సోషల్ మీడియాలో ఉండే స్టార్ హీరోల ఫ్యాన్స్కు తమ స్టార్ల సినిమాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ కావాలి. పదే పదే అప్డేట్స్ అంటే ఎలా అంటూ జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్లు ఫ్యాన్స్కు క్లాస్ పీకినా.. వాళ్ల ఆలోచన తీరు మారదు.
ఈ విషయంలో ఫలానా హీరో ఫ్యాన్స్ మినహాయింపు అనడానికి వీల్లేదు. అందరిదీ ఇదే బాధ. ఒక క్రేజీ మూవీలో భాగమైన ఏ ఆర్టిస్ట్, టెక్నీషియన్ సోషల్ మీడియాలో అందుబాటులోకి వచ్చినా.. అప్డేట్ అడుగుతారు.
ప్రస్తుతం టాలీవుడ్లో బిజీయెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన తమన్ తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేశాడు. ఈ సందర్భంగా తన చేతుల్లో ఉన్న క్రేజీ మూవీస్ గురించి అభిమానులు ప్రశ్నలు వేశారు. దానికి తమన్ ఓపిగ్గా సమాధానాలు ఇచ్చాడు.
సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’ నుంచి ఒక టీజర్ మాత్రమే వచ్చింది. ఈ సినిమా షూట్ హోల్డ్లో ఉండగా… కనీసం ఈ సినిమా నుంచి పాటలైనా రిలీజ్ చేయొచ్చు కదా అని అభిమానులు కోరుతున్నారు.
ఇదే విషయాన్ని తమన్ దగ్గర ప్రస్తావిస్తే.. సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయడం గురించి తాను, దర్శకుడు సుజీత్ మాట్లాడుకుంటున్నామని.. అతి త్వరలోనే దీనికి సంబంధించి అప్డేట్ ఉంటుందని తెలిపాడు. ఇక ప్రభాస్ మూవీ ‘రాజా సాబ్’ నుంచి మ్యూజిక్ ట్రీట్ ఎప్పుడు అని తమన్ను అడిగితే.. ఏప్రిల్లో ఈ చిత్రం రిలీజవుతున్న నేపథ్యంలో జనవరి నుంచి ఒక్కో పాట లాంచ్ చేస్తూ వెళ్తామని తమన్ వెల్లడించాడు.
రామ్ చరణ్ మూవీ ‘గేమ్ చేంజర్’ నుంచి రెండో పాట గురించి అడిగితే.. ఈ నెలాఖర్లో ఉండొచ్చని, ప్రమోషన్లు కూడా అప్పట్నుంచే మొదలవుతాయని చెప్పాడు. బాబీ-బాలయ్య సినిమా గురించి ప్రశ్నిస్తే.. ఈ సినిమా రష్ చూశానని.. ఒక్క మాటలో చెప్పాలంటే పండగే అని అభిమానులను ఊరించాడు తమన్.
This post was last modified on August 3, 2024 5:59 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…