ఎంత తెలుగులో పేరున్నా బాలీవుడ్ అవకాశాలు వస్తే మన హీరోయిన్లు వాటిని అంత సులభంగా వదలుకోరు. అప్పటి శ్రీదేవి నుంచి ఇప్పటి పూజా హెగ్డే దాకా లెక్కలేనన్ని ఉదాహరణలున్నాయి. శ్రీలీల కూడా ఈ లిస్టులో చేరాలని ప్లాన్ చేసుకుంది. ఒకటి కాదు ఏకంగా రెండు ఆఫర్లు ఒప్పుకుంది.
అందులో ఒకటి వదులుకుందని ముంబై అప్డేట్. వరుణ్ ధావన్ హీరోగా అతని తండ్రి డేవిడ్ ధావన్ దర్శకత్వంలో ప్లాన్ చేసుకున్న లవ్ ఎంటర్ టైనర్ ని డేట్ల సర్దుబాటు కాలేని కారణంగా ఆ ప్రాజెక్టు నుంచి బయటికి వచ్చేసినట్టు తెలిసింది. మరో హీరోయిన్ గా ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ నటిస్తోంది.
నిజంగా అదే రీజనా లేక పాత్రకు సంబంధించిన ప్రాధాన్యం తక్కువ ఉందని ఫీలవ్వడం వల్లనా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే శ్రీలీల చేతిలో మరో మూవీ ఉంది. సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ నటించబోయే డైలర్ లో కథానాయికగా శ్రీలీలనే ఉంటుందట.
కునాల్ దేశముఖ్ దర్శకత్వంలో ఇది రూపొందనుంది. ఇబ్రహీం డెబ్యూ మూవీ సర్ జమీన్ ఇంకా షూటింగ్ పూర్తి కాకుండానే రెండోది లండన్ లో మొదలుపెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీలీల దీంట్లోనే జాయిన్ కాబోతోంది. జన్నత్ ఫేమ్ కునాల్ దేశ్ ముఖ్ దర్శకత్వంలో రొమాంటిక్ జానర్ లో రూపొందుతుంది.
జరిగేదంతా మంచికే అన్నట్టు వరుణ్ ధావన్ సరసన మిస్ కావడం శ్రీలీలకు పెద్ద నష్టమేమి కాదు. పైగా ఫామ్ లో లేని డేవిడ్ ధావన్ డైరెక్షన్ అంటే ఎలాంటి కథ ఎంచుకున్నారో తెలియదు. సో ఒక రకంగా రిస్క్ తగ్గిందని అనుకోవాలి.
గత ఏడాది అక్టోబర్ నుంచి వరస తెలుగు సినిమాలతో నెలకోసారి పలకరించిన శ్రీలీల గుంటూరు కారం తర్వాత గ్యాప్ తీసుకుంది. నితిన్ రాబిన్ హుడ్ లో ఛాన్స్ కొట్టేసి ప్రస్తుతం దాని షూటింగ్ లోనే బిజీగా ఉంది. రవితేజ, దర్శకుడు భాను భోగవరపు కాంబో మూవీ తన ఖాతాలోనే ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ వ్యవహారం మాత్రం ఇప్పట్లో తేలేలా లేదు. వెయిట్ చేయాల్సిందే.
This post was last modified on August 1, 2024 10:39 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…