ఒకప్పుడు బాలీవుడ్ను రూల్ చేసిన పెద్ద పెద్ద స్టార్లు ఇప్పుడు దయనీయమైన స్థితిని ఎదుర్కొంటున్నారు. అక్షయ్ కుమార్ సంగతే తీసుకుంటే.. ఒక దశలో ఖాన్ త్రయానికి అతను దీటుగా నిలబడ్డాడు. నిలకడగా హిట్లు కొట్టాడు. కానీ ఇప్పుడు ఓ మోస్తరు విజయం కూడా లేక ఇబ్బంది పడుతున్నాడు. కరోనా తర్వాత అక్షయ్ ప్రేక్షకులతో డిస్కనెక్ట్ అయిపోతున్నాడు. వరుసగా 16 ఫెయిల్యూర్లు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇటీవలే ‘ఆకాశం నీ హద్దురా’ రీమేక్ ‘సర్ఫీరా’తో ప్రేక్షకులను పలకరించాడు. ఆ చిత్రాన్ని ప్రేక్షకులు ఏమాత్రం పట్టించుకోలేదు.
ఇప్పుడు అజయ్ దేవగణ్ పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. ఆయనకు కూడా కొన్నేళ్ల నుంచి సరైన విజయాలు లేవు. ఈ ఏడాది ‘మైదాన్’ చిత్రానికి మంచి టాక్ వచ్చినా కలెక్షన్లు రాలేదు. దాంతో పోలిస్తే అజయ్ కొత్త చిత్రం ‘ఆరో మే కహా దమ్ తా’ చిత్రం పరిస్థితి ఘోరంగా ఉంది.
స్పెషల్ చబ్బీస్, బేబీ, ఎం.ఎస్.ధోని లాంటి సెన్సేషనల్ మూవీస్ తీసిన నీరజ్ పాండే రూపొందించిన చిత్రమిది. అజయ్తో పాటు టబు ప్రధాన పాత్రలు పోషించారు. ఇలాంటి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రానికి మినిమం బజ్ లేదు. శుక్రవారం ఈ చిత్రం రిలీజవుతున్న సంగతి కూడా జనాలకు పట్టట్లేదు. బాలీవుడ్లో పెద్ద మాస్ హీరోగా పేరున్న అజయ్ చిత్రానికి ఇంత లో బజ్ ఎప్పుడూ లేదు.
‘సర్ఫీరా’ చిత్రానికి కేవలం రెండు కోట్ల ఓపెనింగ్స్ రాగా.. ‘ఆరో మే కహా దమ్ తా’ కూడా దాదాపుగా అదే స్థాయిలో ఆరంభ వసూళ్లు తెచ్చుకునేలా ఉంది. ఈ సినిమా ట్రైలర్ సహా ఏ ప్రోమో పెద్దగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేకపోయాయి. నీరజ్ పాండే ఫాంలో లేని విషయం అక్కడే అర్థమైపోయింది. అయినా సరే.. అజయ్ కోసమైనా జనం ఆసక్తి చూపిస్తారనుకుంటే.. అడ్వాన్స్ బుకింగ్స్ ఘోరాతి ఘోరంగా ఉన్నాయి. సినిమా టాక్ ఎలా ఉన్నా.. ఇది డిజాస్టర్ కావడం ఖాయమని ట్రేడ్ వర్గాలు ముందే ఒక అంచనాకు వచ్చేశాయి.
This post was last modified on August 1, 2024 12:55 pm
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…