తెలుగులో శౌర్యం అనే రెగ్యులర్ మాస్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు తమిళ సినిమాటోగ్రాఫర్ శివ. ఆ తర్వాత అతను తెలుగులో తీసిన శంఖం, దరువు.. తమిళంలో తెరకెక్కించిన సిరుత్తై (విక్రమార్కుడు రీమేక్), వీరం, వివేకం, విశ్వాసం, అన్నాత్తె సగటు మాస్ మసాలా చిత్రాలే.
అలాంటి దర్శకుడు సూర్యతో జట్టు కడుతుంటే.. ఇంకో రెగ్యులర్ మాస్ మూవీనే వస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఈసారి శివ అండ్ టీం కలిసి ఒక విజువల్ వండర్ తీస్తున్నారని.. కంగువ ఫస్ట్ టీజర్ రిలీజైనపుడే అందరికీ అర్థమైపోయింది.
అందులో విజువల్స్, సెట్టింగ్స్, ఎఫెక్ట్స్.. సూర్య లుక్స్, సినిమా నేపథ్యం అన్నీ చూసి ప్రేక్షకులకు మతి పోయింది. సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ మధ్యే వచ్చిన మరో టీజర్, తొలి పాటలో విజువల్స్ అవీ చూశాక జనాలకు మతిపోయింది. సినిమాకు హైప్ ఇంకా పెరిగిపోయింది.
ఐతే కంగువకు ఎంత హైప్ ఉన్నప్పటికీ దసరా టైంలో దానికి బాక్సాఫీస్ దగ్గర పోటీ తప్పేలా లేదు. అజిత్ మూవీ విడాముయర్చితో పాటు తెలుగులో కూడా ఏదో ఒక పేరున్న సినిమా దసరాకు రిలీజవుతుందని భావిస్తున్నారు.
ఐతే కంగువ కంటెంట్ గురించి తెలియక ఇప్పుడు పోటీకి రెడీ అవుతున్నారని.. ఈ సినిమా రిలీజయ్యాక అంతా మారిపోతుందని అంటున్నాడు ఈ చిత్ర నిర్మాత, సూర్య కజిన్ జ్ఞానవేల్ రాజా. కంగువ ఎలాంటి సినిమానో పూర్తిగా తెలియక, ఇందులో కంటెంట్ గురించి అవగాహన లేక కొన్ని సినిమాలు దీంతో పాటు పడేలా కనిపిస్తున్నాయి.
కానీ కంగువ రిలీజయ్యాక కథ మారుతుంది. కంగువ-2కు ఎవరూ పోటీ రారు. కంటెంట్ అంత బలమైంది అని జ్ఞానవేల్ రాజా అన్నాడు. ఏకంగా పది భాషల్లో విడుదలవుతున్న కంగువ సినిమా వెయ్యి కోట్ల వసూళ్లు రాబడుతుందని జ్ఞానవేల్ రాజా ధీమా వ్యక్తం చేస్తుండడం విశేషం. దసరా కానుకగా అక్టోబరు 10న కంగువ-1 విడుదలవుతుంది.
This post was last modified on August 4, 2024 10:12 am
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…