‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్బస్టర్ తర్వాత హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన సినిమా.. రామయ్యా వస్తావయ్యా. అలాంటి సెన్సేషనల్ హిట్ కొట్టిన దర్శకుడితో జూనియర్ ఎన్టీఆర్ లాంటి పెద్ద స్టార్తో హరీష్ జత కడితే అంచనాలు ఏ స్థాయిలో ఉండి ఉంటాయో చెప్పేదేముంది? కానీ ఈ క్రేజీ కాంబినేషన్లో వచ్చిన చిత్రం పెద్ద డిజాస్టర్ అయింది. ప్రేక్షకులను కనీస స్థాయిలో కూడా మెప్పించలేక బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది.
తారక్, హరీష్ ఇద్దరి కెరీర్లలోనూ ఇది పెద్ద డిజాస్టర్లలో ఒకటి. నిర్మాత దిల్ రాజు సైతం తనకు అత్యధిక నష్టాలు తెచ్చిపెట్టిన చిత్రాల్లో ఇదొకటని చెప్పుకున్నారు. ఐతే ఎలాంటి దర్శకుడైనా సినిమా పోయాక దాని మీద పోస్టు మార్టం చేసుకుంటాడు. హరీష్ శంకర్ సైతం అదే చేసుకున్నాడట. ఆ సినిమా ఎందుకు పోయిందో తనకు తర్వాత అర్థమైందని తాజాగా ఒక ఇంటర్వ్యూలో హరీష్ చెప్పాడు.
‘రామయ్యా వస్తావయ్యా’కు సెకండాఫే సమస్య అని హరీష్ చెప్పాడు. ఇంటర్వల్లోనే మెయిన్ విలన్ చనిపోతాడని.. అక్కడే సినిమా అయిపోయిందని.. ముందే ప్రధాన విలన్ చనిపోవడంతో ఇంక చూడ్డానికి ఏముందని ప్రేక్షకులు ఫీలయ్యారని హరీష్ అన్నాడు. సెకండాఫ్ కథ, స్క్రీన్ ప్లే సరిగా చేసుకోలేదని ఆయన చెప్పాడు.
ఐతే తన కెరీర్లో అత్యంత కష్టపడ్డ సినిమా ‘రామయ్యా వస్తావయ్యా’నే అని హరీష్ చెప్పడం గమనార్హం. ‘మిరపకాయ్’; ‘గబ్బర్ సింగ్’ తర్వాత తన మీద అంచనాలు పెరిగాయని.. తాను కూడా హ్యాట్రిక్ కొట్టాలన్న ఉద్దేశంతో ఆ సినిమాకు ఎంతో కష్టపడి పని చేశానని.. కానీ కష్టానికి ఫలితం దక్కలేదని.. ఈ సినిమా ఫెయిల్యూర్ విషయంలో తాను ఎవ్వరినీ నిందించని.. అందుకు పూర్తి బాధ్యత తనదే అని హరీష్ స్పష్టం చేశాడు. తాను సక్సెస్ను వేరే వాళ్లకు ఆపాదిస్తాను తప్ప, ఫెయిల్యూర్ను మాత్రం తనే తీసుకుంటానని అన్నాడు.
This post was last modified on July 30, 2024 2:17 pm
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…