తెలుగులో శౌర్యం అనే రెగ్యులర్ మాస్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు తమిళ సినిమాటోగ్రాఫర్ శివ. ఆ తర్వాత అతను తెలుగులో తీసిన శంఖం, దరువు.. తమిళంలో తెరకెక్కించిన సిరుత్తై (విక్రమార్కుడు రీమేక్), వీరం, వివేకం, విశ్వాసం, అన్నాత్తె సగటు మాస్ మసాలా చిత్రాలే.
అలాంటి దర్శకుడు సూర్యతో జట్టు కడుతుంటే.. ఇంకో రెగ్యులర్ మాస్ మూవీనే వస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఈసారి శివ అండ్ టీం కలిసి ఒక విజువల్ వండర్ తీస్తున్నారని.. కంగువ ఫస్ట్ టీజర్ రిలీజైనపుడే అందరికీ అర్థమైపోయింది.
అందులో విజువల్స్, సెట్టింగ్స్, ఎఫెక్ట్స్.. సూర్య లుక్స్, సినిమా నేపథ్యం అన్నీ చూసి ప్రేక్షకులకు మతి పోయింది. సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ మధ్యే వచ్చిన మరో టీజర్, తొలి పాటలో విజువల్స్ అవీ చూశాక జనాలకు మతిపోయింది. సినిమాకు హైప్ ఇంకా పెరిగిపోయింది.
ఐతే కంగువకు ఎంత హైప్ ఉన్నప్పటికీ దసరా టైంలో దానికి బాక్సాఫీస్ దగ్గర పోటీ తప్పేలా లేదు. అజిత్ మూవీ విడాముయర్చితో పాటు తెలుగులో కూడా ఏదో ఒక పేరున్న సినిమా దసరాకు రిలీజవుతుందని భావిస్తున్నారు.
ఐతే కంగువ కంటెంట్ గురించి తెలియక ఇప్పుడు పోటీకి రెడీ అవుతున్నారని.. ఈ సినిమా రిలీజయ్యాక అంతా మారిపోతుందని అంటున్నాడు ఈ చిత్ర నిర్మాత, సూర్య కజిన్ జ్ఞానవేల్ రాజా. కంగువ ఎలాంటి సినిమానో పూర్తిగా తెలియక, ఇందులో కంటెంట్ గురించి అవగాహన లేక కొన్ని సినిమాలు దీంతో పాటు పడేలా కనిపిస్తున్నాయి.
కానీ కంగువ రిలీజయ్యాక కథ మారుతుంది. కంగువ-2కు ఎవరూ పోటీ రారు. కంటెంట్ అంత బలమైంది అని జ్ఞానవేల్ రాజా అన్నాడు. ఏకంగా పది భాషల్లో విడుదలవుతున్న కంగువ సినిమా వెయ్యి కోట్ల వసూళ్లు రాబడుతుందని జ్ఞానవేల్ రాజా ధీమా వ్యక్తం చేస్తుండడం విశేషం. దసరా కానుకగా అక్టోబరు 10న కంగువ-1 విడుదలవుతుంది.
This post was last modified on August 4, 2024 10:12 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…