Movie News

ప్రేమ కావాలి చేజారి రేయ్ దక్కింది

ప్రతి బియ్యం మెతుకు మీద తినేవాడి పేరు రాసిపెట్టి ఉంటుందన్నట్టు ఈ సామెత సినిమాలకూ వర్తిస్తుంది. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, మన్మథుడు లాంటి క్లాసిక్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు విజయ్ భాస్కర్ కొంత గ్యాప్ తర్వాత చేస్తున్న మూవీ ఉషా పరిణయం. ఆగస్ట్ 2 థియేటర్లలో విడుదల కానుంది. కొడుకు శ్రీకమల్ తో ఆయన తీసిన జిలేబి అంచనాలు అందుకోలేకపోయినా మరోసారి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సాయి ధరమ్ తేజ్ ముఖ్యఅతిథిగా రాగా ఒక ఆసక్తికరమైన విషయం బయట పడింది.

ఇది పద్నాలుగు సంవత్సరాల క్రితం సంగతి. పవన్ కళ్యాణ్ నిర్మాతగా సాయి ధరమ్ తేజ్ డెబ్యూని తొలుత విజయ్ భాస్కర్ దర్శకత్వంలోనే ప్లాన్ చేశారు. అదే ప్రేమ కావాలి. కానీ ఎందుకో కార్యరూపం దాల్చలేదు. కట్ చేస్తే ఆ కథనే తీసుకుని ఆది సాయికుమార్ ని టాలీవుడ్ కు లాంచ్ చేశారు. మంచి విజయంతో వసూళ్లు, ఆఫర్లు రెండూ తీసుకొచ్చింది. అదే సమయంలో వైవిఎస్ చౌదరి ప్లాన్ చేసుకున్న రేయ్ ద్వారా ఆది సాయికుమార్ పరిచయం కావాలి. కానీ అనూహ్య పరిణామంతో అది కాస్తా సాయి ధరమ్ తేజ్ డెబ్యూ అయ్యింది. ఫలితం ఏమయ్యిందో చూశాం.

చిన్న చిత్రాల పెద్ద పోటీ మధ్య ఉషా పరిణయంని తీసుకొస్తున్నారు విజయ్ భాస్కర్. క్లీన్ మూవీగా అన్ని వర్గాలను అలరిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేవలం రెండు వారాల గ్యాప్ లో పెద్ద సినిమాలు వస్తున్న నేపథ్యంలో దీనికి ఓపెనింగ్స్ కీలకంగా మారబోతున్నాయి. కల్ట్ డైరెక్టర్ గా వెంకటేష్, చిరంజీవి, నాగార్జున లాంటి అగ్ర హీరోలను డైరెక్ట్ చేసిన విజయ భాస్కర్ కు ఉషా పరిణయం కొడుకుకో హిట్ ఇవ్వడంతో పాటు ఆయనకూ కొత్త ఇన్నింగ్స్ కి దారివ్వాలి. అది ఎంత వరకు నెరవేరుతుందో ఈ శుక్రవారం తేలనుంది. తన్వీ ఆకాంక్ష హీరోయిన్ గా నటించింది.

This post was last modified on July 29, 2024 11:45 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎమ్మెల్యే పుత్రుడు వర్సెస్ మాజీ ఎమ్మెల్యే కొడుకు

ఏపీలోని పలు పురపాలికల్లో ఖాళీగా ఉన్న పదవుల భర్తీ నేపథ్యంలో తిరుపతిలో ఆదివారం నుంచి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.…

13 minutes ago

SSMB 29 : ఊహకందని స్థాయిలో రాజమౌళి స్కెచ్!

మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఎందరో ఫిలిం మేకర్స్ ఎదురు చూస్తున్న ఎస్ఎస్ఎంబి 29 ఇటీవలే మొదలైన సంగతి తెలిసిందే.…

14 minutes ago

ఉప ఎన్నికలకు సిద్ఘమంటున్న కేటీఆర్

తెలంగాణలో ఉప ఎన్నికలు జరగనున్నాయా? ఈ దిశగా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ప్రకటన ఏమైనా వచ్చిందా? అలాంటిదేమీ లేకున్నా..…

47 minutes ago

ఆ చేప రేటు 3.95 లక్షలు.. ఎందుకంటే…

కాకినాడ సముద్ర తీరంలో మత్స్యకారులకు చిక్కిన కచిడి చేప అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. 25 కిలోల బరువున్న ఈ చేప మార్కెట్‌లో…

1 hour ago

ఈసారి ‘అక్కినేని లెక్కలు’ మారబోతున్నాయా

ఫిబ్రవరి ఏడు కోసం అక్కినేని అభిమానుల ఎదురు చూపులు మాములుగా లేవు. గత కొంత కాలంగా గట్టిగా చెప్పుకునే బ్లాక్…

1 hour ago

ఆగని పూజా ఫ్లాప్ స్ట్రీక్…

అరవింద సమేత.. మహర్షి.. గద్దలకొండ గణేష్.. అల వైకుంఠపురములో... ఇలా ఒక టైంలో తెలుగులో వరుస సక్సెస్‌లతో తిరుగులేని క్రేజ్…

2 hours ago