీర్లో టాప్-5 సినిమాలు తీసుకుంటే.. అందులో ‘విశ్వంభర’ కూడా ఒకటిగా ఉండేలా దీన్ని తీర్చిదిద్దుతున్నామని వశిష్ఠ చెప్పాడు. చిరు అభిమానులు చాలా కాలం ఈ సినిమాను గుర్తుంచుకుంటారన్నాడు. ప్రేక్షకులను ఒక వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని.. సెట్టింగ్స్, గ్రాఫిక్స్ అన్నీ కూడా భారీ స్థాయిలో ఉంటాయని అతనన్నాడు. కథ దగ్గర్నుంచి అన్నీ గమ్మత్తుగా అనిపిస్తాయని.. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతున్నాయని.. హాలీవుడ్ మార్వెల్ సినిమాల లెవెల్లో ఇది ఉంటుందని వశిష్ఠ చెప్పడం విశేషం. ఈ మాటలతో మెగా అభిమానుల్లో ‘విశ్వంభర’ మీద ఇప్పటికే ఉన్న అంచనాలు ఇంకా పెరిగిపోవడం ఖాయం.

Satya

Recent Posts

పోక్సో కేసు నిందితుడికి బెయిలు రానివ్వకూడదు: రేవంత్ తో పవన్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘ‌ట‌న దారుణం`` అని…

9 minutes ago

ప్రజాధనం అంటే పవన్ ఒప్పుకోరు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…

9 minutes ago

ముద్ర‌గ‌డ పాడె మోసిన జ‌గ‌న్‌

కాపు ఉద్య‌మ నాయ‌కుడు, మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం అంత్య‌క్రియ‌లు ముగిశాయి. తూర్పుగోదావ‌రి జిల్లా కిర్లంపూడిలోని ఆయ‌న ఇంటి ప్రాంగ‌ణంలోనే…

40 minutes ago

బాబు సర్కారును పొగిడిన కేటీఆర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్‌నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…

43 minutes ago

అభిమానం తోడుతో… ఇంటికి చేరిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌!

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుప‌త్రి నుంచి  డిశ్చార్జ్ అయి..…

2 hours ago

ఇంత అహంకారమెందుకు అంబటి

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం ఉదయం ముద్రగడను…

2 hours ago