Movie News

ప్రేమ కావాలి చేజారి రేయ్ దక్కింది

ప్రతి బియ్యం మెతుకు మీద తినేవాడి పేరు రాసిపెట్టి ఉంటుందన్నట్టు ఈ సామెత సినిమాలకూ వర్తిస్తుంది. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, మన్మథుడు లాంటి క్లాసిక్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు విజయ్ భాస్కర్ కొంత గ్యాప్ తర్వాత చేస్తున్న మూవీ ఉషా పరిణయం. ఆగస్ట్ 2 థియేటర్లలో విడుదల కానుంది. కొడుకు శ్రీకమల్ తో ఆయన తీసిన జిలేబి అంచనాలు అందుకోలేకపోయినా మరోసారి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సాయి ధరమ్ తేజ్ ముఖ్యఅతిథిగా రాగా ఒక ఆసక్తికరమైన విషయం బయట పడింది.

ఇది పద్నాలుగు సంవత్సరాల క్రితం సంగతి. పవన్ కళ్యాణ్ నిర్మాతగా సాయి ధరమ్ తేజ్ డెబ్యూని తొలుత విజయ్ భాస్కర్ దర్శకత్వంలోనే ప్లాన్ చేశారు. అదే ప్రేమ కావాలి. కానీ ఎందుకో కార్యరూపం దాల్చలేదు. కట్ చేస్తే ఆ కథనే తీసుకుని ఆది సాయికుమార్ ని టాలీవుడ్ కు లాంచ్ చేశారు. మంచి విజయంతో వసూళ్లు, ఆఫర్లు రెండూ తీసుకొచ్చింది. అదే సమయంలో వైవిఎస్ చౌదరి ప్లాన్ చేసుకున్న రేయ్ ద్వారా ఆది సాయికుమార్ పరిచయం కావాలి. కానీ అనూహ్య పరిణామంతో అది కాస్తా సాయి ధరమ్ తేజ్ డెబ్యూ అయ్యింది. ఫలితం ఏమయ్యిందో చూశాం.

చిన్న చిత్రాల పెద్ద పోటీ మధ్య ఉషా పరిణయంని తీసుకొస్తున్నారు విజయ్ భాస్కర్. క్లీన్ మూవీగా అన్ని వర్గాలను అలరిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేవలం రెండు వారాల గ్యాప్ లో పెద్ద సినిమాలు వస్తున్న నేపథ్యంలో దీనికి ఓపెనింగ్స్ కీలకంగా మారబోతున్నాయి. కల్ట్ డైరెక్టర్ గా వెంకటేష్, చిరంజీవి, నాగార్జున లాంటి అగ్ర హీరోలను డైరెక్ట్ చేసిన విజయ భాస్కర్ కు ఉషా పరిణయం కొడుకుకో హిట్ ఇవ్వడంతో పాటు ఆయనకూ కొత్త ఇన్నింగ్స్ కి దారివ్వాలి. అది ఎంత వరకు నెరవేరుతుందో ఈ శుక్రవారం తేలనుంది. తన్వీ ఆకాంక్ష హీరోయిన్ గా నటించింది.

This post was last modified on July 29, 2024 11:45 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తొమ్మిది రోజులే ఉంది భగత్ గారూ !

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కౌంట్ డౌన్ వేగంగా జరిగిపోతోంది. మార్చి 26 రావాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ హఠాత్తుగా మార్చి…

55 minutes ago

తెలివైన స్ట్రాటజీతో ఎన్టీఆర్ & నీల్

టాలీవుడ్ మోస్ట్ క్రేజీ మూవీస్ లో ఒకటిగా నిర్మాణంలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ ప్యాన్ ప్యాన్…

1 hour ago

మెడికో దీపిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ

విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో పీజీ వైద్య విద్యార్థిని బత్తుల దీపిక ఆత్మహత్య కేసులో కీలక మలుపు తిరిగింది.…

3 hours ago

స‌భ్య‌త్వం సౌండ్ లేదు సైనికా

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క రోల్ పోషిస్తున్న జ‌న‌సేన పార్టీ.. ఈ ఏడాది పార్టీ స‌భ్య‌త్వాన్ని గత నెల‌లోనే ప్రారంభించిన…

6 hours ago

మార‌క‌పోతే మార్చేస్తా.. త‌మ్ముళ్ల‌కు బాబు హెచ్చరిక‌

పార్టీ విధానాల‌కు, సిద్ధాంతాల‌కు అనుగుణంగా నాయ‌కులు ప‌నిచేయాల‌ని.. ఎమ్మెల్యేలు-ఎంపీలు క‌లివిడిగా ఉండాల‌ని సీఎం చంద్ర‌బాబు టీడీపీ నాయ‌కుల‌కు సూచించారు. నంద్యాల…

8 hours ago