ఎంత తెలుగులో పేరున్నా బాలీవుడ్ అవకాశాలు వస్తే మన హీరోయిన్లు వాటిని అంత సులభంగా వదలుకోరు. అప్పటి శ్రీదేవి నుంచి ఇప్పటి పూజా హెగ్డే దాకా లెక్కలేనన్ని ఉదాహరణలున్నాయి. శ్రీలీల కూడా ఈ లిస్టులో చేరాలని ప్లాన్ చేసుకుంది. ఒకటి కాదు ఏకంగా రెండు ఆఫర్లు ఒప్పుకుంది.
అందులో ఒకటి వదులుకుందని ముంబై అప్డేట్. వరుణ్ ధావన్ హీరోగా అతని తండ్రి డేవిడ్ ధావన్ దర్శకత్వంలో ప్లాన్ చేసుకున్న లవ్ ఎంటర్ టైనర్ ని డేట్ల సర్దుబాటు కాలేని కారణంగా ఆ ప్రాజెక్టు నుంచి బయటికి వచ్చేసినట్టు తెలిసింది. మరో హీరోయిన్ గా ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ నటిస్తోంది.
నిజంగా అదే రీజనా లేక పాత్రకు సంబంధించిన ప్రాధాన్యం తక్కువ ఉందని ఫీలవ్వడం వల్లనా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే శ్రీలీల చేతిలో మరో మూవీ ఉంది. సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ నటించబోయే డైలర్ లో కథానాయికగా శ్రీలీలనే ఉంటుందట.
కునాల్ దేశముఖ్ దర్శకత్వంలో ఇది రూపొందనుంది. ఇబ్రహీం డెబ్యూ మూవీ సర్ జమీన్ ఇంకా షూటింగ్ పూర్తి కాకుండానే రెండోది లండన్ లో మొదలుపెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీలీల దీంట్లోనే జాయిన్ కాబోతోంది. జన్నత్ ఫేమ్ కునాల్ దేశ్ ముఖ్ దర్శకత్వంలో రొమాంటిక్ జానర్ లో రూపొందుతుంది.
జరిగేదంతా మంచికే అన్నట్టు వరుణ్ ధావన్ సరసన మిస్ కావడం శ్రీలీలకు పెద్ద నష్టమేమి కాదు. పైగా ఫామ్ లో లేని డేవిడ్ ధావన్ డైరెక్షన్ అంటే ఎలాంటి కథ ఎంచుకున్నారో తెలియదు. సో ఒక రకంగా రిస్క్ తగ్గిందని అనుకోవాలి.
గత ఏడాది అక్టోబర్ నుంచి వరస తెలుగు సినిమాలతో నెలకోసారి పలకరించిన శ్రీలీల గుంటూరు కారం తర్వాత గ్యాప్ తీసుకుంది. నితిన్ రాబిన్ హుడ్ లో ఛాన్స్ కొట్టేసి ప్రస్తుతం దాని షూటింగ్ లోనే బిజీగా ఉంది. రవితేజ, దర్శకుడు భాను భోగవరపు కాంబో మూవీ తన ఖాతాలోనే ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ వ్యవహారం మాత్రం ఇప్పట్లో తేలేలా లేదు. వెయిట్ చేయాల్సిందే.
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…