సూపర్ హిట్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్గా తెరకెక్కిన చిత్రం.. ‘డబుల్ ఇస్మార్ట్’. ఇంకో రెండు వారాల్లోపే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. ఆగస్టు 15కు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఐతే ముందు అనుమానించినట్లుగానే రిలీజ్ ముంగిట ఈ చిత్రానికి తలనొప్పులు తప్పట్లేదు.
దర్శక నిర్మాత పూరి జగన్నాథ్ చివరి చిత్రం లైగర్కు నష్టాకు సంబంధించిన తలనొప్పులు ఈ చిత్రాన్ని చుట్టుకున్నాయి. లీగల్గా చూస్తే పూరి నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా.. లైగర్ మరీ దారుణంగా దెబ్బకొట్టిన నేపథ్యంలో బయ్యర్లు, ఎగ్జిబిటర్లను ఆదుకోవాల్సిన నైతిక బాధ్యత ఆయనపై పడింది.
కొన్ని రోజులుగా దీనికి సంబంధించిన పంచాయితీ నడుస్తోంది. ఈ వ్యవహారం ఎంతైనా డబుల్ ఇస్మార్ట్ టీంను కలవరపెడుతూ ఉంటుందనడంలో సందేహం లేదు. మరోవైపు డబుల్ ఇస్మార్ట్లో కంటెంట్ ఎంత బలంగా ఉంటుందనే విషయంలో సందేహలున్నాయి.
ఇస్మార్ట్ శంకర్ ఫ్లూక్ హిట్ అనే అభిప్రాయానికి బలం చేకూర్చేలా పూరి తర్వాతి చిత్రం లైగర్ డిజాస్టర్ అయింది. దీంతో ఆయన పనితనం మీద మళ్లీ సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో 60 కోట్లు పెట్టి డబుల్ ఇస్మార్ట్ థియేట్రికల్ హక్కుల కొన్న నిర్మాత నిరంజన్ రెడ్డికి కూడా రికవరీ అంత తేలిక కాదు.
ఇంకోవైపు లైగర్ పుణ్యమా అని థియేటర్ల సమస్య ఉంది. ఇదిలా ఉంటే ఇప్పటిదాకా డబుల్ ఇస్మార్ట్ నుంచి రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ ఏమంత గొప్పగా అనిపించలేదు. పాటలు ఓ మోస్తరుగా అనిపించాయి. టీజర్ జస్ట్ ఓకే అనిపించింది. మిస్టర్ బచ్చన్తో ప్రమోషన్లలో డబుల్ ఇస్మార్ట్ టీం వెనుకబడిందన్నది స్పష్టం.
ఈ నేపథ్యంలో డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ ఎలా ఉంటుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది. ఆ ట్రైలర్ స్ట్రైకింగ్గా ఉంటే.. ఆటోమేటిగ్గా బజ్ క్రియేట్ అవుతుంది. టీంలో ఉత్సాహం వస్తుంది. అప్పుడు మిగతా సమస్యలు కూడా పరిష్కరించుకుని, సినిమాను మరింత బాగా ప్రమోట్ చేసి హైప్ మధ్య రిలీజ్ చేయడానికి అవకాశముంటుంది.
This post was last modified on August 4, 2024 10:39 am
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…