కొందరు నటులు తెర మీద ఫన్నీ క్యారెక్టర్లు వేయడమే కాదు.. బయట కూడా అంతే సరదాగా కనిపిస్తారు. మాట్లాడతారు. యువ కథానాయకుడు నవీన్ పొలిశెట్టి ఈ కోవకే చెందుతాడు. అతను తన సినిమాలను ప్రమోట్ చేసే తీరు చాలా ఫన్నీగా ఉంటుంది. ఏదైనా సినిమా వేడుకలకు హాజరైనా తన సందడే వేరుగా ఉంటుంది.
ఐతే ఇప్పుడు నవీన్ ఏ సినిమా చేయట్లేదు. ఏ వేడుకలోనూ పాల్గొనే స్థితిలో కూడా లేడు. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ రిలీజ్ తర్వాత అతను ఓ ప్రమాదంలో గాయపడి కొన్ని నెలలుగా ఇంటికే పరిమితం అయ్యాడు. ఇటీవలే చేతికి కట్టుతో ఉన్న ఫొటో పెట్టి ప్రస్తుతం తాను రెస్ట్లో ఉన్నానని.. కోలుకోవడానికి టైం పడుతుందని.. కొత్త సినిమాల చర్చలు జరుగుతున్నాయని.. వాటి గురించి త్వరలో తెలియజేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే.
తాజాగా నవీన్ తన హెల్త్ అప్డేట్ మీద ఒక ఫన్నీ వీడియో చేశాడు. అందులో తన గాయం మీద తనే పంచులు వేసుకున్నాడు. ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్ అనే వెంకీ డైలాగ్ ఉన్న ‘గణేష్’.. చెయ్ చూశావా ఎంత రఫ్గా ఉందో అంటూ చిరు డైలాగ్ పేల్చే ‘గ్యాంగ్ లీడర్’ లాంటి సినిమాల్లో సన్నివేశాలు చూస్తూ తన చేయి విషయంలో ఫ్రస్టేట్ అయ్యేలా ఈ వీడియో రూపొందించారు.
చివరికి చేత్తో అన్నం తినలేక ఇబ్బందిపడే సరదా దృశ్యం కూడా ఇందులో పెట్టారు. అన్నీ చూపించి హాస్యం లేకుంటే జీవితం లేదని.. తాను ప్రస్తుతం బాగానే కోలుకుంటున్నానని.. త్వరలోనే కొత్త సినిమాల కబుర్లు చెబుతానని తనదైన శైలిలో హెల్త్ అప్డేట్ ఇచ్చాడు నవీన్. ప్రస్తుతం నవీన్ రెండు కొత్త చిత్రాలు అంగీకరించాడని.. కొత్త ఏడాదిలో వాటి షూట్ మొదలవుతుందని సమాచారం.
This post was last modified on August 3, 2024 10:05 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…