ఎంత తెలుగులో పేరున్నా బాలీవుడ్ అవకాశాలు వస్తే మన హీరోయిన్లు వాటిని అంత సులభంగా వదలుకోరు. అప్పటి శ్రీదేవి నుంచి ఇప్పటి పూజా హెగ్డే దాకా లెక్కలేనన్ని ఉదాహరణలున్నాయి. శ్రీలీల కూడా ఈ లిస్టులో చేరాలని ప్లాన్ చేసుకుంది. ఒకటి కాదు ఏకంగా రెండు ఆఫర్లు ఒప్పుకుంది.
అందులో ఒకటి వదులుకుందని ముంబై అప్డేట్. వరుణ్ ధావన్ హీరోగా అతని తండ్రి డేవిడ్ ధావన్ దర్శకత్వంలో ప్లాన్ చేసుకున్న లవ్ ఎంటర్ టైనర్ ని డేట్ల సర్దుబాటు కాలేని కారణంగా ఆ ప్రాజెక్టు నుంచి బయటికి వచ్చేసినట్టు తెలిసింది. మరో హీరోయిన్ గా ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ నటిస్తోంది.
నిజంగా అదే రీజనా లేక పాత్రకు సంబంధించిన ప్రాధాన్యం తక్కువ ఉందని ఫీలవ్వడం వల్లనా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే శ్రీలీల చేతిలో మరో మూవీ ఉంది. సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ నటించబోయే డైలర్ లో కథానాయికగా శ్రీలీలనే ఉంటుందట.
కునాల్ దేశముఖ్ దర్శకత్వంలో ఇది రూపొందనుంది. ఇబ్రహీం డెబ్యూ మూవీ సర్ జమీన్ ఇంకా షూటింగ్ పూర్తి కాకుండానే రెండోది లండన్ లో మొదలుపెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీలీల దీంట్లోనే జాయిన్ కాబోతోంది. జన్నత్ ఫేమ్ కునాల్ దేశ్ ముఖ్ దర్శకత్వంలో రొమాంటిక్ జానర్ లో రూపొందుతుంది.
జరిగేదంతా మంచికే అన్నట్టు వరుణ్ ధావన్ సరసన మిస్ కావడం శ్రీలీలకు పెద్ద నష్టమేమి కాదు. పైగా ఫామ్ లో లేని డేవిడ్ ధావన్ డైరెక్షన్ అంటే ఎలాంటి కథ ఎంచుకున్నారో తెలియదు. సో ఒక రకంగా రిస్క్ తగ్గిందని అనుకోవాలి.
గత ఏడాది అక్టోబర్ నుంచి వరస తెలుగు సినిమాలతో నెలకోసారి పలకరించిన శ్రీలీల గుంటూరు కారం తర్వాత గ్యాప్ తీసుకుంది. నితిన్ రాబిన్ హుడ్ లో ఛాన్స్ కొట్టేసి ప్రస్తుతం దాని షూటింగ్ లోనే బిజీగా ఉంది. రవితేజ, దర్శకుడు భాను భోగవరపు కాంబో మూవీ తన ఖాతాలోనే ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ వ్యవహారం మాత్రం ఇప్పట్లో తేలేలా లేదు. వెయిట్ చేయాల్సిందే.
This post was last modified on August 1, 2024 10:39 am
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…