తెలుగులో శౌర్యం అనే రెగ్యులర్ మాస్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు తమిళ సినిమాటోగ్రాఫర్ శివ. ఆ తర్వాత అతను తెలుగులో తీసిన శంఖం, దరువు.. తమిళంలో తెరకెక్కించిన సిరుత్తై (విక్రమార్కుడు రీమేక్), వీరం, వివేకం, విశ్వాసం, అన్నాత్తె సగటు మాస్ మసాలా చిత్రాలే.
అలాంటి దర్శకుడు సూర్యతో జట్టు కడుతుంటే.. ఇంకో రెగ్యులర్ మాస్ మూవీనే వస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఈసారి శివ అండ్ టీం కలిసి ఒక విజువల్ వండర్ తీస్తున్నారని.. కంగువ ఫస్ట్ టీజర్ రిలీజైనపుడే అందరికీ అర్థమైపోయింది.
అందులో విజువల్స్, సెట్టింగ్స్, ఎఫెక్ట్స్.. సూర్య లుక్స్, సినిమా నేపథ్యం అన్నీ చూసి ప్రేక్షకులకు మతి పోయింది. సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ మధ్యే వచ్చిన మరో టీజర్, తొలి పాటలో విజువల్స్ అవీ చూశాక జనాలకు మతిపోయింది. సినిమాకు హైప్ ఇంకా పెరిగిపోయింది.
ఐతే కంగువకు ఎంత హైప్ ఉన్నప్పటికీ దసరా టైంలో దానికి బాక్సాఫీస్ దగ్గర పోటీ తప్పేలా లేదు. అజిత్ మూవీ విడాముయర్చితో పాటు తెలుగులో కూడా ఏదో ఒక పేరున్న సినిమా దసరాకు రిలీజవుతుందని భావిస్తున్నారు.
ఐతే కంగువ కంటెంట్ గురించి తెలియక ఇప్పుడు పోటీకి రెడీ అవుతున్నారని.. ఈ సినిమా రిలీజయ్యాక అంతా మారిపోతుందని అంటున్నాడు ఈ చిత్ర నిర్మాత, సూర్య కజిన్ జ్ఞానవేల్ రాజా. కంగువ ఎలాంటి సినిమానో పూర్తిగా తెలియక, ఇందులో కంటెంట్ గురించి అవగాహన లేక కొన్ని సినిమాలు దీంతో పాటు పడేలా కనిపిస్తున్నాయి.
కానీ కంగువ రిలీజయ్యాక కథ మారుతుంది. కంగువ-2కు ఎవరూ పోటీ రారు. కంటెంట్ అంత బలమైంది అని జ్ఞానవేల్ రాజా అన్నాడు. ఏకంగా పది భాషల్లో విడుదలవుతున్న కంగువ సినిమా వెయ్యి కోట్ల వసూళ్లు రాబడుతుందని జ్ఞానవేల్ రాజా ధీమా వ్యక్తం చేస్తుండడం విశేషం. దసరా కానుకగా అక్టోబరు 10న కంగువ-1 విడుదలవుతుంది.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…