పుష్ప సినిమా మొదలైనపుడు దాన్ని ఒక పార్ట్గానే తీయాలనుకున్నారు. కానీ ‘బాహుబలి’ తరహాలోనే మేకింగ్ దశలో అది రెండు భాగాలుగా మారింది. ఫస్ట్ పార్ట్కు తెలుగులో మిక్స్డ్ టాకే వచ్చినా.. సినిమాను అసంపూర్తిగా వదిలేశారన్న అసంతృప్తి వ్యక్తమైనా.. ఎలాగోలా ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గర నెట్టుకొచ్చేసింది. సెకండ్ పార్ట్కు బంపర్ క్రేజ్ వచ్చింది. కానీ ఈ చిత్రం అనుకున్న దాని కంటే చాలా ఆలస్యం అవుతుండడం ప్రతికూలంగా మారింది.
షెడ్యూల్ ప్రకారం ఇంకో రెండు వారాల్లో రిలీజ్ కావాల్సిన సినిమా.. ఏడాది చివరికి వెళ్లిపోయింది. అప్పుడైనా రిలీజవుతుందా లేదా అనే సందేహాలు కలిగాయి ఈ మధ్య. కానీ ఇప్పుడు ‘పుష్ప-2’ టీం ట్రాక్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. విదేశాల్లో ఉన్న బన్నీ వచ్చే వరకు వేరే నటీనటుల కాంబినేషన్లో సన్నివేశాలు లాగించేస్తున్నారు. ఇంకో రెండు మూడు రోజుల్లో బన్నీ షూట్లో జాయినవుతాడన్నది తాజా సమాచారం.
బన్నీ మీద క్లైమాక్స్ ఫైట్, అలాగే ఓ పాట చిత్రీకరించాల్సి ఉంది. మొత్తంగా ఇంకో నెల రోజులపైనే షూట్ మిగిలున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. పుష్ప-2ను ఎలా ముగించాలనే విషయంలో ఇప్పుడు టీంలో తర్జనభర్జనలు నడుస్తున్నట్లు సమాచారం. ఇంతకుముందైతే ‘పుష్ప-3’ తీయాలనుకున్నారు. అందుకు అనుగుణంగా కథను ఇంకాస్త పొడిగించారు. సెకండ్ పార్ట్కు ఒక ముగింపు కూడా సెట్ చేశారు. కానీ గత కొన్ని నెలల్లో పరిస్థితులు చాలా మారాయి. పుష్ప-2నే చాలా ఆలస్యమై రిలీజ్ వాయిదా పడడంతో నెగెటివిటీ తప్పలేదు. పైగా సుకుమార్, బన్నీల మధ్య కొంత డిస్టబెన్స్ కూడా వచ్చిందంటున్నారు. ఈ చిత్రం బాగా ఆలస్యం కావడం వల్ల బడ్జెట్ పెరగడంతో పాటు రకరకాల సమస్యలతో నిర్మాతలు చాలా ఇబ్బంది పడిపోయారు. ఈ పరిస్థితుల మధ్య వీళ్లంతా కలిసి ఇంకో పార్ట్ చేయడం కష్టమనే భావన యూనిట్ వర్గాల్లో నెలకొంది.
పుష్ప-2 కోసం ఎదురు చూసి చూసి విసిగిపోయిన ప్రేక్షకులు కూడా.. ఈ కథను ముగించకుండా ఇంకో పార్ట్ అంటే ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే సందేహాలు కూడా నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ముగింపు మారుద్దామా అని టీంలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. పార్ట్-2లో ఈ కథకు ఒక ఎండ్ పాయింట్ ఇస్తేనే మంచిదని.. తర్వాత పార్ట్-3 తీయాలనుకుంటే ఎలాగోలా దానికి లీడ్ తీసుకోవచ్చని.. అలా కాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో కథ మధ్యలో ఆగినట్లు చూపిస్తే ప్రతికూలమే అవుతుందని అనుకుంటున్నారట.
This post was last modified on August 1, 2024 6:36 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…