బాహుబలి సినిమా చూశాక స్టార్ హీరోలు అందరికీ అలాంటి భారీ స్థాయి పాన్ ఇండియా సినిమా చేయాలని.. ప్రేక్షకులను ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్లి విహరింపజేయడం ద్వారా భారీ విజయాన్ని అందుకోవాలని ఆశ పుట్టింది. మెగాస్టార్ చిరంజీవి ఇంతకుముందే ‘సైరా నరసింహారెడ్డి’ పేరుతో పాన్ ఇండియా స్థాయి సినిమానే చేశాడు. కానీ ఆ చిత్రం ఆశించిన ఫలితాన్నివ్వలేదు. దీంతో మళ్లీ మామూలు సినిమాలకే పరిమితం అయ్యారు.
కానీ ఇప్పుడు ఆయన చేస్తున్న ‘విశ్వంభర’ వేరే లెవెల్ అన్నది టీం వర్గాల మాట. ఈ సినిమా టీజర్ చూసినా.. చిరు ఏదో ఎక్స్ట్రార్డినరీ సినిమానే చేస్తున్న ఫీలింగ్ కలిగింది. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘అంజి’ తరహాలో ఫాంటసీ టచ్ ఉన్న విజువల్ వండర్ ట్రై చేస్తున్నట్లున్నాడు ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ. ఎక్కువ హడావుడి చేయకుండా అతను తన టీంతో కలిసి సైలెంటుగా సినిమాను లాగించేస్తున్నాడు.
సంక్రాంతికే ‘విశ్వంభర’ ప్రేక్షకుల ముందుకు రానుండగా.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ చిత్రం మీద హైప్ పెరిగేలా మాట్లాడాడు వశిష్ఠ. ఈ చిత్రానికి ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ లాంటి సినిమాలే రెఫరెన్స్ అనే విషయాన్ని మరోసారి నొక్కి వక్కాణించిన వశిష్ఠ.. ఆ సినిమాలాగే ‘విశ్వంభర’ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పాడు.
చిరంజీవి కెరీర్లో టాప్-5 సినిమాలు తీసుకుంటే.. అందులో ‘విశ్వంభర’ కూడా ఒకటిగా ఉండేలా దీన్ని తీర్చిదిద్దుతున్నామని వశిష్ఠ చెప్పాడు. చిరు అభిమానులు చాలా కాలం ఈ సినిమాను గుర్తుంచుకుంటారన్నాడు. ప్రేక్షకులను ఒక వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని.. సెట్టింగ్స్, గ్రాఫిక్స్ అన్నీ కూడా భారీ స్థాయిలో ఉంటాయని అతనన్నాడు. కథ దగ్గర్నుంచి అన్నీ గమ్మత్తుగా అనిపిస్తాయని.. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతున్నాయని.. హాలీవుడ్ మార్వెల్ సినిమాల లెవెల్లో ఇది ఉంటుందని వశిష్ఠ చెప్పడం విశేషం. ఈ మాటలతో మెగా అభిమానుల్లో ‘విశ్వంభర’ మీద ఇప్పటికే ఉన్న అంచనాలు ఇంకా పెరిగిపోవడం ఖాయం.
This post was last modified on August 4, 2024 6:16 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…