ఎంత తెలుగులో పేరున్నా బాలీవుడ్ అవకాశాలు వస్తే మన హీరోయిన్లు వాటిని అంత సులభంగా వదలుకోరు. అప్పటి శ్రీదేవి నుంచి ఇప్పటి పూజా హెగ్డే దాకా లెక్కలేనన్ని ఉదాహరణలున్నాయి. శ్రీలీల కూడా ఈ లిస్టులో చేరాలని ప్లాన్ చేసుకుంది. ఒకటి కాదు ఏకంగా రెండు ఆఫర్లు ఒప్పుకుంది.
అందులో ఒకటి వదులుకుందని ముంబై అప్డేట్. వరుణ్ ధావన్ హీరోగా అతని తండ్రి డేవిడ్ ధావన్ దర్శకత్వంలో ప్లాన్ చేసుకున్న లవ్ ఎంటర్ టైనర్ ని డేట్ల సర్దుబాటు కాలేని కారణంగా ఆ ప్రాజెక్టు నుంచి బయటికి వచ్చేసినట్టు తెలిసింది. మరో హీరోయిన్ గా ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ నటిస్తోంది.
నిజంగా అదే రీజనా లేక పాత్రకు సంబంధించిన ప్రాధాన్యం తక్కువ ఉందని ఫీలవ్వడం వల్లనా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే శ్రీలీల చేతిలో మరో మూవీ ఉంది. సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ నటించబోయే డైలర్ లో కథానాయికగా శ్రీలీలనే ఉంటుందట.
కునాల్ దేశముఖ్ దర్శకత్వంలో ఇది రూపొందనుంది. ఇబ్రహీం డెబ్యూ మూవీ సర్ జమీన్ ఇంకా షూటింగ్ పూర్తి కాకుండానే రెండోది లండన్ లో మొదలుపెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీలీల దీంట్లోనే జాయిన్ కాబోతోంది. జన్నత్ ఫేమ్ కునాల్ దేశ్ ముఖ్ దర్శకత్వంలో రొమాంటిక్ జానర్ లో రూపొందుతుంది.
జరిగేదంతా మంచికే అన్నట్టు వరుణ్ ధావన్ సరసన మిస్ కావడం శ్రీలీలకు పెద్ద నష్టమేమి కాదు. పైగా ఫామ్ లో లేని డేవిడ్ ధావన్ డైరెక్షన్ అంటే ఎలాంటి కథ ఎంచుకున్నారో తెలియదు. సో ఒక రకంగా రిస్క్ తగ్గిందని అనుకోవాలి.
గత ఏడాది అక్టోబర్ నుంచి వరస తెలుగు సినిమాలతో నెలకోసారి పలకరించిన శ్రీలీల గుంటూరు కారం తర్వాత గ్యాప్ తీసుకుంది. నితిన్ రాబిన్ హుడ్ లో ఛాన్స్ కొట్టేసి ప్రస్తుతం దాని షూటింగ్ లోనే బిజీగా ఉంది. రవితేజ, దర్శకుడు భాను భోగవరపు కాంబో మూవీ తన ఖాతాలోనే ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ వ్యవహారం మాత్రం ఇప్పట్లో తేలేలా లేదు. వెయిట్ చేయాల్సిందే.
This post was last modified on August 1, 2024 10:39 am
సినీ రంగంలో ఎప్పుడు ఎవరి రాత మారుతుందో తెలియదు. నటులుగా చిన్న చిన్న పాత్రలు చేసిన వాళ్లు.. రైటర్లుగా, అసిస్టెంట్…
పదేళ్ల ముందు ‘దంగల్’ మూవీతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు బాలీవుడ్ సూపర్ స్టార్. ఇప్పటికీ ఇండియాస్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా పెద్ద సినిమాకు ముందస్తు బిజినెస్ జరగడం చాలా కష్టమైపోయింది. ముఖ్యంగా ఒక్క టీజర్ తోనే మొత్తం…
టాలీవుడ్ టాప్ హీరోల్లో అత్యధిక డిమాండ్ ఉన్నది ఎవరికయ్యా అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. తెలుగులోనే కాదు హిందీలోనూ…
ఇరాన్ యుద్ధ పరిణామాలు టీవీలో, సోషల్ మీడియాలో చూస్తూ తెలుసుకుంటున్న మన దేశ జనాలకు మెల్లగా దాని ప్రభావం నేరుగా…
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం కేసును రెండేళ్ల నుంచి కార్తీక దీపం సీరియల్ మాదిరి లాగుతున్నారని బీఆర్ఎస్ నేతలు…