అల్లు శిరీష్ కొత్త సినిమా బడ్డీ ఎల్లుండి థియేటర్లలో అడుగు పెట్టనుంది. విపరీతమైన పోటీ ఉన్నా సరే కంటెంట్ మీద నమ్మకంతో నాన్ స్టాప్ గా ప్రమోషన్లు చేసుకుంటున్న బన్నీ తమ్ముడు ఫలితం మీద చాలా నమ్మకంగా ఉన్నాడు. అయితే తన మాటల్లో చాలా ప్రాక్టికాలిటీ (వాస్తవిక కోణం) కనిపించడం అభిమానులను ఆకట్టుకుంటోంది.
కేవలం మాటల ద్వారానే కాకుండా చేతల్లోనూ చూపిస్తున్నాడు. బడ్డీకి మల్టీప్లెక్సుల్లో 125, సింగల్ స్క్రీన్లలో 99 రూపాయలు టికెట్ రేట్లు పెట్టడం ద్వారా దాన్ని అమలులో పెట్టించాడు. ఇవాళ హైదరాబాద్ లో మీడియాతో ముచ్చటించాడు.
అందులో ఒక ప్రశ్నకు భాగంగా మాట్లాడుతూ హిందీ మాట్లాడే జనాభా 90 కోట్లు ఉన్నప్పటికీ థియేటర్లకు వచ్చే వాళ్ళు మాత్రం మూడు నుంచి నాలుగు కోట్లు మాత్రమే ఉంటారని, అదే తెలుగు కేవలం 10 కోట్ల మందే మాట్లాడినప్పటికీ సినిమా హాళ్లకు 3 కోట్లకు పైగా వస్తారని, దీన్ని బట్టే టాలీవుడ్ ప్రేక్షకులు మనల్ని ఎంతగా ఇష్టపడుతున్నారో అర్థం చేసుకోవాలన్నాడు.
బంగారు బాతుని చంపేసి తిన్నట్టు కాకుండా ఇంకా ఎక్కువ శాతం ఆడియన్స్ రావాలంటే అందుబాటు ధరల్లో టికెట్ రేట్లు పెట్టడం ద్వారా మరింత వసూళ్లు రాబట్టుకోవచ్చని, అందుకే బడ్డీ ఇలా చేశామని వివరించాడు.
శిరీష్ మాట్లాడిన దాంట్లో పూర్తి లాజిక్ ఉంది. చిన్న సినిమాలకు కనీస ఓపెనింగ్స్ రాకపోవడానికి కారణం ముమ్మాటికి టికెట్ రేట్లే. కొన్నిసార్లు ఇష్టానుసారం పెంచుకుంటూ పోవడం దారుణమైన ఫలితాలను ఇస్తోంది. భారతీయుడు 2 మంచి ఉదాహరణ.
ఇప్పుడు బడ్డీ మోడల్ కనక సక్సెస్ అయితే మరింత నిర్మాతలు ఇదే దారిని అనుసరించే అవకాశం లేకపోలేదు. స్టూడియో గ్రీన్ బ్యానర్ మీద జ్ఞానవేల్ రాజా నిర్మించిన బడ్డీ ముఖ్యంగా చిన్నపిల్లలను బలంగా టార్గెట్ చేసుకుంది. ఇప్పుడీ 99 రూపాయల టికెట్ల ద్వారా కుటుంబాలు ఎక్కువగా వస్తాయనే ఆశాభావం శిరీష్ బృందంలో ఉంది.
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…