సోషల్ మీడియాలో ఉండే స్టార్ హీరోల ఫ్యాన్స్కు తమ స్టార్ల సినిమాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ కావాలి. పదే పదే అప్డేట్స్ అంటే ఎలా అంటూ జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్లు ఫ్యాన్స్కు క్లాస్ పీకినా.. వాళ్ల ఆలోచన తీరు మారదు.
ఈ విషయంలో ఫలానా హీరో ఫ్యాన్స్ మినహాయింపు అనడానికి వీల్లేదు. అందరిదీ ఇదే బాధ. ఒక క్రేజీ మూవీలో భాగమైన ఏ ఆర్టిస్ట్, టెక్నీషియన్ సోషల్ మీడియాలో అందుబాటులోకి వచ్చినా.. అప్డేట్ అడుగుతారు.
ప్రస్తుతం టాలీవుడ్లో బిజీయెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన తమన్ తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేశాడు. ఈ సందర్భంగా తన చేతుల్లో ఉన్న క్రేజీ మూవీస్ గురించి అభిమానులు ప్రశ్నలు వేశారు. దానికి తమన్ ఓపిగ్గా సమాధానాలు ఇచ్చాడు.
సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’ నుంచి ఒక టీజర్ మాత్రమే వచ్చింది. ఈ సినిమా షూట్ హోల్డ్లో ఉండగా… కనీసం ఈ సినిమా నుంచి పాటలైనా రిలీజ్ చేయొచ్చు కదా అని అభిమానులు కోరుతున్నారు.
ఇదే విషయాన్ని తమన్ దగ్గర ప్రస్తావిస్తే.. సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయడం గురించి తాను, దర్శకుడు సుజీత్ మాట్లాడుకుంటున్నామని.. అతి త్వరలోనే దీనికి సంబంధించి అప్డేట్ ఉంటుందని తెలిపాడు. ఇక ప్రభాస్ మూవీ ‘రాజా సాబ్’ నుంచి మ్యూజిక్ ట్రీట్ ఎప్పుడు అని తమన్ను అడిగితే.. ఏప్రిల్లో ఈ చిత్రం రిలీజవుతున్న నేపథ్యంలో జనవరి నుంచి ఒక్కో పాట లాంచ్ చేస్తూ వెళ్తామని తమన్ వెల్లడించాడు.
రామ్ చరణ్ మూవీ ‘గేమ్ చేంజర్’ నుంచి రెండో పాట గురించి అడిగితే.. ఈ నెలాఖర్లో ఉండొచ్చని, ప్రమోషన్లు కూడా అప్పట్నుంచే మొదలవుతాయని చెప్పాడు. బాబీ-బాలయ్య సినిమా గురించి ప్రశ్నిస్తే.. ఈ సినిమా రష్ చూశానని.. ఒక్క మాటలో చెప్పాలంటే పండగే అని అభిమానులను ఊరించాడు తమన్.
This post was last modified on August 3, 2024 5:59 pm
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…