అల్లు శిరీష్ కొత్త సినిమా బడ్డీ ఎల్లుండి థియేటర్లలో అడుగు పెట్టనుంది. విపరీతమైన పోటీ ఉన్నా సరే కంటెంట్ మీద నమ్మకంతో నాన్ స్టాప్ గా ప్రమోషన్లు చేసుకుంటున్న బన్నీ తమ్ముడు ఫలితం మీద చాలా నమ్మకంగా ఉన్నాడు. అయితే తన మాటల్లో చాలా ప్రాక్టికాలిటీ (వాస్తవిక కోణం) కనిపించడం అభిమానులను ఆకట్టుకుంటోంది.
కేవలం మాటల ద్వారానే కాకుండా చేతల్లోనూ చూపిస్తున్నాడు. బడ్డీకి మల్టీప్లెక్సుల్లో 125, సింగల్ స్క్రీన్లలో 99 రూపాయలు టికెట్ రేట్లు పెట్టడం ద్వారా దాన్ని అమలులో పెట్టించాడు. ఇవాళ హైదరాబాద్ లో మీడియాతో ముచ్చటించాడు.
అందులో ఒక ప్రశ్నకు భాగంగా మాట్లాడుతూ హిందీ మాట్లాడే జనాభా 90 కోట్లు ఉన్నప్పటికీ థియేటర్లకు వచ్చే వాళ్ళు మాత్రం మూడు నుంచి నాలుగు కోట్లు మాత్రమే ఉంటారని, అదే తెలుగు కేవలం 10 కోట్ల మందే మాట్లాడినప్పటికీ సినిమా హాళ్లకు 3 కోట్లకు పైగా వస్తారని, దీన్ని బట్టే టాలీవుడ్ ప్రేక్షకులు మనల్ని ఎంతగా ఇష్టపడుతున్నారో అర్థం చేసుకోవాలన్నాడు.
బంగారు బాతుని చంపేసి తిన్నట్టు కాకుండా ఇంకా ఎక్కువ శాతం ఆడియన్స్ రావాలంటే అందుబాటు ధరల్లో టికెట్ రేట్లు పెట్టడం ద్వారా మరింత వసూళ్లు రాబట్టుకోవచ్చని, అందుకే బడ్డీ ఇలా చేశామని వివరించాడు.
శిరీష్ మాట్లాడిన దాంట్లో పూర్తి లాజిక్ ఉంది. చిన్న సినిమాలకు కనీస ఓపెనింగ్స్ రాకపోవడానికి కారణం ముమ్మాటికి టికెట్ రేట్లే. కొన్నిసార్లు ఇష్టానుసారం పెంచుకుంటూ పోవడం దారుణమైన ఫలితాలను ఇస్తోంది. భారతీయుడు 2 మంచి ఉదాహరణ.
ఇప్పుడు బడ్డీ మోడల్ కనక సక్సెస్ అయితే మరింత నిర్మాతలు ఇదే దారిని అనుసరించే అవకాశం లేకపోలేదు. స్టూడియో గ్రీన్ బ్యానర్ మీద జ్ఞానవేల్ రాజా నిర్మించిన బడ్డీ ముఖ్యంగా చిన్నపిల్లలను బలంగా టార్గెట్ చేసుకుంది. ఇప్పుడీ 99 రూపాయల టికెట్ల ద్వారా కుటుంబాలు ఎక్కువగా వస్తాయనే ఆశాభావం శిరీష్ బృందంలో ఉంది.
This post was last modified on July 31, 2024 6:17 pm
డిసెంబర్ 3 ఎప్పుడెప్పుడు వస్తుందాని ప్రభాస్ అభిమానులు కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ముందు రోజే ప్రీమియర్లు ఉంటాయని…
లోకనాయకుడు కమల్ హాసన్ పనైపోయిందనుకున్న సమయంలో ఆయన అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చిన సినిమా.. విక్రమ్. ఆ సినిమాతోనే సౌత్…
తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష,…
గుజరాత్లో చాందిపుర వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 22 మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర…
సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. తమ సినిమాలను ప్రమోట్ చేయడం కోసం తెలుగు రాష్ట్రాలకు…
మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…