తెలుగులో శౌర్యం అనే రెగ్యులర్ మాస్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు తమిళ సినిమాటోగ్రాఫర్ శివ. ఆ తర్వాత అతను తెలుగులో తీసిన శంఖం, దరువు.. తమిళంలో తెరకెక్కించిన సిరుత్తై (విక్రమార్కుడు రీమేక్), వీరం, వివేకం, విశ్వాసం, అన్నాత్తె సగటు మాస్ మసాలా చిత్రాలే.
అలాంటి దర్శకుడు సూర్యతో జట్టు కడుతుంటే.. ఇంకో రెగ్యులర్ మాస్ మూవీనే వస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఈసారి శివ అండ్ టీం కలిసి ఒక విజువల్ వండర్ తీస్తున్నారని.. కంగువ ఫస్ట్ టీజర్ రిలీజైనపుడే అందరికీ అర్థమైపోయింది.
అందులో విజువల్స్, సెట్టింగ్స్, ఎఫెక్ట్స్.. సూర్య లుక్స్, సినిమా నేపథ్యం అన్నీ చూసి ప్రేక్షకులకు మతి పోయింది. సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ మధ్యే వచ్చిన మరో టీజర్, తొలి పాటలో విజువల్స్ అవీ చూశాక జనాలకు మతిపోయింది. సినిమాకు హైప్ ఇంకా పెరిగిపోయింది.
ఐతే కంగువకు ఎంత హైప్ ఉన్నప్పటికీ దసరా టైంలో దానికి బాక్సాఫీస్ దగ్గర పోటీ తప్పేలా లేదు. అజిత్ మూవీ విడాముయర్చితో పాటు తెలుగులో కూడా ఏదో ఒక పేరున్న సినిమా దసరాకు రిలీజవుతుందని భావిస్తున్నారు.
ఐతే కంగువ కంటెంట్ గురించి తెలియక ఇప్పుడు పోటీకి రెడీ అవుతున్నారని.. ఈ సినిమా రిలీజయ్యాక అంతా మారిపోతుందని అంటున్నాడు ఈ చిత్ర నిర్మాత, సూర్య కజిన్ జ్ఞానవేల్ రాజా. కంగువ ఎలాంటి సినిమానో పూర్తిగా తెలియక, ఇందులో కంటెంట్ గురించి అవగాహన లేక కొన్ని సినిమాలు దీంతో పాటు పడేలా కనిపిస్తున్నాయి.
కానీ కంగువ రిలీజయ్యాక కథ మారుతుంది. కంగువ-2కు ఎవరూ పోటీ రారు. కంటెంట్ అంత బలమైంది అని జ్ఞానవేల్ రాజా అన్నాడు. ఏకంగా పది భాషల్లో విడుదలవుతున్న కంగువ సినిమా వెయ్యి కోట్ల వసూళ్లు రాబడుతుందని జ్ఞానవేల్ రాజా ధీమా వ్యక్తం చేస్తుండడం విశేషం. దసరా కానుకగా అక్టోబరు 10న కంగువ-1 విడుదలవుతుంది.
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…