తెలుగులో శౌర్యం అనే రెగ్యులర్ మాస్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు తమిళ సినిమాటోగ్రాఫర్ శివ. ఆ తర్వాత అతను తెలుగులో తీసిన శంఖం, దరువు.. తమిళంలో తెరకెక్కించిన సిరుత్తై (విక్రమార్కుడు రీమేక్), వీరం, వివేకం, విశ్వాసం, అన్నాత్తె సగటు మాస్ మసాలా చిత్రాలే.
అలాంటి దర్శకుడు సూర్యతో జట్టు కడుతుంటే.. ఇంకో రెగ్యులర్ మాస్ మూవీనే వస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఈసారి శివ అండ్ టీం కలిసి ఒక విజువల్ వండర్ తీస్తున్నారని.. కంగువ ఫస్ట్ టీజర్ రిలీజైనపుడే అందరికీ అర్థమైపోయింది.
అందులో విజువల్స్, సెట్టింగ్స్, ఎఫెక్ట్స్.. సూర్య లుక్స్, సినిమా నేపథ్యం అన్నీ చూసి ప్రేక్షకులకు మతి పోయింది. సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ మధ్యే వచ్చిన మరో టీజర్, తొలి పాటలో విజువల్స్ అవీ చూశాక జనాలకు మతిపోయింది. సినిమాకు హైప్ ఇంకా పెరిగిపోయింది.
ఐతే కంగువకు ఎంత హైప్ ఉన్నప్పటికీ దసరా టైంలో దానికి బాక్సాఫీస్ దగ్గర పోటీ తప్పేలా లేదు. అజిత్ మూవీ విడాముయర్చితో పాటు తెలుగులో కూడా ఏదో ఒక పేరున్న సినిమా దసరాకు రిలీజవుతుందని భావిస్తున్నారు.
ఐతే కంగువ కంటెంట్ గురించి తెలియక ఇప్పుడు పోటీకి రెడీ అవుతున్నారని.. ఈ సినిమా రిలీజయ్యాక అంతా మారిపోతుందని అంటున్నాడు ఈ చిత్ర నిర్మాత, సూర్య కజిన్ జ్ఞానవేల్ రాజా. కంగువ ఎలాంటి సినిమానో పూర్తిగా తెలియక, ఇందులో కంటెంట్ గురించి అవగాహన లేక కొన్ని సినిమాలు దీంతో పాటు పడేలా కనిపిస్తున్నాయి.
కానీ కంగువ రిలీజయ్యాక కథ మారుతుంది. కంగువ-2కు ఎవరూ పోటీ రారు. కంటెంట్ అంత బలమైంది అని జ్ఞానవేల్ రాజా అన్నాడు. ఏకంగా పది భాషల్లో విడుదలవుతున్న కంగువ సినిమా వెయ్యి కోట్ల వసూళ్లు రాబడుతుందని జ్ఞానవేల్ రాజా ధీమా వ్యక్తం చేస్తుండడం విశేషం. దసరా కానుకగా అక్టోబరు 10న కంగువ-1 విడుదలవుతుంది.
This post was last modified on August 4, 2024 10:12 am
నిన్న లండన్ సిల్వర్ స్టోన్ పార్క్ లో జరిగిన కార్ రేసింగ్ లో అజిత్ కు మద్దతు ఇచ్చేందుకు తమిళనాడు…
శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల రాజకీయం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చుట్టూనే తిరుగుతోంది. ఆయన అనుకూల…
మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…
విశాఖపట్నంలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఆశలు గల్లంతవుతున్నాయి. గతంలో ఉన్న పట్టు.. ఇప్పుడు లేకపోవడం.. గతంలో సాయిరెడ్డి వంటి…
టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…
పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…