ది రాజా సాబ్ విడుదల తేదీ టీజర్ తో పాటు అధికారికంగా వచ్చేసింది. వచ్చే సంవత్సరం ఏప్రిల్ 10 గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్టు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అఫీషియల్ గా ప్రకటించింది. దీనికి తేజ సజ్జ కనెక్షన్ ఏంటనే పాయింట్ కు వద్దాం.
మిరాయ్ మూడు నెలల క్రితమే ఏప్రిల్ 18 వరల్డ్ వైడ్ రిలీజ్ ఉంటుందని హీరో పుట్టినరోజు సందర్భంగా వదిలిన టీజర్ లో చెప్పింది. రెండింటి నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీనే. కేవలం వారం గ్యాప్ లో రెండు పెద్ద ప్యాన్ ఇండియా సినిమాలు ఒకే బ్యానర్ వి థియేటర్లలో రావడం అంత సేఫ్ కాదు. ప్రభాస్ కాదు కానీ తేజ సజ్జకి రిస్క్ ఉంటుంది.
ఈ లెక్కన మిరాయ్ వాయిదా పడినట్టే అనుకోవాలి. లేదంటే గత ఏడాది సంక్రాంతికి మైత్రి మూవీ మేకర్స్ ఒక్క రోజు గ్యాప్ లో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి రిలీజ్ చేసినట్టు పీపుల్స్ మీడియా కూడా చేస్తుందా అనేది వేచి చూడాలి.
నిజానికి ది రాజా సాబ్ కన్నా చాలా ఆలస్యంగా మిరాయ్ మొదలైంది. షూటింగ్ క్రమం తప్పకుండ జరుగుతోంది కానీ విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉన్న దృష్ట్యా పోస్ట్ ప్రొడక్షన్ కోసం అధిక సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఈగల్ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఫాంటసీ థ్రిల్లర్ లో మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
వీటికి సంబంధించిన స్పష్టత మరికొద్ది రోజుల్లో వచ్చేస్తుంది కానీ అప్పటిదాకా వేచి చూడాల్సిందే. హనుమాన్ బ్లాక్ బస్టర్ తర్వాత తొందరపడకుండా నిర్ణయాలు తీసుకుంటున్న తేజ సజ్జకు మిరాయ్ చాలా కీలకం. అనూహ్యంగా వచ్చిన ప్యాన్ ఇండియా ఇమేజ్ ని మరింత బలోపేతం చేసుకోవాలనే లక్ష్యంతో ఉన్నాడు.
అందుకే ఆలస్యమవుతుందని తెలిసినా మిరాయ్ కే ఎక్కువ డేట్లు ఇచ్చి దాని కోసమే ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు ది రాజా సాబ్ వల్ల ఇంకా లేట్ అవుతుందా లేక కాస్త ముందుకొచ్చి ఫిబ్రవరి లేదా మార్చి ఆప్షన్లు చూస్తుందా అనేది కాస్త వెయిట్ చేశాక క్లారిటీ ఉంటుంది. చూద్దాం.
This post was last modified on July 29, 2024 6:42 pm
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…