Movie News

శిరీష్ చెప్పిన టికెట్ రేట్ల లాజిక్ సరైందే

అల్లు శిరీష్ కొత్త సినిమా బడ్డీ ఎల్లుండి థియేటర్లలో అడుగు పెట్టనుంది. విపరీతమైన పోటీ ఉన్నా సరే కంటెంట్ మీద నమ్మకంతో నాన్ స్టాప్ గా ప్రమోషన్లు చేసుకుంటున్న బన్నీ తమ్ముడు ఫలితం మీద చాలా నమ్మకంగా ఉన్నాడు. అయితే తన మాటల్లో చాలా ప్రాక్టికాలిటీ (వాస్తవిక కోణం) కనిపించడం అభిమానులను ఆకట్టుకుంటోంది.

కేవలం మాటల ద్వారానే కాకుండా చేతల్లోనూ చూపిస్తున్నాడు. బడ్డీకి మల్టీప్లెక్సుల్లో 125, సింగల్ స్క్రీన్లలో 99 రూపాయలు టికెట్ రేట్లు పెట్టడం ద్వారా దాన్ని అమలులో పెట్టించాడు. ఇవాళ హైదరాబాద్ లో మీడియాతో ముచ్చటించాడు.

అందులో ఒక ప్రశ్నకు భాగంగా మాట్లాడుతూ హిందీ మాట్లాడే జనాభా 90 కోట్లు ఉన్నప్పటికీ థియేటర్లకు వచ్చే వాళ్ళు మాత్రం మూడు నుంచి నాలుగు కోట్లు మాత్రమే ఉంటారని, అదే తెలుగు కేవలం 10 కోట్ల మందే మాట్లాడినప్పటికీ సినిమా హాళ్లకు 3 కోట్లకు పైగా వస్తారని, దీన్ని బట్టే టాలీవుడ్ ప్రేక్షకులు మనల్ని ఎంతగా ఇష్టపడుతున్నారో అర్థం చేసుకోవాలన్నాడు.

బంగారు బాతుని చంపేసి తిన్నట్టు కాకుండా ఇంకా ఎక్కువ శాతం ఆడియన్స్ రావాలంటే అందుబాటు ధరల్లో టికెట్ రేట్లు పెట్టడం ద్వారా మరింత వసూళ్లు రాబట్టుకోవచ్చని, అందుకే బడ్డీ ఇలా చేశామని వివరించాడు.

శిరీష్ మాట్లాడిన దాంట్లో పూర్తి లాజిక్ ఉంది. చిన్న సినిమాలకు కనీస ఓపెనింగ్స్ రాకపోవడానికి కారణం ముమ్మాటికి టికెట్ రేట్లే. కొన్నిసార్లు ఇష్టానుసారం పెంచుకుంటూ పోవడం దారుణమైన ఫలితాలను ఇస్తోంది. భారతీయుడు 2 మంచి ఉదాహరణ.

ఇప్పుడు బడ్డీ మోడల్ కనక సక్సెస్ అయితే మరింత నిర్మాతలు ఇదే దారిని అనుసరించే అవకాశం లేకపోలేదు. స్టూడియో గ్రీన్ బ్యానర్ మీద జ్ఞానవేల్ రాజా నిర్మించిన బడ్డీ ముఖ్యంగా చిన్నపిల్లలను బలంగా టార్గెట్ చేసుకుంది. ఇప్పుడీ 99 రూపాయల టికెట్ల ద్వారా కుటుంబాలు ఎక్కువగా వస్తాయనే ఆశాభావం శిరీష్ బృందంలో ఉంది.

This post was last modified on July 31, 2024 6:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

8 minutes ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

42 minutes ago

చిరంజీవి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది

ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…

2 hours ago

పెద్దిని వద్దనుకుంటే ఎవరికి నష్టం

నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…

3 hours ago

“రాహుల్-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు!“

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌లు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీల‌కు కేర‌ళలో తీవ్ర‌నిర‌స‌న సెగ త‌గులుతోంది. రాహుల్‌-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు.…

3 hours ago

పవన్ చెప్తే చేస్తాడండోయ్

నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…

4 hours ago